తెలంగాణ రాష్ట్రంలో 19,413 పల్లె ప్రకృతి వనాలు పూర్తి అయ్యాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. 99.69 శాతం లక్ష్యం సాధించినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. దీనితో పాటుగా 10 ఎకరాల్లో ఒకేచోట ప్రతి మండలానికి ఒక బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వీటి కోసం 5300 ఎకరాల స్థలాన్ని గుర్తించి ఒక్కోదానికి రూ.40 లక్షలు కేటాయించామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఒక పల్లె …
Read More »‘తెలంగాణ బ్రాండ్’ పేరుతో చేపలు మార్కెటింగ్
తెలంగాణ వ్యాప్తంగా ఉన్నమత్స్యకారులను ఆర్థికంగా ఆదుకొనేందుకు ప్రభుత్వమే వారి నుంచి చేపలు కొనుగోలుచేసి ‘తెలంగాణ బ్రాండ్’ పేరుతో మార్కెటింగ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చెప్పారు. రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెరిగిన నేపథ్యంలో.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో చేపల కొనుగోలు, మార్కెటింగ్, ఎగుమతి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో శనివారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. …
Read More »మూడో బోనం నేడే
చారిత్రాత్మక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయం ఆషాఢ మాసం మూడో బోనం ఆదివారం జరగనున్నది. ఈ సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల నుంచి తొట్టెల ఊరేగింపు కోటకు రానుందని ఆలయ ట్రస్టు చైర్మన్ కోయల్కార్ గోవింద్రాజ్ తెలిపారు. కోటలో మూడో బోనం జరుపుకోవడానికి వచ్చే భక్తులకు ప్రభుత్వం తరఫున సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని, భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.
Read More »ధరణితో రైతుల సమస్యలు పరిష్కారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఆధారంగా పెండింగ్ మ్యుటేషన్లు వేగంగా పరిష్కారం అవుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 99.65 శాతం పరిష్కారమయ్యాయి. అదనంగా రూపాయి చెల్లించాల్సిన, ఆఫీస్ల చుట్టూ తిరిగే పనిలేకుండానే ప్రక్రియ పూర్తవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గతంలో రిజిస్ట్రేషన్ జరిగి మ్యుటేషన్ చేసుకోని భూములకు డబుల్ రిజిస్ట్రేషన్లతో భూ వివాదాలు తలెత్తేవి. వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం గతేడాది నవంబర్ చివరి వారంలో ధరణి …
Read More »సోషల్ మీడియాలో హీరో సిద్ధార్థ్ పై ట్రోలింగ్
‘నారప్ప’లో వెంకటేష్ వయసుపై ట్రోల్ చేస్తున్నారు కొందరు. ఈ ట్రోల్స్ అవసరం లేదంటూ డిఫెండ్ చేస్తున్నారు మరికొందరు. ఓ నెటిజన్ ఇందులోకి సిద్ధార్థ్ లాగాడు ’40ఏళ్లు పైబడిన సిద్ధార్థ్.. 20ఏళ్ల హీరోయిన్లు నటిస్తే ఏం కాదా అని అడిగాడు. దీనిపై సిద్దార్థ్ ఘాటుగా స్పందించాడు. ‘ఈ హీరోల వయస్సు టాపిక్ ఫస్ట్ నేనే గుర్తొచ్చానా రా? సూపర్ రా దరిద్రం. ఎక్కడ్నుంచి వస్తార్రా మీలాంటోళ్లు?’ అంటూ రిప్లె ఇచ్చాడు.
Read More »ఆషాఢ మాసంలో పెళ్లి ఎందుకు చేసుకోకూడదు..?
ఆషాఢ మాసంలో సప్త ధాతువులు సరిగ్గా పనిచేయవు, వర్షాలు కురవడంతో పొలం పనులు కూడా అధికంగా ఉంటాయి. అలాగే ఆషాఢంలో గర్భధారణకు అనువైన మాసం కాదని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఆషాఢంలో పెళ్లిళ్లు చేయరు. అలాగే, ఆషాఢంలో పూజలు, వ్రతాలు వంటివి ఎక్కువగా ఉంటాయి. పూజలతో పూజారులంతా బిజీగా ఉంటారు. దీంతో పెళ్లి తంతు నిర్వహించడానికి సమయం ఉండదు. ఈ కారణాలతో ఆషాఢంలో పెళ్లిళ్లు జరగవు.
Read More »సరికొత్తగా రెజీనా
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ రెజీనా నటిస్తున్న తెలుగు వెబ్ సిరీస్ ‘అన్యాస్ ట్యుటోరియల్’. పల్లవి గంగిరెడ్డి దర్శకురాలు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ గురించి మాట్లాడిన రెజీనా.. ‘ఓ లేడీ రైటర్ కథ రాయగా, మరో లేడీ డైరెక్టర్ మూవీ తెరకెక్కిస్తున్నారని తెలియగానే ఆసక్తి పెరిగింది. ఇక విచిత్రమైన సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ వినగానే కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ చేయాలనుకున్నా’ అని చెప్పింది. ఈ సిరీస్ …
Read More »బీటు రూటు తో లాభాలు ఎన్నో..?
బీటు రూటు తో బోలెడన్ని లాభాలు రక్తహీనతను నివారిస్తుంది తక్షణ శక్తి లభిస్తుంది కొవ్వు కరుగుతుంది రోజంతా చురుగ్గా ఉంచుతుంది కాలేయాన్ని శుభ్రం చేస్తుంది జ్ఞాపకశక్తిని పెంచుతుంది ఎముకలను దృఢంగా చేస్తుంది చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది
Read More »అంబానీ చేతుల్లోకి జస్ట్ డయల్
దేశీయ ఈ-కామర్స్ మార్కెట్లో మరింత పట్టు సాధించే దిశగా రిలయన్స్ రిటైల్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా లోకల్ సెర్చింజిన్ జస్ట్ డయల్లో 40.95% వాటాలు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ రూ. 3,497 కోట్లని తెలిపింది. కంపెనీ తదుపరి వృద్ధి లక్ష్యాల సాధనకు తోడ్పడేలా జస్టడయల్ వ్యవస్థాపకుడు VSS మణి ఇకపైనా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా కొనసాగుతారని రిలయన్స్ తెలిపింది.
Read More »మాట నెరవేర్చిన దేవిశ్రీ ప్రసాద్
తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ ఇటీవల మెదక్-నారైంగికి చెందిన యువగాయని శ్రావణి టాలెంట్ను ట్విట్టర్ లో పరిచయం చేశారు. ఆమెకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్స్ థమన్, దేవీ శ్రీలను ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన దేవీ.. ఆమెకు అవకాశం ఇస్తానని మాటిచ్చాడు. తాజాగా శ్రావణిని ‘స్టార్ టు రాస్టార్’ అనే షోతో పరిచయం చేస్తున్నట్లు ట్వీట్ చేశాడు. …
Read More »