ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అప్పట్లో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావును వెన్నుపోటు పొడిచి పార్టీని,అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు విమర్శలు ఉన్న సంగతి విదితమే. దీనిపై ఒక ప్రముఖ టెలివిజన్ కు ఇచ్చిన ఇంటర్వూలో టీడీపీ నేత,ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు.ఆయన మాట్లాడుతూ ” వెన్నుపోట్లు,గాడిద గుడ్లు నాకర్ధం కాదు.అప్పుడు అందరం కల్సి పార్టీని బతికించుకోవడానికి అలా …
Read More »వైసీపీలోకి టీడీపీ సీనియర్ నేత
ఏపీ అధికారక పార్టీ వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ బాగా పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి వరుస షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వంపై ఆ పార్టీ అధినేత విమర్శలు, ఆరోపణలతో బిజీ బిజీగా ఉంటే..మరోవైపు పార్టీకి చెందిన కీలక నేతలు జంప్ అవుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమౌతోంది. ప్రస్తుతం శిద్ధాతో పాటు ఆయన …
Read More »తెలంగాణ బాటలో తమిళనాడు
పదో తరగతి పరీక్షల విషయంలో తమిళనాడు ప్రభుత్వం తెలంగాణను అనుసరించింది. తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని సీఎం పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పరీక్షలు నిర్వహించకుండానే పైతరగతులకు పంపిస్తామని, విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా పరిగణిస్తున్నామని సీఎం ప్రకటించారు. త్రైమాసిక, అర్ధవార్షిక పరీక్షల ఫలితాల ఆధారంగా 80 శాతం మార్కులు, హాజరు ఆధారంగా మరో 20 శాతం మార్కులు కేటాయిస్తామని చెప్పారు.
Read More »కేంద్రం సంచలన నిర్ణయం..కరోన కట్టడి కోసం ఆ రాష్ట్రాల్లో ఇంటింటి సర్వే
దేశవ్యాప్తంగా కొన్ని నగరాలు, పట్టణాల్లో కొవిడ్-19 పరిస్థితి దారుణంగా ఉండటంతో కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇంటింటి సర్వే చేపట్టడం, వెంటనే పరీక్షలు నిర్వహించడం, వైరస్ వ్యాప్తి, మరణాలను కట్టడి చేయడంపై దృష్టి పెట్టాలని సూచించింది. పది రాష్ట్రాల్లోని 38 జిల్లాల్లో 45 స్థానిక సంస్థలకు ఈ మేరకు దిశానిర్దేశం చేసింది. జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్, వైద్య కళాశాలల ప్రిన్సిపల్స్తో కేంద్ర ఆరోగ్యశాఖ …
Read More »తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది.ఇందులో భాగంగా సోమవారం రాష్ట్రంలో కొత్తగా 92 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా కారణంగా మరో ఐదుగురు మృతిచెందారు. ఈమేరకు తెలంగాణ రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ హెల్త్బులెటిన్ విడుదల చేసింది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3742 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 142 మంది మృతిచెందారు. గత కొద్దిరోజులతో పోలిస్తే ఈ రోజు తక్కువ కేసులు నమోదవ్వడం కాస్త ఉరటనిచ్చే …
Read More »ఆర్ఆర్ఆర్ మూవీలో శ్రియ
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’.. దీనిలో కథానాయిక శ్రియ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదే అంశం గురించి ఈ ముద్దు గుమ్మ సోషల్మీడియాలో లైవ్లో తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పే క్రమంలో వెల్లడించారు.‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా గురించి ఆమె ప్రస్తావిస్తూ ‘ఇందులో నా పాత్ర భావోద్వేగంతో కూడుకుని ఉంటుంది. ఫ్లాష్బ్యాక్లో కనిపిస్తా. …
Read More »తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు
పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి ఎలాంటి పరీక్షలూ నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు పదో తరగతి పరీక్షలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి …
Read More »అందరికీ కరోన టెస్టులు ఎలా సాధ్యం
కరోనా రోగుల చికిత్సకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎంతమందికైనా చికిత్స చేసే సామర్థ్యం ప్రభుత్వ ఆస్పత్రులకు ఉందని ఆయన వెల్లడించారు. కరోనా వ్యాప్తి, లాక్డౌన్పై అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. వైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించారు. రోగులకు చికిత్స, సదుపాయాలపై …
Read More »బడి గంట మ్రోగేది అప్పుడేనా..
దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో బోధన ఆగస్టు తర్వాత ప్రారంభం కావచ్చని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ నిశాంక్ ప్రకటించారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హోంశాఖ అనుమతించిన మీదటే నూతన విద్యా సంవత్సరంలో కార్యకలాపాలు మొదలుపెడతామని ఆయన స్పష్టం చేశారు. కొవిడ్-19 పరిస్థితులను పూర్తిగా అంచనా వేసిన అనంతరం మాత్రమే.. ఈ అంశంపై నిర్ణయం సాధ్యమని మంత్రి అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా విశ్వవిద్యాలయాలలో బోధన కూడా ఆగస్టు తర్వాతనే …
Read More »కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి అర్జున్ చరణ్ సేథీ(78) కన్నుమూశారు. భువనేశ్వర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 2000-2004 మధ్య వాజ్పేయ్ ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రిగా అర్జున్ చరణ్ సేథీ సేవలందించారు. 1971లో భద్రక్ లోక్సభ స్థానం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 1980, 1991, 1998, 1999, 2004, 2009 ఎన్నికల్లో అర్జున్ చరణ్ సేథీ లోక్సభకు ఎన్నికయ్యారు. రెండు …
Read More »