పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. ఈనేపధ్యంలో హికా తుపాను దూసుకొస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 85 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది, వాగులు పొంగి పొర్లుతుండటంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పటికే వర్షాలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాలకు హికా తుపాను వచ్చింది. …
Read More »ప్రధాని మోడీ తర్వాత అతడినే ఆధరించిన ప్రజానీకం..ఎవరా ఒక్కడు..?
తాజాగా యుగోవ్ సంస్థ నిర్వహించిన ప్రజలు మెచ్చిన వ్యక్తుల సర్వేలో భారత మాజీ సారధి ప్రస్తుత వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని రెండో స్థానంలో నిలిచాడు. ఇక మొదటి స్థానంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ నిలిచారు. ధోని ప్రస్తుత కెప్టెన్ విరాట్ మరియు సచిన్ టెండూల్కర్ ను పక్కకి నట్టేసి పైకి ఎకబాకాడు. ఓవరాల్ గా ఈ సంస్థ 41 దేశాల్లో 42,000 మంది అభిప్రాయలు స్వీకరించగా ఇందులో …
Read More »డెయిరీ, ఆటో మొబైల్, ఎలక్ట్రిక్ గ్రిడ్ ఆటోమేషన్, ఫుడ్ ప్రాసెసింగ్ లో పెట్టుబడులు కోరిన సీఎం
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తల బృందం కలిసింది. రెండురోజుల పర్యటనలో రాష్ట్రానికి వచ్చిన 13 మంది ఫ్రెంచ్ శాస్త్రవేత్తల బృందం గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయ్యారు. వీరు ఏపీలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపిస్తున్నారు. పెట్టుబడుల అనుకూలతను క్యాబినేట్ మంత్రులు, ఉన్నతాధికారులు శాస్త్రవేత్తల బృందానికి వివరించారు. రాష్ట్రంలోని డెయిరీ, ఆటో మొబైల్, ఎలక్ట్రిక్ గ్రిడ్ …
Read More »దసరా సెలవులకు చెక్ పెట్టనున్నారా..? ఇదెక్కడి న్యాయం ?
తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13వరకూ విజయ దశమి సందర్భంగా సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సెలవుల అనంతరం అక్టోబర్ 14న పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయని తెలిపారు. అలాగే అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు మరియు ఇతర విద్య సంస్థలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 9వరకూ దసరా సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక్కడ వరకు …
Read More »టిక్ టాక్ వల్ల విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు.. కష్టపడి సాధించిన ఉద్యోగాలు కోల్పోతున్నారు
టిక్ టాక్ అనే సోషల్ మీడియా యాప్ తో చాలామంది తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు తాము కష్టపడి సంపాదించిన ఉద్యోగాలను కూడా టిక్ టాక్ వల్ల కోల్పోతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు టిట్ టాక్ మోజులో పడి మృతి చెందాడు… ఈ ఘటన స్థానికులను కలచివేసింది. తెలంగాణలోని భీంగల్ మండలం గోను గొప్పుల గ్రామానికి చెందిన యువకులు గ్రామ శివారులోని కప్పుల వాగు చెక్ …
Read More »‘సైరా’ పై వర్మ స్పెషల్ ట్వీట్… ఆశ్చర్యకరమైన కామెంట్స్ !
మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి గాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాణ భాద్యతలు తీసుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదల కానుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రం పై టాలీవుడ్ …
Read More »ఎల్లో మీడియా వార్తలకు రెస్సాన్స్ లేకపోవడంతో మీరే రంగంలోకి దిగారా బాబూ..?
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా కాంట్రాక్టుల విషయంలో రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అప్పుడే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక ప్రతిపక్ష పార్టీ ఐన టీడీపీ మాత్రం తాము చేసిన మోసాలు ఎక్కడ బయటపడతాయో అని భయంతో ప్రభుత్వంపై బురద జల్లడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి …
Read More »ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్…24గంటల్లో మీముందుకు !
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ ప్రియులకు ఇది శుభవార్తే అని చెప్పాలి. ఇండియాలో ప్రస్తుతం ట్రేండింగ్ లో మరియు ఎవర్ గ్రీన్ మొబైల్ ఫోన్ ఏది అంటే అది యాపిల్ ఐఫోన్ అనే అందరు అంటారు. మార్కెట్ లోకి కొత్త ఫీచర్స్ తో వస్తే చాలు వెంటనే కొనేస్తారు. అలాంటిది ఇప్పుడు ఐఫోన్ 11 సెప్టెంబర్ 27న ఇండియాలో సేల్ మొదలుకానుంది. ఇక ఈ ఐఫోన్ 11 64జీబీ రేట్ …
Read More »ఈ ఫార్మాట్లో భారత ఆటగాళ్ళు వెనకబడ్డట్లే.. వరల్డ్ కప్ కష్టమే..!
టీమిండియా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉంది. ఒక్కప్పుడు ధోని సారధ్యంలో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది భారత్. ఎన్నో ఏళ్ల తరువాత టెస్టుల్లో అగ్రస్థానంలో నిలిచింది. అనంతరం 2007లో టీ20, 2011లో ప్రపంచ విన్నర్లుగా నిలిచింది. ఇలా ప్రతీ ఫార్మాట్లో ముందే ఉంది. మొన్న ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ లో సెమిస్ లో వెనుదిరిగింది. అయినప్పటికీ ఇప్పటికీ టాప్ లోనే ఉన్నప్పటికీ ఒక టీ20 విషయంలో …
Read More »మన్మధుడు 2 ఎఫెక్ట్..ఈసారి పకడ్బందీగా రానున్న సోగ్గాడు !
అక్కినేని నాగార్జున మన్మధుడు 2 ఫ్లాప్ తరువాత తాను నటించబోయే తరువాత చిత్రంపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. స్క్రిప్ట్ విషయానికి వచ్చేసరికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాడు. ఇలా మొత్తానికి ఒక యంగ్ డైరెక్టర్ కధ నాగ్ కి నచ్చింది. ఇక నాగార్జున చాలామంది యంగ్ డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇందులోని భాగంగానే ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ సోలోమన్ కధ నచ్చడంతో అతడికి గ్రీన్ సిగ్నల్ …
Read More »