మీకు హౌసింగ్ లోన్ కావాలా? అయితే బ్యాంకు చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన అవసరం లేదు. వాట్సాప్ ద్వారా రెండు నిమిషాల్లో లోన్ లెటర్ ఇవ్వనున్నట్లు హోంలోన్స్ అందించే హెడ్డీఎఫ్సీ సంస్థ ప్రకటించింది. లోన్ అవసరమైన వారు 9867000000 నంబర్కు వాట్సాప్లో మెసేజ్చేయాల్సి ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. కస్టమర్లు అందించే ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఆధారంగా లోన్ ఆఫర్ లెటర్ను జారీ చేయనున్నట్లు వెల్లడించింది.
Read More »మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్
మైక్రోసాఫ్ట్ కంపెనీ తమ ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. ఉద్యోగుల శాలరీ దాదాపుగా డబుల్ చేస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి మెయిల్ ద్వారా సీఈవో సత్యనాదెళ్ల స్టాఫ్కి తెలిపారు. ఉద్యోగులు అద్భుతంగా వర్క్ చేస్తున్నారని.. అందుకే మనకి అధిక డిమాండ్ఉందన్నారు. ఈ విషయంలో స్టాఫ్కి థాంక్స్ చెబుతున్నట్లు సీఈవో తన మెయిల్లో పేర్కొన్నారు. ఉద్యోగులకు గ్లోబల్మెరిట్ బడ్జెట్ను రెట్టింపు చేస్తున్నామని.. లోకల్ డేటా బట్టి శాలరీ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందని …
Read More »మాజీ కేంద్రమంత్రి చిందంబరం తనయుడు కార్తీ చిదంబరం నివాసంలో CBI సోదాలు
కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిందంబరం తనయుడు కార్తీ చిదంబరం నివాసంలో సెంట్రోల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నది. కార్తీ చిదంబరం నివాసాలతో పాటు దేశవ్యాప్తంగా కార్యాయాలయాల్లో సోదాలు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కార్తీ చిదరంబరంపై నమోదైన కేసుల్లో భాగంగానే ఢిల్లీ, ముంబై, చెన్నై, కర్నాటక, ఒడిశా తొమ్మిది ప్రాంతాల్లో సీబీఐ తనిఖీలు నిర్వహిస్తున్నది. 2010-2014 మధ్యకాలంలో కార్తీ చిదంబరం విదేశాలకు …
Read More »దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి
దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో 1,569 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. నిన్నటితో పోలిస్తే 28.7శాతం తక్కువని పేర్కొంది. తాజాగా వైరస్తో 19 మంది మృతి చెందగా.. 24 గంటల్లో 917 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4,31,25,370కి పెరిగింది. ఇందులో 4,25,84,710 మంది కోలుకున్నారు. మహమ్మారి …
Read More »నాడు రూ.920తో పెట్టుబడి.. నేడు వందల కోట్లకు అధిపతి!
కేవలం రూ.920 పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించిన వ్యక్తి ఇప్పుడు రూ.వందలకోట్ల బిజినెస్కు అధిపతి అయ్యారు. ఆయనే ప్రముఖ వజ్రాల వ్యాపారి, శ్రీ రామకృష్ణ ఎక్స్పోర్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్’ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ గోవింద్ ఢోలాకియా. ఈ విషయాన్ని తన ఆత్మకథలో వెల్లడించారు. తన జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఉన్నతమైన విలువే తోడ్పాటు అందించాయని పేర్కొన్నారు. ఒకప్పుడు తన వ్యాపారం ప్రారంభించేందుకు రూ.920 కోసం కష్టపడ్డానని చెప్పారు. ఆత్మకథతో తన పాతరోజులను …
Read More »పొలిటికల్ ఎంట్రీపై గౌతమ్ అదానీ క్లారిటీ
ప్రముఖ వ్యాపార వేత్త.. ప్రపంచ బిలియనీర్ గౌతమ్ అదానీ రాజకీయాల్లోకి వచ్చే అంశంపై క్లారిటీ చ్చారు. ఆయన మాట్లాడుతూ తమ కుటుంబంలో ఎవరికి కూడా రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ స్పష్టం చేశారు. ఏపీ నుంచి తనకు గానీ, తన భార్య ప్రీతి అదానీకి గానీ రాజ్యసభ సీటు అంటూ వస్తున్న వార్తలను ఖండించారు. రాజ్యసభ సీట్లు ఖాళీ అయినప్పుడల్లా తమ పేరును తెరపైకి …
Read More »వాకింగ్ వెళ్తుండగా యాక్సిడెంట్.. సినీ నిర్మాత మృతి
వాకింగ్కు వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగి ఓ సినీ నిర్మాత మృతచెందారు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. కన్నడ సినీ నిర్మాత బాల్ రాజ్ వాకింగ్ చేసేందుకు జేపీ నగర్లోని తన ఇంటి నుంచి బయల్దేరారు. వాకింగ్ చేసేందుకు తన కారు ఆపి రోడ్డు దాటుతుండగా అటుగా వెళ్తున్న ఓ వెహికల్ ఆయన్ను ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స …
Read More »భారతీయుడికి అసామాన్య గుర్తింపు.. ప్రకటించిన పోప్
మనదేశంలో 18వ శతాబ్దంలో పుట్టి క్రిస్టియానిటీని స్వీకరించిన దేవ సహాయం పిళ్లైకు ఇక నుంచి దైవదూతగా గుర్తింపు లభించనుంది. క్రిస్టియన్ల ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం వాటికన్ సిటీలో ఆదివారం జరిగిన ప్రత్యేక వేడుకలో దేవసహాయం పిళ్లైను దైవదూతగా పోప్ ప్రాన్సిస్ ప్రకటించారు. ఈ గుర్తింపు లభించిన తొలి భారతీయ సామాన్యుడిగా పిళ్లై చరిత్రలో నిలిచిపోనున్నారు. తమిళనాడులోని కన్యాకుమారి గతంలో ట్రావెన్కోర్ రాజ్యంలో భాగంగా ఉండేది. ఆ జిల్లాలోని హిందూ నాయర్ల …
Read More »కుమారుడి మృతి.. కోడలికి దగ్గరుండి మళ్లీ పెళ్లిచేసిన అత్తమామలు!
కొడుకు కరోనాతో చనిపోవడంతో అత్తమామలే దగ్గరుండి కోడలి మరో పెళ్లి చేయించారు. అంతేకాకుండా తమ కుమారుడి పేరిట ఉన్న ఇంటిని కూడా కోడలికే రాసిచ్చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో చోటుచేసుకుంది. రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయి యుగ్ ప్రకాశ్ కుమారుడు ప్రియాంక్ కరోనాతో మరణించాడు. అతడికి భార్య ప్రియాంక, 9 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ప్రియాంక్ మృతి చెందిన నేపథ్యంలో కోడలి జీవితం ఇక్కడితో ఆగిపోకూడదనే ఉద్దేశంతో అత్త, …
Read More »దేశంలో కొత్తగా 2,827 కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో దేశంలో 2,827 కరోనా కేసులు వెలుగుచూశాయి. 24 మంది మరణించారు. తాజాగా 3,230 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 19,067 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు 190.83 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.
Read More »