ఆక్రమిత స్థలంలో ఉందంటూ తన గెస్ట్ హౌస్ ను శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హీరో ప్రభాస్ నేడు హైకోర్టును ఆశ్రయించారు. నందిని హిల్స్ లోని తన ఇంటికి తాళం వేసిన అధికారులు, నోటీస్ అంటించారని చెబుతూ, తాను ఇంటిని క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసివున్నానని, దానిపై నిర్ణయం వెలువడకుండానే ఎలా సీజ్ చేస్తారని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారుల నిర్ణయంపై స్టే విధించాలని ప్రభాస్ తరఫున ఆయన …
Read More »దెందులూరుపై జగన్ స్కెచ్.. అబ్బయ్య చౌదరి దెబ్బకి చింతమనేనికి చుక్కలు.. పవన్ కళ్యాణ్
ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు వివాదాలు కొత్తేమీ కాదు.. ఆయన రాజకీయ పయనం పూర్తిగా వివాదాల మయంగానే కనిపిస్తుంది. విపక్షంలో ఉన్నా, పాలకపక్షంలో ఉన్నా చింతమనేని అలాంటి చింతమనేనిపై ఇప్పుడు రాజకీయ మూకుమ్మడి దాడి జరుగుతుండడంతో చింతమనేనిరి ఊపిరాడడం లేదు. వాస్తవానికి దెందులూరుపై చింతమనేని కి గట్టి పట్టుంది. అందుకే ఆయన ఇన్నిసార్లు గెలిచారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఆయన క్యాడర్, బంధువులు, అనుచరులు ఉన్నారు. …
Read More »ఐపీఎల్లో రాజోలు కుర్రాడు..
ఇటివల కాలంలో తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడకు చెందిన క్రికెటర్ హనుమాన్ విహారి తనదైన శైలిలో ఆటను ప్రదర్శించి అందరి మన్నలను అందుకున్నాడు.అదే తరహాలో ఇండియా తరుపున ఆడే ఛాన్స్ వచ్చింది.ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో ఉన్నాడు.ఇతడిని ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ దక్కించుకుంది.అంతే కాకుండా నిన్న జరిగిన వేలం లో మన రాజోలు గ్రామానికి చెందిన బండారు అయ్యప్పను ఢిల్లీ కాపిటల్స్(DCS) జట్టు మరోమారు ఐపీఎల్ వేలంలో …
Read More »టీడీపీతో పొత్తే మమ్మల్ని ముంచింది…
కూటమి పేరుతో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు మంచిది కాదన్న వాదన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. ఓటమి నుంచి తేరుకుంటున్న కాంగ్రెస్… టీడీపీతో పొత్తు కొనసాగితే తెలంగాణలో పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందన్న అభిప్రాయంతో ఉన్నారు. లోక్సభ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో టీడీపీతో పొత్తుపై చర్చనియాంసంగా మారింది.లోక్సభ ఎన్నికల్లోనూ టీడీపీతో పొత్తు ఉంటే… తెలంగాణలో …
Read More »రాష్ట్రంలో స్వైన్ఫ్లూ భయం..
తెలంగాణలో స్వైన్ఫ్లూ భయం మొదలైంది.మరోమారు స్వైన్ఫ్లూ పంజా విసిరింది.రెండు రోజులుగా చలిగాలులు వీచడంతో స్వైన్ఫ్లూ వేగంగా విస్తరిస్తుంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో స్వైన్ఫ్లూతో ఒక వృద్ధుడు మరణించాడు.మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల వైరల్ జ్వరాలు, డెంగ్యూలాంటి జ్వరాలు ప్రబలుతున్నాయి. గాంధీ ఆస్పత్రికి వస్తున్న రోగుల సంఖ్య రెండ్రోజులుగా గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనం.ప్రజలు భయందోనలో ఉన్నారు.
Read More »ప్రముఖ హీరో గెస్ట్హౌస్ సీజ్
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో వెలసిన అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝుళిపించారు.రాయదుర్గం సమీపంలో ‘పైగా’ భూముల్లోని నిర్మాణాలను రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేశారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రముఖ సినీహీరో ప్రభాస్ గెస్ట్హౌస్ను సీజ్ చేశారు.పైగా భూముల్లో సర్వే నంబరు 46లో 84.30 ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలంపై ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తుల మధ్య సుప్రీంకోర్టులో వివాదం కొనసాగింది. మూడునెలల కిందట న్యాయస్థానం ఆ భూమి …
Read More »శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ట్రాన్స్జెండర్లు
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను కూడా అనుమతించాలని సుప్రీంకోర్టు సెప్టెంబరు 28న తీర్పు వెలువరించినా, దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఇవాళ ట్రాన్స్జెండర్లు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. డిసెంబర్ 16వ తేదీన దర్శనం కోసం బయలుదేరిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాళ్లు ఆందోళనకు దిగారు. ఆలయ ప్రధాన పూజారితో చర్చల అనంతరం ట్రాన్స్జెండర్లకు అనుమతి లభించింది. …
Read More »కేటీఆర్ జిల్లాల పర్యటన..మొదటి టూర్ ఇక్కడే
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల తారకరామారావు పార్టీ బలోపేతానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ నెల 20 నుంచి కేటీఆర్ జిల్లాల పర్యటనలు పర్యటన ప్రారంభించనున్నారు. ఈ నెల 20 నుంచి జిల్లాల్లో పర్యటించేలా షెడ్యూల్ సిద్ధం చేసుకుంటున్నారు. మొదటగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈమేరకు ఆయన హామీ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు కడియం శ్రీహరి, ఎంపీలు సీతారాంనాయక్, బండా ప్రకాశ్, …
Read More »లండన్ లో ఘనంగా ‘టీఆర్ఎస్ విజయోత్సవ’ సంబరాలు
లండన్ లో ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్వర్యంలో ‘టీఆర్ఎస్ విజయోత్సవ’ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూకే నలుమూలల నుండి భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు మరియు ప్రవాస బిడ్డలు హాజరయ్యారు. ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ పెద్దిరాజు మరియు కార్యదర్శి సత్యమూర్తి చిలుముల ఆద్వర్యం లో జరిగిన ఈ వేడుకల్లో కార్యక్రమంలో ముందుగా తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ గారి చిత్ర పటానికి పూలతో నివాళుర్పించి, అమరవీరులని స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. …
Read More »చిన్నపాటి గాలులకే అతలాకుతలం అవుతున్న అమరావతి.. తుఫాను వస్తే రాజధాని క్షేమమేనా.?
అమరావతిలోని వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవనానికి ఎన్నిసార్లు మరమ్మతులు చేసినా నాసిరకం పనుల డొల్లతనం బయటపడుతూనే ఉంది. తాజాగా పెథాయ్ తుపాను వల్ల రెండురోజులుగా ఓ మోస్తరు వర్షం పడుతోంది. దీంతో మళ్లీ అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఛాంబర్లోకి సోమవారం పైకప్పు నుంచి వర్షం నీరు చేరింది. దీంతో ఛాంబర్లోని ఫైళ్లన్నింటినీ మరో గదిలోకి మార్చారు. ఈ ఏడాది మే నెలలోనూ, అంతకుముందు కూడా పలుమార్లు …
Read More »