ఛత్తీస్ గఢ్ రాష్ట్రం రాజ్ నందగామ్ జిల్లా పల్లెమూడి అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఐటిబిపి బలగాలు, ఛత్తీస్ గఢ్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్ లో ముగ్గురు మావోలు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్ కౌంటర్ బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగినట్టు సమాచారం. మృతుల్లో దళాకమాండర్ రాకేశ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. …
Read More »పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సర్కారుకు కేంద్రం ఝలక్ .
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని చూస్తున్న సంగతి తెల్సిందే .తాజాగా ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు సర్కారుకు ఝలక్ ఇచ్చింది .ఈ క్రమంలో కేంద్ర జలవనరుల ,ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి మీడియాతో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి కోరిక మేరకు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడానికి …
Read More »ఆధార్ లింక్ తుది గడువు పొడిగింపు
ప్రభుత్వ సేవలు పొందడానికి ఆధార్ కచ్చితమా లేదా అనే అంశంపై సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. దీనిపై పలు స్వచ్ఛంద సంస్థలు పిటిషన్లు వేశాయి. వాదనలు విన్న సుప్రీం కోర్టు.. అక్టోబర్ 30కి వాయిదా వేసింది. అయితే ఆధార్ తప్పనిసరి చివరి తేదీని వచ్చే ఏడాది మార్చి 31కి పొడిగించినట్టు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది కేంద్రం. గతంలో ఇది 2017 డిసెంబర్ 31 వరకు ఉండేది. ఈ పొడిగింపు కేవలం …
Read More »రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంచలన నిర్ణయం!
పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన టెలీకం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. నవంబర్ చివరినాటికి 2జీ మొబైల్ వ్యాపారానికి గుడ్బై చెప్పాలని నిర్ణయించింది. అయితే 3జీ, 4జీ సేవలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించింది. కంపెనీ కార్యకలాపాలను కుదిస్తున్నందున పెద్ద సంఖ్యలో ఉద్యోగులను కంపెనీని వీడివెళ్లాలని కోరినట్టు సమాచారం. అయితే దీనిపై ఆర్కామ్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఈ నెల మొదట్లో ఎయిర్సెల్తో విలీన ఒప్పందం కుదుర్చుకున్న …
Read More »మోదీ సర్కారుపై దీదీ తిరుగుబాటు ..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు మీద పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి మండిపడ్డారు.ఆమె మీడియాతో మాట్లాడుతూ తన ఫోన్ నంబర్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకోనని… కావాలంటే తన నంబర్ ను కట్ చేసుకోవచ్చని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఫోన్ నంబర్ కు ఆధార్ ను అనుసంధానం చేసుకోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి మనకు తెలిసిందే. దీనిపై వేసిన పలు కేసులను …
Read More »గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
గుజరాత్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రెండు విడుతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 9, 14 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 18న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Read More »నేడు గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ?
దేవ వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది. రెండు దశాబ్దాలుగా హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్తోపాటు గుజరాత్ ఎన్నికల తేదీలను ప్రకటించిన ఈసీ ఈ సారి సంప్రదాయం పాటించలేదు. గుజరాత్లో వరద సహాయక చర్యలు జరుతుగున్నాయని అందుకే ప్రకటించలేదని సమర్ధించుకుంది. కానీ, ప్రతిపక్షాలు మాత్రం మోడీ టూర్లో హామీలకు అడ్డంకి లేకుండా చేశారని విమర్శించాయి. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయలేదనే కారణంతో …
Read More »యూపీ సీఎంపై సెటైర్ల వర్షం!
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ పాలనపై బీఎస్పీ అధినేత్రి మాయవతి సెటైర్లు వేశారు. దేవాలయాల్లో పూజలు చేసుకున్న తరువాత సమయం ఉంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచిస్తారంటూ ఆరోపించారు. నిజాంగఢ్లో నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గొన్న మాయావతి ఆదిత్యనాథ్ వెనుకబడిన పుర్వాన్చల్ నుంచి వచ్చిన నేతేనని, అయినప్పటికీ ఆయన ఆ ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. యోగి ఎప్పుడూ ఆలయాల్లోనే కనిపిస్తున్నారని ఎద్దేవ చేశారు. బీజేపీ పాలనలో …
Read More »భయం వద్దు.. మనం భద్రం
భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయన్నారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీ. మూడేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు బాగానే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. సంస్కరణల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా దీర్ఘకాల ఫలితాలు అందుతాయన్నారు. ఈ మూడేళ్లలో మన దేశం ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధిరేటును నమోదు చేసిందని తెలిపారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థపై బలంగా ప్రభావం …
Read More »7 లక్షల కోట్లతో మెగా హైవే ప్రాజెక్టులకు కేంద్రం పచ్చజెండా..!
రానున్న ఐదేళ్లలో దాదాపు రూ.7 లక్షల కోట్లతో 83 వేల కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేసే ప్రతిష్టాత్మక హైవే ప్రాజెక్ట్లకు మంగళవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిలో ప్రతిష్టాత్మక భారత్మాల ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా దేశవ్యాప్తంగా తొలి దశలో 20 వేల కిలోమీటర్ల మేర కొత్త హైవేలను నిర్మిస్తామని ఈ మధ్యే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించిన విషయం తెలిసిందే. వచ్చే ఐదేళ్లలో …
Read More »