Home / 18+ / నాగేశ్వరరెడ్డినే జగన్ ఎందుకు పీఏగా నియమించుకున్నారో తెలుసా.?

నాగేశ్వరరెడ్డినే జగన్ ఎందుకు పీఏగా నియమించుకున్నారో తెలుసా.?

ఏపీ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పీఏగా కె.నాగేశ్వరరెడ్డి నియమితులయ్యారు. కడపజిల్లా పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయం పీఏగా డి.రవిశేఖర్‌ ను నియమించారు. ఈమేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. నాగేశ్వరరెడ్డి 2008నుంచి అంటే రాజశేఖరరెడ్డి చనిపోకముందు నుంచీ జగన్‌తోనే ఉంటున్నారు. నాగేశ్వరరెడ్డి కడప జిల్లాకు చెందిన వ్యక్తి.. గతంలో వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేసిన ఆయన జగన్ కు విధేయుడిగా, నమ్మినబంటుగా ఉంటున్నారు. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రలో నాగేశ్వరరెడ్డి కీలకంగా వ్యవహరించారు.

 

విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై దాడి జరిగిన సమయంలోనూ ఆయన పక్కనే ఉన్నారు. ఈ కేసులో ఆయన విచారణకు సైతం హాజరయ్యారు. అలాగే వైసీపీ అధికారంలోకి వ్చచేందుకు దోహదపడిన వివిధ వర్గాల నేతలతో జగన్ ఆత్మీ సమావేశాలు నిర్వహించడంలో నాగేశ్వరరెడ్డి కీలక పాత్ర పోషించారు. జగన్ ని వ్యక్తిగతంగా శ్రద్ధగా చూసుకోవడంతోపాటు పార్టీపరంగా ఎంతో కష్టపడ్డారు.. ఈ నేపథ్యంలోనే ఆయనను జగన్ నాగేశ్వరరెడ్డిని తన పీఏగా నియమించుకున్నట్టు తెలుస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat