తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం ఈ రోజు బుధవారం సమావేశం కానుంది. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఈ క్యాబినేట్ సమావేశం జరగనున్నది. ఈ సమీక్ష సమావేశంలో కొత్తగా ప్రవేశ పెట్టనున్న మున్సిపల్ బిల్లుతో పాటుగా గతంలో జారీచేసిన పలు ఆర్డినెన్స్ లకు మంత్రి వర్గం ఆమోదం తెలపనున్నది. అయితే ప్రస్తుతం తీసుకురానున్న నూతన పురపాలక బిల్లును ఎల్లుండి శుక్రవారం శనివారం జరగనున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం తెలపనున్నది. అందుకే ఈ రోజు సమీక్షలో కొత్త చట్టం,దానియొక్క ఉద్ధేశ్యం ,పనితనం,లక్ష్యాల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులకు వివరించనున్నారు.
