న్యూజిలాండ్లో ఆరు నెలల తర్వాత తొలి కరోనా మరణం నమోదైంది. ఆ దేశ ఆరోగ్య అధికారులు శనివారం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 90 ఏండ్ల మహిళ కరోనా సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నదని తెలిపారు. వెంటిలేటర్ లేదా ఇంటెన్సివ్ కేర్ వ్యవస్థపై ఆమె లేకపోయినా శుక్రవారం రాత్రి ఆక్లాండ్ ఆసుపత్రిలో మరణించినట్లు చెప్పారు. న్యూజిలాండ్లో కోవిడ్ -19తో చనిపోయిన 27వ వ్యక్తి ఆ మహిళ అని, ఈ ఏడాది ఫిబ్రవరి …
Read More »కోవిడ్19 నివారణలో కీలకం కానున్న అత్యంత విష సర్పం
అత్యంత విష సర్పమే.. కోవిడ్19 నివారణలో కీలకం కానున్నది. బ్రెజిల్ అడవుల్లో కనిపించే సర్పం జరారాకుసో ( Jararacussu pit viper )కు చెందిన విషంతో కోవిడ్19ను అంతం చేయవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధ్యయన నివేదికను సైంటిఫిక్ జర్నల్ మాలిక్యూల్స్లో ప్రచురించారు. రక్తపింజర జరారాకుసో విషంలో ఉండే అణువులు.. కోవిడ్ వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ సర్ప విష అణువులు కోతుల్లో 75 …
Read More »అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన ప్రకటన
కాబూల్ విమానాశ్రయంలో పేలుళ్లకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. పేలుళ్లలో మృతిచెందిన అమెరికా సైనికులను హీరోలుగా అభివర్ణించారు. ఉగ్రమూకలను వేటాడి మరీ ప్రతీకారం తీర్చుకుంటామని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. ఐఎస్ఐఎస్ నాయకులను హతమార్చాలని అమెరికన్ ఆర్మీని ఆదేశించారు. ‘కాబుల్ ఎయిర్పోర్టులో జరిగిన పేలుళ్లలో మృతిచెందిన అమెరికా సైనికులు హీరోలు. ఈ ఘటనకు కారకులైన వారిని …
Read More »ఆఫ్ఘనిస్తాన్ లో దారుణం -ఒక వాటర్ బాటిల్ దాదాపు రూ.3వేలు..ప్లేట్ రైస్కు రూ.7500
ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ప్రజలు భయాందోళన చెందుతూ ప్రాణాలు కాపాడుకునేందుకు దేశాన్ని వీడుతున్నారు. తాలిబన్లు అన్ని మార్గాలను మూసివేడంతో అందరూ కాబూల్లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. ఇక్కడ ఎయిర్పోర్టులో మంచినీళ్లు, ఆహారానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరో వైపు ధరలు చుక్కలనంటుతుండడంతో ఆకలికి అలమటించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం విమానాశ్రయంలో ఒక వాటర్ బాటిల్ ధర 40 డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.3వేలు)కు …
Read More »ఆఫ్ఘన్ నుంచి ఢిల్లీకి వచ్చిన 16 మందికి కరోనా
ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారతీయుల తరలింపును కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఆఫ్ఘన్ గతవారం తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. దీంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. రక్షణ కరువడంతో ఆఫ్ఘన్ పౌరులతోపాటు, వివిధ కారణాల దృష్ట్యా అక్కడికి వెళ్లినవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలసబాటపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం మరో 78 మంది భారత్కు వచ్చారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా 16 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. …
Read More »కరోనా వైరస్ డెల్టా వేరియంట్ వ్యాప్తిని చైనా సమర్థవంతంగా అడ్డుకుంటోందా..?
కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ( Delta Variant ) వ్యాప్తిని చైనా సమర్థవంతంగా అడ్డుకుంటోంది. సోమవారం రోజున ఆ దేశంలో స్థానికంగా ఎటువంటి పాజిటివ్ కేసు నమోదు కాలేదు. జూలై తర్వాత జీరో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. నేషనల్ హెల్త్ కమిషన్ ఈ విషయాన్ని చెప్పింది. జూలై 20వ తేదీ నుంచి చైనాలో డెల్టా వేరియంట్ శరవేగంగా వ్యాపిస్తోంది. నాన్జింగ్ నగరంలో ఉన్న ఎయిర్పోర్ట్ సిబ్బందిలో …
Read More »అమెరికాలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభణ
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చాలా వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ వల్ల ఇప్పటికే అమెరికాలో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయని, గత నెలతో పోల్చుకుంటే ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు 286శాతం పెరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో కరోనా మరణాల్లో కూడా రికార్డు స్థాయి పెరుగుదల కనిపించింది. గడిచిన నెలరోజుల్లో కరోనా మరణాల్లో 146శాతం పెరుగుదల నమోదైనట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఇప్పుడు తాజాగా …
Read More »తాలిబన్ల అరాచకం – ఇక మహిళలు సెక్స్ బానిసలుగా మగ్గుతారు!
ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో ఇక అక్కడి మహిళలు ఇండ్లలో సెక్స్ బానిసలుగా మగ్గాల్సిందేనని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆందోళన వ్యక్తం చేశారు. కాబూల్లోని గోడపై మహిళ చిత్రాన్ని ఓ వ్యక్తి చెరిపేస్తున్న ట్విటర్ ఫోటోపై కామెంట్ చేస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లు మహిళలను ఎక్కడా కనిపించకుండా చేస్తారని..మహిళలు ఇండ్లలోనే సెక్స్ బానిసలుగా మగ్గిపోతూ పిల్లల్ని కనే యంత్రాలుగా ఉండాలని వారు భావిస్తారని అన్నారు. ఇస్లాం …
Read More »మళ్లీ మొదలయిన కరోనా విజృంభణ
ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 7 లక్షలకు పైగా కేసులు నమోదుకాగా, 10 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. శుక్రవారంనాటికి మొత్తం 20.65 కోట్ల కేసులు నమోదుకాగా, 43.6 లక్షల మంది మరణించారు. ముఖ్యంగా అమెరికా, భారత్, బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇరాన్లో కేసులు పెరుగుతున్నాయి. 135కు పైగా దేశాల్లోకి విస్తరించిన డెల్టా వేరియంట్ కారణంగానే ఈ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. …
Read More »దుబాయ్ వెళ్లేందుకు అది అవసరం లేదు
చెన్నై నుంచి దుబాయ్ వెళ్లే ప్రయాణికులు ఇకపై కరోనా నెగిటివ్ సర్టిఫికెట్లు సమర్పించాల్సిన అవసరం లేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ నెల ఆరు నుంచి దుబాయ్కి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఆ సందర్భంగా చెన్నై నుంచి వచ్చే ప్రయాణికులు నెగిటివ్ సర్టిఫికెట్, ఆర్టీపీసీఆర్ పరీక్షలకు సంబంధించిన ధ్రువపత్రాలు సమర్పించా లని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధికారులు ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం వాటిని రద్దు చేసినట్లు చెన్నై విమానాశ్రయ అధికారులు …
Read More »