ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు నారా మంత్రి నారా లోకేశ్ మరోసారి పప్పులో కాలేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి లోకేష్ గుంటూరు జిల్లాలోని మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇవాళ ప్రచారంలో భాగంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ..ఏప్రిల్ తొమ్మిదో తేదీన ఎన్నికలు జరుగనున్నాయని, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని కోరారు. దీంతో లోకేష్ వ్యాఖ్యలతో అక్కడున్న పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా షాకుకు గురైయ్యారు.
కాగా లోకేష్ వీడియో ను మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ట్వీట్ చేస్తూ… లోకేష్ గారి అభ్యర్థన మేరకు ఏప్రిల్ 9న సైకిల్ గుర్తుకు ఓటు వేయండి ఏప్రిల్ 11న ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి అంటూ… వోట్ ఫర్ ఫ్యాన్ అని యష్ ట్యాగ్ పెట్టి ట్వీట్ చేశారు.
.@naralokesh గారి అభ్యర్థన మేరకు ఏప్రిల్ 9న సైకిల్ గుర్తుకు ఓటు వేయండి
ఏప్రిల్ 11న ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి#VoteForFan #TDPLosing pic.twitter.com/DMzYMNA2H2
— Rama Krishna Reddy A (@MlaRKR) March 21, 2019