హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటామని.. దీనికి యంత్రాంగం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. సహాయ చర్యల కోసం హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. ప్రగతిభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. మరో 4, 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షసూచన ఉందని.. …
Read More »అవే నాకు శాశ్వత అనుబంధాలు: జగన్ ట్వీట్
రెండు రోజులపాటు నిర్వహించిన వైసీపీ ప్లీనరీ సూపర్ సక్సెస్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది వైసీపీ కార్యకర్తలు, నేతలు దీనికి హాజరై విజయవంతం చేశారు. నేతల ఉత్సాహపరిచే స్పీచ్లతో ప్లీనరీ ప్రాంగణం హోరెత్తిపోయింది. ప్లీనరీ విజయవంతమైన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ కార్యకర్తలకు మరోసారి సెల్యూట్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘నిరంతరం దేవుని దయ, నడిపించే నాన్న, ఆశీర్వదించే అమ్మ, ప్రేమించే కోట్ల …
Read More »ఏపీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు..!
ఏపీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులు నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో మాట్లాడిన పలువురు నేతలు మూడు రాజధానుల బిల్లు తీసుకొస్తామని చెప్పారు. రాజధాని వికేంద్రీకరణ జరగాలని.. అభివృద్ధి అన్ని ప్రాంతాలకూ విస్తరించాలని ఆకాంక్షించారు. ‘పరిపాలన వికేంద్రీకరణ’పై ప్రవేశపెట్టిన తీర్మానంపై నేతలు మాట్లాడారు. రాష్ట్రం బాగుండాలంటే మూడు రాజధానులు ఉండాలని.. మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందాలని ఎంపీ నందిగం …
Read More »వైఎస్సార్ ఫ్యామిలీ.. ఎక్స్క్లూజివ్ ఫొటోలు
తన మార్క్ పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నేత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి. ఎప్పుడూ ప్రజల బాగోగుల కోసమే తపించే ఆయన.. వీలు చిక్కినప్పుడల్లా కుటుంబంతో గడిపేవారు. అప్పుడప్పుడూ సతీమణి విజయమ్మ, కుమారుడు జగన్, కోడలు భారతి, కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్, మనవళ్లు, మనవరాళ్లతో సరదాగా విహారయాత్రలకూ వెళ్లేవారు. ఇటీవల వైఎస్ జయంతి సందర్భంగా ఆయన తన కుటుంబంతో గడిపిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో …
Read More »శ్రీలంకలో ‘జన సునామీ’.. దెబ్బకు అధ్యక్షుడు పరారీ!
శ్రీలంకలో పూర్తిగా దిగజారిన ఆర్థిక పరిస్థితులు, ఆ దేశంలో నెలకొన్న సంక్షోభం అక్కడి సామాన్యులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు రోజురోజుకీ ఎక్కువ అవుతున్నాయి. ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరడంతో ప్రజలు తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో తమ ప్రతాపాన్ని నేరుగా అధ్యక్షుడిపైనే చూపించారు. శనివారం లక్షలాది మంది ప్రజలు కొలంబోలోని అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు. ఆర్థిక సంక్షోభంతో నరకాన్ని అనుభవిస్తున్న ప్రజలు..మహోగ్రరూపంతో అధ్యక్షుడు …
Read More »వైసీపీ ప్లీనరీకి పోటెత్తిన జగన్ సైన్యం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్జామ్
వైసీపీ ప్లీనరీకి కార్యకర్తలు పోటెత్తారు. గుంటూరు జిల్లా చినకాకాని సమీపంలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలో రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశాలకు ఏపీ నలుమూలల నుంచి వైసీపీ శ్రేణులు తరలివచ్చాయి. ప్లీనరీ ముగిసిన అనంతరం కార్యకర్తలు తమ స్వస్థలాలకు బయల్దేరడంతో టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు చెన్నై-కోల్కతా హైవేలో సందడి వాతావరణం కనిపించింది. ‘జై జగన్’ ‘జై …
Read More »దేవుడు స్క్రిప్ట్ గొప్పగా రాస్తాడు: ప్లీనరీలో జగన్
అప్పట్లో తనపై శక్తివంతమైన వ్యవస్థలతో కాంగ్రెస్, టీడీపీ దాడి చేశాయని వైసీపీ అధినేత, సీఎం జగన్ అన్నారు. ఓదార్పు యాత్ర మానుకోవాలని ఒత్తిడి చేశాయని చెప్పారు. వైసీపీ ప్లీనరీ ముగింపు సందర్భంగా కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి జగన్ మాట్లాడారు. మనకి అన్యాయం చేసిన పార్టీలకు రాష్ట్రంలో నామరూపాల్లేవన్నారు. 2014లో ఓడినా తనపై కుట్రలు, కుతంత్రాలు ఆపలేదని.. 23 మంది ఎమ్మెల్యేలు, 3 మంది ఎమ్మెల్యేలను కొన్నారని చెప్పారు. దేవుడు స్క్రిప్ట్ …
Read More »ప్రజలు అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు: సీఎం కేసీఆర్
భారీ వర్షాలు కురుస్తున్నందున మహారాష్ట్రతో పాటు తెలంగాణకు రెడ్అలర్ట్ ఉందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వరద ముంపు ప్రాంతాల్లో అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్స్ను అలర్ట్ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. సహాయక చర్యల్లో ప్రజాప్రతినిధులు ప్రజలకు సాయపడుతూ నష్టం జరగకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. భారీ వర్షాలు, వరదల …
Read More »వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా జగన్..
వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా సీఎం జగన్ ఎన్నికయ్యారు. వైసీపీ ప్లీనరీలో ఈ మేరకు తీర్మానం చేసి ఆమోదించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు తనపై కార్యకర్తలు, అభిమానులు ఆప్యాయత చూపించి అనురాగం పంచుతున్నారని చెప్పారు. ఈ ప్లీనరీ ఆత్మీయుల సునామీలా కనిపిస్తోందన్నారు. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ విధానాలు, బాధ్యతలను ఎంతో అభిమానంతో భుజస్కందాలపై మోస్తున్న కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు నిండు మను సెల్యూట్ చేస్తున్నట్లు …
Read More »వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా
వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వైఎస్ YSవిజయమ్మ ప్రకటించారు. గుంటూరు జిల్లా చినకాకానిలో నిర్వహించిన వైసీపీ ప్లీనరీకి ఆమె హాజరై మాట్లాడారు. తమ కుటుంబంతో ప్రజల అనుబంధం 45 ఏళ్లుగా కొనసాగుతోందని చెప్పారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రతి మనిషినీ ప్రేమించారన్నారు. తమ కుటుంబ అనుబంధం, సంస్కారం గొప్పవని చెప్పారు. తామే కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలే ఓదార్చారన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకు జగన్తో ఉన్నానని.. బిడ్డ షర్మిలకు …
Read More »