గల్ఫ్ కార్మికుల కనీస వేతనాలను తగ్గిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన రెండు సర్కులర్ల ను వెంటనే ఉపసంహరించుకోవాలి . గల్ఫ్ దేశాల ప్రభుత్వాల నుండి ఎలాంటి ప్రతి పాదాన లేకున్నా భారత ప్రభుత్వం భారత ప్రవాసీ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం జీతాలు తగ్గించడం చాల బాధాకరమైన విషయం. స్వదేశంలో సరైన వేతనాలు లేక భార్యా పిల్లలను వదిలి లక్షలు అప్పుచేసి గల్ఫ్ లో పది రూపాయలు సంపాదించుకుంటామని వస్తే …
Read More »దేశంలో కొత్తగా 23,950కరోనా కేసులు
దేశ వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగంటల్లో మొత్తం 23,950కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,00,99,066కి చేరుకుంది. ఇందులో మొత్తం యాక్టివ్ కేసులు 2,89,240. మొత్తం కరోనా నుండి కోలుకున్నవారి సంఖ్య 96,63,382. తాజాగా కరోనాతో 333మంది మృత్యు వాత పడ్డారు. దేశంలో కరోనాతో ఇప్పటివరకు1,46,444మంది మరణించారు.
Read More »ముచ్చటగా మూడో సినిమాతో ఆనంద్ దేవరకొండ
టాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ముచ్చటగా మూడో సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో భాగంగా తాజాగా “మిడిల్ క్లాస్ మెలోడీస్” మూవీతో హిట్ కొట్టాడు ఆనంద్. అదే జోష్ లో ఆనంద్ ఇప్పుడు మూడో సినిమాను కూడా పూర్తి చేస్తున్నాడని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ దేవరకొంద తన సొంత బ్యానరైన కింగ్ ఆఫ్ …
Read More »పీవీ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్సీ కవిత నివాళి
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 16వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్రోడ్డులోని పీవీ జ్ఞానభూమిలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ఆమెతో పాటు పీవీ కుమార్తె శ్రీవాణి, కుమారుడు పీవీ ప్రభాకర్ రావు ఉన్నారు. పీవీ జ్ఞానభూమి వద్ద నివాళులర్పించిన వారిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కేశవరావు, హోంమంత్రి మహముద్ అలీతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. పీవీ …
Read More »పీవీ దేశ చరిత్రలో నిలిచిపోతారు : సీఎం కేసీఆర్
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 16వ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనను కేసీఆర్ స్మరించుకున్నారు. నిరంతర సంస్కరణ శీలిగా భారత దేశ చర్రిత్రలో పీవీ చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం అన్నారు. ఆర్థిక, విద్య, భూ పరిపాలన తదితర రంగాలలో పీవీ ప్రవేశపెట్టి, అమలు చేసిన సంస్కరణల ఫలితాన్ని నేడు భారతదేశం అనుభవిస్తున్నదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అంతర్గత భద్రత వ్యవహారాల్లోనూ, విదేశాంగ వ్యవహారాల్లోనూ మాజీ ప్రధాని …
Read More »రాజాసింగ్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటాం: సీపీ సజ్జనార్
బీజేపీ నాయకులు పోలీసుల నైతికత దెబ్బతినేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. పోలీసుల మీద అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసులు ఎదుర్కోక తప్పదన్నారు. పోలీసుల మీద, డీజీపీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందన్నారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. మహారాష్ట్ర నుంచి …
Read More »కొత్త రకం కరోనాపై డబ్ల్యూహెచ్వో క్లారిటీ
బ్రిటన్లో బెంబేలెత్తిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ అదుపులోనే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానాలతో ఆ వైరస్ దూకుడును అడ్డుకోవచ్చు అని డబ్ల్యూహెచ్వో చెప్పింది. బ్రిటన్లో కొత్త కరోనా శరవేగంగా విస్తరిస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్వో స్పందించింది. కొత్త వైరస్ వ్యాప్తి రేటు అధికంగానే ఉన్నా.. ప్రస్తుతానికి మాత్రం కంట్రోల్లోనే ఉన్నదని డబ్ల్యూహెచ్వో ఎమర్జెన్సీ చీఫ్ మైఖేల్ ర్యాన్ తెలిపారు. …
Read More »దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు
ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 19,556 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జూలై 2 తర్వాత ఈ స్థాయిలో తక్కువగా కేసులు నమోదవడం ఇదే మొదటిసారి అని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,00,75,116కు చేరింది. కొత్తగా 30,376 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 96,36,487 కోలుకున్నారు. మరో 301 మృతి …
Read More »ఉత్తరప్రదేశ్లో ఘోరం
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో యమునా ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ట్యాంకర్ను కారును ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. వివరాల్లోకి వెళితే.. యూపీ 32 కేడబ్ల్యూ 6788 కారులో ఐదుగురు ఢిల్లీ వైపు వెళ్తున్నారు. తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో ఖండౌలి పోలీస్స్టేషన్ ప్రాంతంలో, టోల్ప్లాజాకు నాలుగు కిలోమీటర్ల ముందు ఓ ట్యాంకర్ను ఓవర్టెక్ చేసేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో …
Read More »క్యాస్టింగ్ కౌచ్ పై సీనియర్ నటి అన్నపూర్ణ సంచలన వ్యాఖ్యలు
క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒకప్పుడు అలవాటు లేని పదం కానీ ఇప్పుడు అందరికీ పరిచయం అయిపోయింది. ముఖ్యంగా రెండేళ్ల కింద మీటూ ఉద్యమం జరిగినపుడు దేశవ్యాప్తంగా ఇది ట్రెండింగ్ అయింది. దానికి తోడు తెలుగు ఇండస్ట్రీలో శ్రీ రెడ్డి కూడా నానా రచ్చ చేయడంతో అమ్మో అనుకున్నారంతా. అప్పట్నుంచి ఇప్పటి వరకు క్యాస్టింగ్ కౌచ్ అనేది ట్రెండ్ అవుతూనే ఉంది. అవకాశం ఇవ్వాలంటే మాకు కావాల్సింది ఇవ్వాలంటూ హీరోయిన్లను వేధించే …
Read More »