ఏపీలో 2 వేల కోట్ల స్కామ్పై గత నాలుగు రోజులుగా రాజకీయ రగడ కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య విమర్శ, ప్రతి విమర్శలతో ఏపీ రాజకీయం వేడెక్కుతోంది. 2 వేల కోట్ల స్కామ్లో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లపై విచారణ జరపాలని…వైసీపీ నేతలు డిమాండ్ చేస్తుంటే..మాజీ పీఎస్పై ఐటీ దాడులకు, చంద్రబాబుకేం సంబంధమని టీడీపీ నేతలు బుకాయిస్తున్నారు. తాజగా 2 వేల కోట్ల స్కామ్పై వైసీపీ సీనియర్ నేత, …
Read More »చంద్రబాబు పత్తిగింజ అని నమ్మించడానికి ఎల్లో మీడియా ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో..!
40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఇన్నేళ్ళలో ఎన్నో అన్యాయాలు, అక్రమాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా గత ఐదేళ్ళ పాలన విషయం గురించి మాట్లాడుకుంటే చెప్పాల్సిన అవసరమే లేదు. అధికార బలంతో ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశ్యంతో పదవిలో ఉన్నంతకాలం సొంతపనులే చేసుకున్నారు తప్పా ప్రజలకు మాత్రం చేసింది ఏమీ లేదు. చంద్రబాబు అండతో మంత్రులు, నియోజవర్గ ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు అండగా ఉండకుండా సొంత ప్రయోజనాలు కోసమే చూసుకున్నారు. …
Read More »రాజ్యసభకు మంత్రి మోపిదేవి వెంకటరమణ
ఏపీలో మార్చి నెలలో ఖాళీ కానున్న నాలుగు రాజ్య సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ నాలుగు స్థానాలు మొత్తం వైసీపీకి దక్కే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. దీనిలో భాగంగా నాలుగు స్థానాలకు అర్హులైన.. అభ్యర్థులను వెతికే పనిలో పడ్డారు ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి. ఈ క్రమంలోనే పార్టీకి చెందిన పలువురి పేర్లను జగన్ పరిశీలిస్తున్నారు. వీరిలో అయోధ్య రామిరెడ్డి తో పాటుగా …
Read More »బ్రేకింగ్..అమిత్షా దెబ్బకు షాకైన టీడీపీ ఎమ్మెల్సీలు…!
ఏపీ శాసనమండలి రద్దుపై హస్తిన వేదికగా రాజకీయాలు షురూ అయ్యాయి. రీసెంట్గా సీఎం జగన్ ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్లతో భేటీ అయి..శాసనమండలి రద్దు, మూడు రాజధానుల ఏర్పాటుపై సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. జగన్తో చర్చలు జరిగిన అనంతరం మోదీసహా కేంద్రమంత్రులు మండలి రద్దు, మూడు రాజధానుల ఏర్పాటుకు దాదాపుగా అంగీకరించినట్లు తెలుస్తోంది.. మార్చిలో జరిగే రెండో విడత …
Read More »పవన్ కళ్యాణ్ కట్టప్పను మించిపోయారట..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి దిగజారుడు వ్యాఖ్యలు చేసారు. ఈసారి ఏకంగా ప్రజలనే తప్పుపడుతూ ఆయన మాట్లాడారు.. ఐటీ అధికారులు చంద్రబాబు మాజీ పీఎస్ ఇంటిపై ఏకకాలంలో సోదాలు చేసిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగానే శ్రీనివాస్ దగ్గర నుండి ఐటీ అధికారులు పలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఓటు వేయడానికి ప్రజలు డబ్బు తీసుకుంటున్నారని …
Read More »పీకేతో సహా ఒక్కో టీడీపీ నేత పేరు పెట్టి మరీ పరువు తీసిన వైసీపీ ఎమ్మెల్యే..!
టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్పై జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో బయటపడిన 2000 కోట్ల స్కామ్పై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. ఇరు పార్టీలనేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. కాగా ఏపీ సీఎం జగన్ను కించపర్చేలా వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేతలు, జనసేన అధినేత పవన్కల్యాణ్పై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ విరుచుకుపడ్డారు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ …
Read More »వైసీపీ రాజ్యసభ సభ్యులు వీళ్లేనా.? సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా.?
పెద్దల సభకు పంపే నాయకులను ముఖ్యమంత్రి, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఏపీనుంచి నాలుగు సీట్లు ఖాళీ కానుండడంతో మార్చిలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో అన్నీ సీట్లను వైసీపీ కైవసం చేసుకోనుంది. అయితే ఆ నలుగురిలో ముగ్గురిపై స్పష్టత వచ్చింది. పెద్దల సభకు వెళ్లే నలుగురిలో ఇద్దరు రాజకీయ నాయకులుగా మారిన పారిశ్రామికవేత్తలని, మరొకరు జగన్కు అత్యంత విధేయుడైన మంత్రి అని తెలుస్తోంది. మొదటిగా ఆళ్ల అయోధ్యరామిరెడ్డి …
Read More »జగన్ ని ఫాలో అవుతున్న మహారాష్ట్ర ప్రభుత్వం.. దేశమంతా అభినందిస్తోంది !
మహిళలకు భద్రత కల్పించే విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని ఫాలో కావాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైసీపీ సర్కార్ తాజాగా తీసుకొచ్చిన దిశ చట్టాన్ని మహరాష్ట్రలోనూ అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించుకువది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ‘దిశ’ చట్టంపై అధ్యయనం చేసేందుకు ఫిబ్రవరి 20 న వారు ఇక్కడికి వస్తున్నట్లు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ వెల్లడించారు. ఈమేరకు ఆయన సోమవారం సాయంత్రం ట్వీట్ చేశారు.. మహిళలపై అత్యాచారాలను …
Read More »విశాఖ ఐటీపై జగన్ ప్రత్యేక దృష్టి..!
ఐటీ రంగంలో హై ఎండ్ స్కిల్స్పై ఒక సంస్థను విశాఖపట్నంలో ఏర్పాటుచేయాలని సీఎం ఆదేశించారు. ఇంజినీరింగ్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఇందులో ప్రవేశం కల్పించి వారిని మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దాలన్నారు. మొదటగా విశాఖపట్నంలో తర్వాత దీనికి అనుబంధంగా సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలో తర్వాత కాలంలో రెండు సంస్థలను ఏర్పాటుచేసేదిశగా ప్రణాళిక రూపొందించాలన్నారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలతో పోటీపడే పరిస్థితి రావాలంటే నైపుణ్యాలను ఆ నగరాలతో …
Read More »నేడు వెంకయ్యతో టీడీపీ ఎమ్మెల్సీల భేటీ.. లోకేష్ గైర్హాజరు !
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో మంగళవారం అంటే ఇవాళ సాయంత్రం ఢిల్లీలోని ఆయన నివాసంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీల ప్రతినిధి బృందం భేటీ అవ్వనుంది. ఏపీలో శాసనమండలి రద్దు నిర్ణయం అప్రజాస్వామికమని, రద్దుకు ఆమోదించవద్దని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు వెంకయ్య నాయుడికి కోరనున్నారు. అలాగే మూడు రాజధానుల నిర్ణయాన్ని కూడా కేంద్రం అడ్డుకోవాలని, అమరావతి రైతులకు న్యాయం చేయాలని వారు కోరనున్నారు. ఈభేటీ నిమిత్తం, శాసనమండలిలో విపక్ష నేత యనమల రామకృష్ణుడు, …
Read More »