దేశంలో మరోమారు కరోనా కేసులు పెరిగాయి. శుక్రవారం 44 వేల కేసులు నమోదవగా, తాజాగా అవి 46 వేలకు పెరిగాయి. ఇవి నిన్నటికంటే 12 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో మైళురాయిని అధిగమించింది. 24 గంటల్లో కోటి మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని తెలిపింది. దేశంలో కొత్తగా 46,759 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,26,49,947కు …
Read More »సుప్రీంకోర్టుకు కొత్తగా న్యాయమూర్తులు
ఎనిమిది మంది హైకోర్డు జడ్జిలు, సీనియర్ అడ్వకేట్ పీఎస్ నరసింహను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గురువారం ఆమోదం తెలిపారు. కొత్తగా నియమితులైన సుప్రీంకోర్టు జడ్జిల్లో ముగ్గురు మహిళలు.. జస్టిస్ బీవీ నాగరత్న, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బేలా ఎం త్రివేది ఉన్నారు. తాజా నియామకాలతో సుప్రీంకోర్టులో ఒక మహిళ ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టే …
Read More »దేశంలో కొత్తగా 44,658 కరోనా కేసలు
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 44,658 కరోనా పాజిటివ్ ( Corona Positive ) కేసులు కొత్తగా నమోదు అయ్యాయి. మరో వైపు కరోనా వల్ల 496 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వైరస్ సంక్రమించిన వారిలో సుమారు 32 వేల మంది నిన్న కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,36,861గా ఉంది. అయితే 24 గంటల్లో ఎక్కువ సంఖ్యలో …
Read More »దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇటీవల తగ్గుతూ వచ్చిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 46,164 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. కొత్తగా 34,159 మంది బాధితులు కోలుకున్నారని తెలిపింది. మరో 607 మంది బాధితులు వైరస్ బారినపడి కన్నుమూశారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,25,58,530కు చేరింది. ఇప్పటి వరకు 3,17,88,440 …
Read More »ఆఫ్ఘన్ నుంచి ఢిల్లీకి వచ్చిన 16 మందికి కరోనా
ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారతీయుల తరలింపును కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఆఫ్ఘన్ గతవారం తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. దీంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. రక్షణ కరువడంతో ఆఫ్ఘన్ పౌరులతోపాటు, వివిధ కారణాల దృష్ట్యా అక్కడికి వెళ్లినవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలసబాటపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం మరో 78 మంది భారత్కు వచ్చారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా 16 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. …
Read More »ఆస్తులు అమ్మి అచ్ఛేదిన్ అంటారా?
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను టోకుగా అమ్మకానికి పెట్టింది. ఆర్థికలోటు తీవ్రంగా ఉన్నందున ప్రజల ఆస్తులను ఆమ్మాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ అమ్మకం దశలవారీగా కొనసాగుతుందని చెప్పారు. దేశంలోని ప్రతి రంగంలో ప్రైవేటీకరణకు అనుమతిస్తున్నట్లు ప్రకటించడం హాస్యాస్పదం.సహజ వనరులైన గనులు మొదలుకొని రోడ్లు, ప్రాజెక్టులు, కంపెనీలను అమ్మబోతున్నట్లు కేంద్రం ప్రకటించటం గర్హనీయం. ఈ స్థాయిలో గతంలో ఏ ప్రభుత్వమూ ఆస్తులను ప్రైవేటుకు అప్పగించలేదు, అమ్మకానికి పెట్టలేదు. …
Read More »భారత్లో దీర్ఘకాలంగా కరోనా
భారత్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో)కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ ఊహకందని హెచ్చరిక జారీ చేశారు. భారత్లో కోవిడ్-19 మహమ్మారి స్థానికత స్థాయికి చేరింది. ఫలితంగా ఇది స్వల్పంగా లేదా మధ్యస్థంగా వ్యాప్తి చెందుతుంటుందన్నారు. ఇటువంటి పరిస్థితిలో జనం ఈ వైరస్తో సహజీవనం చేస్తూ, అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా నుంచి ఉపశమనం లభించాలంటే దీర్ఘకాలం పడుతుందన్నారు. దేశంలోని …
Read More »అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక ప్రకటన
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సమాధి ప్రాంతంలో రూ.39 కోట్లతో స్మారక మండపాన్ని నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. కలైవానర్ అరంగం హాలులో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం ఉదయం 110వ నిబంధనల కింద ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ సందర్భంగా స్టాలిన్ ప్రసంగిస్తూ.. మెరీనాబీచ్లో కరుణానిధి సమాధి ప్రాంతం వద్ద 2.2 ఎకరాల్లో స్మారక మండపాన్ని నిర్మించనున్నామని తెలిపారు. ఏడుదశాబ్ధాలపాటు పాత్రికేయుడిగా, ఐదు దశాబ్దాలపాటు …
Read More »దేశంలో కరోనా విజృంభణ
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. నిన్న 25వేలకు చేరిన పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. మరో వైపు మరణాలు సైతం 600కుపైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 37,593 కొత్త కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 34,169 మంది బాధితులు కొలుకొని డిశ్చార్జి అయ్యారు. మహమ్మారి బారినపడి 24 గంటల్లో 648 మంది బాధితులు మృత్యువాతపడ్డారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.99 …
Read More »కరోనా వైరస్ డెల్టా వేరియంట్ వ్యాప్తిని చైనా సమర్థవంతంగా అడ్డుకుంటోందా..?
కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ( Delta Variant ) వ్యాప్తిని చైనా సమర్థవంతంగా అడ్డుకుంటోంది. సోమవారం రోజున ఆ దేశంలో స్థానికంగా ఎటువంటి పాజిటివ్ కేసు నమోదు కాలేదు. జూలై తర్వాత జీరో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. నేషనల్ హెల్త్ కమిషన్ ఈ విషయాన్ని చెప్పింది. జూలై 20వ తేదీ నుంచి చైనాలో డెల్టా వేరియంట్ శరవేగంగా వ్యాపిస్తోంది. నాన్జింగ్ నగరంలో ఉన్న ఎయిర్పోర్ట్ సిబ్బందిలో …
Read More »