కరివేపాకుతో అనేక లాభాలు ఉన్నాయి.. ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఐరన్, ఫోలిక్ యాసిడ్లు పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపు చేస్తుంది. అజీర్ణ, ఒత్తిడి, ఆందోళన సమస్యలను తగ్గిస్తుంది. విటమిన్ ఏ, కెరోటినాయిడ్స్ అధికంగా ఉండడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతాయి జుట్టు రాలడం, చుండ్రు సమస్యలను ఇది …
Read More »హైదరాబాద్ లో మరో IT హబ్
తెలంగాణ రాష్ట్ర రాజధానిలో మరో IT హబ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న రోజుల్లో ఐటీ, అనుబంధ సంస్థలకు గిరాకీ పెరగనున్న దృష్ట్యా రాజధాని మహానగరం హైదరాబాద్ పరిసరాల్లో ఐటీ హబ్ సిద్ధం చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గర్లో ఉన్న కొల్లూరు, ఇదుళ్లనాగులపల్లి ఇందుకు అనువుగా ఉన్నాయని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పేర్కొంది. ORRకు 1.3 కి.మీ దూరంలో 640 ఎకరాల …
Read More »తిరుమణి కొండల్ కుటుంబాన్ని ఆదుకుంటాం : మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంతో పాటు పార్టీ కోసం సుదీర్ఘకాలం పనిచేసిన నల్లగొండ జిల్లా చండూరు మండలానికి చెందిన దివంగత తిరుమణి కొండల్ కుటుంబాన్ని ఆదుకుంటామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే. తారక రామారావు అన్నారు. కొండల్ ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇటీవలే మృతిచెందాడు. బాధిత కుటుంబం సాయం కోరుతూ బుధవారం మంత్రి కేటీఆర్ను తెలంగాణ భవన్లో కలిసింది. తన భర్త కొండల్ 2001 …
Read More »అదే నేను నమ్మే సిద్ధాంతం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోవాలని తానెప్పుడూ కోరుకోలేదని అంటోంది లావణ్య త్రిపాఠి. ఒకే ఒరవడికి పరిమితం కాకుండా విభిన్న పాత్రల్లో నటించాలన్నదే తన అభిమతమని చెబుతోంది. జయాపజయాలకు అతీతంగా తెలుగులో చక్కటి అవకాశాల్ని అందుకుంటూ కెరీర్లో ముందుకు సాగుతోంది లావణ్య త్రిపాఠి. సినిమాల ఎంపికలో తన ప్రాధామ్యాల గురించి లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ ‘గ్లామర్ అనే మాటకు సరైన నిర్వచనాన్ని చెప్పడం కష్టమే. ఈవిషయంలో అందరి …
Read More »టీమ్ ఇండియాలో కరోనా కలకలం
ఇంగ్లండ్తో సిరీస్కు ముందు ఇండియన్ టీమ్లో కలకలం రేగింది. 23 మంది క్రికెటర్ల బృందంలో ఒకరికి కరోనా పాజిటివ్గా తేలింది. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత 20 రోజుల బ్రేక్ దొరకడంతో ఈ గ్యాప్లో ప్లేయర్స్ యూకేలో సైట్ సీయింగ్కు వెళ్లారు. అప్పుడే సదరు ప్లేయర్ కొవిడ్ బారిన పడ్డాడు. గురువారం టీమంతా డర్హమ్ వెళ్లనుండగా.. ఆ ప్లేయర్ మాత్రం టీమ్తో పాటు వెళ్లడం లేదు. యూకేలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, …
Read More »తెలంగాణలో కొత్తగా 749 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 749 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,33,895కు పెరిగింది. కొత్తగా 605 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లగా.. ఇప్పటి వరకు 6,19,949 మంది కోలుకున్నారు. మరో ఐదుగురు వైరస్ బారినపడి మృతి చెందారు. ఇప్పటి వరకు 3,743 మంది ప్రాణాలు కోల్పోయారు. …
Read More »హుజురాబాద్ లో పోటీ పార్టీల మధ్య ఉంటుంది తప్ప వ్యక్తుల మధ్య కాదు
మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారి స్పందించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో చిట్చాట్ చేశారు. ఈటల రాజేందర్ది ఆత్మగౌరవం కాదు.. ఆత్మవంచన అని పేర్కొన్నారు. ఈటల తనతో పాటు.. ప్రజలను కూడా మోసం చేస్తున్నారు. ఈటలకు టీఆర్ఎస్ పార్టీ ఎంత గౌరవిమిచ్చిందో ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఆయనకు టీఆర్ఎస్ పార్టీలో జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలి. మంత్రిగా ఉండి కేబినెట్ …
Read More »కాంగ్రెస్ లోకి పీకే
ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా రాహుల్, ప్రియాంకా గాంధీలను కూడా కలిసిన విషయం తెలిసిందే. రానున్న రాష్ట్రాల ఎన్నికలు, 2024 సాధారణ ఎన్నికల గురించి ప్రశాంత్ కిశోర్.. గాంధీలతో చర్చించినట్లు భావించినా.. అంతకంటే పెద్దదే ఏదో జరగబోతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పడం గమనార్హం.2024 ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీలో …
Read More »తెలంగాణ రాష్ర్టానికి పెట్టుబడుల వరద
తెలంగాణ రాష్ర్టానికి పెట్టుబడుల వరద కొనసాగుతున్నది. దేశ,విదేశీ సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రభుత్వరంగ మహారత్న కంపెనీ భారత్ పెట్రోలియం (బీపీసీఎల్) కొత్త ప్రాజెక్టుతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మంగళవారం ముందుకొచ్చింది. రూ.1,000 కోట్లతో రాష్ట్రంలో ఇథనాల్ (ఫస్ట్ జనరేషన్) ప్లాంటును ఏర్పాటుచేస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. 100 ఎకరాల స్థలం, కావాల్సినంత నీరు అందిస్తే ప్లాంటు ఏర్పాటుచేస్తామని తెలిపింది. ప్లాంటు ఏర్పాటుకోసం బీపీసీఎల్ గతంలోనే రాష్ట్ర పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి …
Read More »దేశంలో కొత్తగా 38,792 కరోనా కేసులు
గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 38,792 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా 624 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో మొత్తం వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 41 వేలుగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,09,46,074గా ఉంది. మూడు కోట్ల మంది వైరస్ నుంచి రికవరీ …
Read More »