హెచ్ఎండీఏ కార్యకలాపాలు, చేపట్టిన ప్రాజెక్టుల పైన మంత్రి కే తారకరామారావు ఈ రోజు నానక్ రామ్ గూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో సుదీర్ఘమైన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎండిఏ పరిధిలో చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టులు మరియు భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన అంశాలపైన అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువుల సంరక్షణపైన ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా చెరువుల …
Read More »ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు : మంత్రి తలసాని.
ప్రైవేటుకు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది, బలోపేతం చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన ‘మన బస్తి – మన బడి’ కార్యక్రమంపై మంత్రి మసబ్ ట్యాంక్లోని కార్యాలయంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీతో కలిసి హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మహమూద్ అలీతో కలిసి ఆయన …
Read More »బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఆశలపై కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జీ కిషన్రెడ్డి నీళ్లు
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఆశలపై కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జీ కిషన్రెడ్డి నీళ్లు చల్లారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మంత్రిగా.. కేంద్రం నుంచి విభజన హామీలను సాధించుకొని రావాల్సిన బాధ్యతను విస్మరించి, అది సాధ్యం కాదంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బయ్యారంలో స్టీల్ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం సాధ్యం కాదన్న విషయాన్ని తమ ప్రభుత్వం ఇప్పటికే చెప్పిందని పేర్కొన్నారు. …
Read More »కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి హారీష్ రావు లేఖ
తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లు, బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మరోసారి లేఖ రాశారు. గతంలో చేసిన అభ్యర్థనలను మరోసారి గుర్తుచేశారు. కేంద్రం నుంచి గ్రాంట్లు, బకాయిల రూపంలో రాష్ర్టానికి సుమారు రూ.27,350 కోట్ల వరకు రావాల్సి ఉన్నది. మంత్రి లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ …
Read More »భారత టెస్టు సారథిగా రోహిత్ శర్మ
అంతా ఊహించినట్లే స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. భారత టెస్టు సారథిగా ఎంపికయ్యాడు. సఫారీ పర్యటన అనంతరం విరాట్ కోహ్లీ జట్టు పగ్గాలు వదిలేయగా.. శనివారం ఆల్ఇండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ రోహిత్ను నాయకుడిగా నియమించింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో రోహిత్ శర్మ భారత 35వ సారథిగా సేవలందించనున్నాడు. సభ్యులంతా రోహిత్ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ పేర్కొన్నాడు. మార్చి 4 నుంచి …
Read More »తెలంగాణలో కొత్తగా 41,042 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 41,042 కరోనా టెస్టులు చేయగా, 425 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 130 కేసులు బయటపడ్డాయి. 1,060 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 6,111 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »నిర్మాతలకు షాకిచ్చిన అమలాపాల్
కోలీవుడ్ నటి అమలాపాల్ భారీగా రెమ్యూనరేషన్ పెంచినట్లు సమాచారం. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఘోస్ట్ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో హీరోయిన్గా అమలాపాల్ను చిత్ర యూనిట్ సంప్రదించిందట. అయితే అమలాపాల్ భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో మేకర్స్ వెనకడుగు వేశారని సమాచారం. దీంతో అమలాపాల్, నాగ్ సినిమాలో నటించేందుకు నో చెప్పిందనే టాక్ నడుస్తోంది.
Read More »SRHకు భారీ షాక్
ఐపీఎల్ -2022 సీజన్ ఆరంభానికి ముందు SRHకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు అసిస్టెంట్ కోచ్.. సైమన్ కటిచ్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మెగా వేలంలో ఆటగాళ్ల ఎంపిక, కొనుగోలు విషయంలో యాజమాన్యంతో విభేదాలు తలెత్తడంతో జట్టును వీడినట్లు.. ది ఆస్ట్రేలియన్ పత్రిక కథనం ప్రచురించింది. గత సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన SRH.. కేవలం మూడింటిలో గెలిచింది. ఈ క్రమంలో కటిచ్ రాజీనామా …
Read More »ఆరోగ్యంగా ఉండేందుకు ఫిట్నెస్ చిట్కాలు మీకోసం
ఆరోగ్యంగా ఉండేందుకు ఫిట్నెస్ చిట్కాలు మీకోసం.వారానికి కనీసం 5 రోజులు కచ్చితంగా వ్యాయామం చెయ్యాలి.లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. దీంతో శరీరానికి కావాల్సిన తేమ అంది ఉత్సాహంగా ఉంటారు .గుడ్లు, పాలు రెగ్యులర్గా తీసుకోవాలి.ఎక్సర్సైజ్ ముందు అరటిపండ్లు, ఖర్జూరాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.రోజులో ఒకేసారి తినకుండా ఆహారాన్ని కొంచెం పరిమాణంలో ఎక్కువసార్లు తీసుకోవాలి.రోజుకి కనీసం 8గం. నిద్ర ఉండేలా జాగ్రత్తపడాలి
Read More »లేవగానే ఫోన్ చూస్తున్నారా? అయితే మీకోసం ఇది..?
లేవగానే ఫోన్ చూస్తున్నారా? అయితే డేంజర్ అంటున్నారు నిపుణులు. ప్రస్తుత రోజుల్లో ఉదయం లేవగానే చాలా మంది ఫోన్ చూస్తారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లైటింగ్ నేరుగా కళ్లపై పడటంతో తల బరువుగా మారుతుంది. ఏ విషయాన్ని సరిగ్గా ఆలోచించలేరు. ఏకాగ్రత తగ్గుతుంది. తలనొప్పి సమస్య మొదలవుతుంది. లైటింగ్ వల్ల స్ట్రెస్ పెరిగి రక్తపోటు సమస్య కూడా వస్తుందట. చిన్న విషయానికే చిరాకు పడటం, కోపం, …
Read More »