తన అందాలతో నటనతో తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరైన అందాల రాక్షసి రష్మికా మంధాన..యువతకు మాత్రం కలల రాకుమారిగా మారింది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా కన్నడ సినిమా ‘కిరిక్ పార్టీ’ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించనున్న ఈ మూవీ కోసం చిత్రయూనిట్ రష్మిక మంధన్నాను సంప్రదించింది. అయితే ఇందులో నటించేందుకు ఆమె నో చెప్పింది. దీనిపై స్పందించిన కన్నడ బ్యూటీ.. మళ్లీ మళ్లీ ఒకే …
Read More »మరోసారి ఆ హీరోతో సాయిపల్లవి రోమాన్స్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలుగా విడుదలై విజయవంతమైన ‘ఛలో, భీష్మ’ వంటి సినిమాలతో తన ప్రత్యేకత చాటుకున్న దర్శకుడు వెంకీ కుడుముల. తాజాగా వెంకీ వరుణ్ తేజ్ తో ఓ సినిమా తీయనున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ గా నటించాలని సాయి పల్లవిని చిత్రయూనిట్ సంప్రదిస్తోందట. ‘ఫిదా’తో హిట్ అందుకున్న ఈ జోడీ మరోసారి వెండితెరపై మెరవనుందా? లేదా? తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
Read More »చేపలు తినడం వల్ల అనేక లాభాలు
చేపలు తింటే ఎన్ని లాభాలో తెలుసా..చేపలు తింటే అనేక ఉపయోగాలు ఉన్నాయి..అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 1. మెదడు బాగా పని చేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.. 2. గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలోని ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. ఫలితంగా రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడవు. 3. ఒత్తిడి, మానసిక ఆందోళనలు తగ్గుతాయి. 4. విటమిన్ డి లభిస్తుంది. 5. స్త్రీలలో పీరియడ్స్ సక్రమంగా రావాలంటే …
Read More »నేడే ఒక్కొక్కరి ఖాతాలో రూ.10 వేలు జమా
కరోనా కాలంలో గంగపుత్రులను ఆదుకునేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ YSR మత్స్యకార భరోసా నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. కాగా ఈ పథకానికి రూ.119.88 కోట్లను విడుదల చేస్తూ జగన్ సర్కార్ సోమవారం ఉత్తర్వులను జారీచేసింది. చేపల వేటను నిషేధించిన టైంలో జీవనోపాధి కోల్పోయిన ఒక్కో ఫ్యామిలీకి.. ఈ స్కీమ్ ద్వారా ఏటా రూ.10 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
Read More »తెలంగాణలో ఆక్సిజన్ కొరత రావొద్దు
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ రోగులకు అవసరమైన 324 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను 48 ప్రభుత్వ ఆస్పత్రులలో ఏర్పాటు చేసి భవిష్యత్ లో కూడా ఎలాంటి ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అదనంగా ఇంకా 100 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంటును కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 16 …
Read More »టీఎస్ ఎంసెట్ గడువు పెంపు
తెలంగాణలో ఇంజనీరింగ్తో పాటు అగ్రికల్చర్, వెటర్నరీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎంసెట్ పరీక్ష దరఖాస్తు గడువును ఈనెల 26వరకు పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు ఈనెల 18 వరకు గడువు ఉండగా.. దీనిని పొడిగిస్తూ పరీక్ష నిర్వహణ సంస్థ జేఎన్టీయూ నిర్ణయం తీసుకుంది. ఈ గడువులోపు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఎంసెట్ కన్వీనర్, జేఎన్టీయూ రెక్టార్ ఆచార్య గోవర్ధన్ తెలిపారు. కాగా, సోమవారం …
Read More »కోహ్లీపై రష్మిక సంచలన వ్యాఖ్యలు
తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెట్ టీమ్ అభిమానినే అయినప్పటికీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్ కాదని కన్నడ భామ రష్మికా మందన్న తాజాగా వ్యాఖ్యానించింది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఐపీఎల్ను రెగ్యులర్గా ఫాలో అవుతానని చెప్పింది. ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ను ఆర్సీబీ గెలుస్తుందనుకున్నానని, అయితే అనుకోని పరిస్థితుల్లో లీగ్ వాయిదా పడటం తనను బాధించిందని చెప్పింది. ఐపీఎల్లో ఆర్సీబీ నా ఫేవరెట్ టీమ్. …
Read More »భారత్ లో కొత్తగా 2,81,386 కరోనా కేసులు
భారత్లో గడిచిన 24 గంటల్లో 2,81,386 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,49,65,463గా ఉంది. ఇక నిన్న 4106 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,74,390గా ఉంది. ప్రస్తుతం దేశంలో 35,16,997 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న 3,78,741 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Read More »కరోనా నియంత్రణలో తెలంగాణ టాప్
కరోనా నియంత్రణ, మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ టాప్ లో నిలిచినట్లు 2 సంస్థలు చేసిన సర్వేలో తేలింది. కరోనా నియంత్రణలో తెలంగాణ, రాజస్థాన్, హర్యానా తొలి 3 స్థానాల్లో నిలిచాయి.. మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ, పంజాబ్, తమిళనాడు టాప్లో ఉన్నాయని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, మరో సంస్థ తెలిపాయి. ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ పడకలు పెంచడం, RT-PCR ల్యాబ్ల ఏర్పాటులో తెలంగాణ కీలకంగా వ్యవహరించింది.
Read More »ఆసుపత్రిలో బీజేపీ నేత లక్ష్మణ్
తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకొని ఐసోలేషన్లో ఉండాలని లక్ష్మణ్ సూచించారు.
Read More »