దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో 12,751 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. తాజాగా 16,412 మంది బాధితులు కోలుకోగా.. మహమ్మారి బారినపడి 42 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,41,74,650కి చేరింది. ఇందులో 4,35,16,071 మంది కోలుకున్నారు. వైరస్ కారణంగా 5,26,772 మంది ప్రాణాలు వదిలారు.ప్రస్తుతం దేశంలో 1,31,807 …
Read More »తల్లీకొడుకు కలిసే చదివారు.. గవర్నమెంట్ జాబ్తో అదరగొట్టారు…
కొడుకును ప్రయోజకుడిని చేయడానికి చిన్నతనం నుంచి దగ్గరుండి చదివించింది. కొడుకు చదువుపై మరింత శ్రద్ధ చూపేందుకు తానూ పుస్తకాలు చదవడం ప్రారంభించింది. తొమ్మిదేళ్ల తర్వాత తల్లీకొడుకులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. బిందు 42 ఏళ్లు.. కొడుకును పదో తరగతి పరీక్షలకు చదివిస్తూ ఆమె పుస్తకాలు తిరగేసేది. దీంతో ఆసక్తి పెరిగి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (పీఎస్సీ) పరీక్షలకు శిక్షణ తీసుకుంది. తాజాగా బిందు …
Read More »దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 16,167 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే 15,549 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 1,35,510కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 0.31 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 98.50 శాతానికి చేరింది. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ల పంపిణీ 206.56 కోట్లకు చేరింది
Read More »ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు ఏంటి.. ఏమి లభిస్తాయి..?
భారత నూతన ఉపరాష్ట్రపతిగా జగ్దీప్ ధన్కఢ్ఘ నవిజయం సాధించారు. ఆయన గెలుపును లోక్సభ జనరల్ సెక్రటరీ ఉత్పల్ కె.సింగ్ అధికారికంగా ప్రకటించారు. 346 ఓట్ల ఆధిక్యంతో ధన్కఢ్ గెలుపొందారు. మొత్తం పోలైన 725 ఓట్లలో 528 ఓట్లను ఆయన సొంతం చేసుకున్నారు. 15 ఓట్లు చెల్లలేదు. ధన్కఢ్పై విపక్షాల అభ్యర్థిగా పోటీ చేసిన మార్గరెట్ ఆల్వాకు 182 ఓట్లు వచ్చాయి.ఉపరాష్ట్రపతిగా అతనికి ఏమి ఏమి వసతులు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. …
Read More »మాజీ సీఎం ఉద్దవ్ థాక్రేకు భారీ షాక్
మహరాష్ట్రలో రాజకీయ వివాదం తర్వాత ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామంటూ ఆ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే-బీజేపీ కూటమికి తొలి నుంచి సవాల్ విసురుతున్న శివసేన చీఫ్, మాజీ సీఎం ఉద్దవ్ థాక్రేకు భారీ షాక్ తగిలింది. తాజాగా 62 మండలాల్లోని 271 పంచాయితీలకు ఓటింగ్ జరిగింది. ఇందులో బీజేపీ మద్దతుదారులు 82 స్థానాలు కైవసం చేసుకున్నారు. NCP 53, శివసేన (షిండే వర్గం) 40 స్థానాలు గెలుచుకుంది. శివసేన …
Read More »మోదీకి షాకిచ్చిన నితీశ్ కుమార్
ప్రధానమంత్రి నరేందర్ మోదీ అధ్యక్షతన ఈరోజు ఆదివారం జరుగనున్న నీతిఆయోగ్ సమావేశాన్ని బీహార్ సీఎం నితీశ్కుమార్ బహిష్కరించారు. తొలుత డిప్యూటీ సీఎంను సమావేశానికి పంపాలని భావించినా.. ఆ సమావేశానికి సీఎంలు మాత్రమే హాజరుకావాలని కేంద్రం కచ్చితంగా చెప్పడంతో బీహార్ తరఫున ఎవరూ వెళ్లట్లేదు. ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన సమావేశానికి ఇటీవల నితీశ్ గైర్హాజరయ్యారు. కాగా, గత కొద్ది నెలలుగా వాయిదా పడుతున్న …
Read More »దేశంలో కొత్తగా 18,738 కరోనా కేసులు
దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 19 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, ఆదివారం ఆ సంఖ్య 18,738కి తగ్గింది. దీంతో మొత్తం కేసులు 4,40,78,506కు చేరాయి. ఇందులో 4,34,84,110 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,689 మరణించారు. మరో 1,34,933 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 40 మరణించగా, 18,558 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ …
Read More »అయ్యో.. లుంగీ కట్టుకొచ్చాడని సినిమా టికెట్ ఇవ్వలేదు!
లుంగీ కట్టుకుని థియేటర్కు వచ్చాడని మేనేజ్మెంట్ సినిమా టికెట్ నిరాకరించింది. ఈ ఘటన బంగ్లాదేశ్లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి సదరు వ్యక్తి చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో థియేటర్ మేనేజ్మెంట్ వివరణ ఇచ్చింది. బంగ్లాదేశ్లోని మీర్పూర్లో ఉన్న ‘స్టార్ సినీ ప్లెక్స్’లో ‘పోరన్’ సినిమా ఆడుతోంది. ఆ సినిమా చూసేందుకు సమన్ అలీ సర్కార్ అనే వ్యక్తి లుంగీ ధరించి వెళ్లారు. …
Read More »రేషన్ కార్డులకు వెబ్ రిజిస్ట్రేషన్
ఇల్లులేనివారు, అభాగ్యులు, వలసదారులు, ఇతర అర్హులైన వారికి రేషన్కార్డులు అందించేందుకు కామన్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్టు కింద 11 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దీన్ని ప్రారంభించారు. ఈ నెలాఖరు నాటికి అన్ని రాష్ర్టాల్లోనూ అమలుచేయనున్నారు. అర్హులైన వారిని వేగంగా గుర్తించి రేషన్ కార్డులు అందించడంలో రాష్ర్టాలకు సహకారం అందించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు. వలసదారులు, ఇతర లబ్ధిదారులు ఎవరిసాయమైనా తీసుకొని కామన్రిజిస్ట్రేషన్ ఫెసిలిటీలో …
Read More »దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి
దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,406 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి మరో 19,928 మంది కోలుకున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,34,793 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 4.96 శాతంగా ఉందని తెలిపింది.
Read More »