మాజీమంత్రి,టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలో గత కొన్ని రోజులక్రితం జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు కోల్పోయిన వారు.. మరోసారి తమ ఓటును నమోదు చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.రేపు ఓటరు జాబితా సవరణలో పేరు నమోదుతో పాటు మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. Request all to utilise this opportunity …
Read More »నిరుద్యోగులకు చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు…రోజుకో మాట మారుస్తున్న ప్రభుత్వం
2014 ఎన్నికల ముందు ‘జాబు రావాలంటే బాబు రావాలి..’ అంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నిరుద్యోగులను నిలువునా ముంచారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలపై రోజుకో మాట.. పూటకో నిర్ణయం తీసుకుంటూ గత నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగులతో చెలగాటమాడుతూ సమయాన్ని గడిపేస్తున్నారు.నోటిఫికేషన్లు విడుదల చేయకుండా కాలం వెళ్లదీసిన ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ అరొకర పోస్టులు ప్రకటించిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. మొన్న విడుదల చేసిన పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీ …
Read More »రిపబ్లిక్ టీవీ సర్వే… పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్కు 16, వైసీపీకి 14 సీట్లు..!!
మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే రానున్న పంచాయితీ,పార్లమెంట్ ఎన్నికల్లో కుడా ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ముందుకు పోతుంది.ఈ నేపధ్యంలోనే జాతీయ మీడియా సంస్థ రిపబ్లిక్ టీవీ ఒక సర్వే చేసింది.ఏపీలో ఈ డిసెంబర్ నెలలో ఎన్నికలు జరిగితే ఏపీలోని మొత్తం 25 లోక్ సభ స్థానాలకు గాను ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ 14 చోట్ల విజయం …
Read More »ఉగాది నుంచే నిరుద్యోగ భృతి..!!
ఎన్నికల ప్రచార మేనిఫెస్టో లో భాగంగా ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగికి నెలకు రూ.3016 భృతి అందజేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది.ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిరుద్యోగ భృతి ఎలా అమలు చేయాలి..దీనికి మార్గదర్శకాలు ఏమిటి.. లబ్ధిదారులను ఎలా గుర్తించాలనే అంశాలకు …
Read More »టీడీపీ- కాంగ్రెస్ పొత్తు..మోడీ సంచలన వ్యాఖ్యలు
సిద్ధాంతాలను గాలికి వదిలేసి తెలుగుదేశం- కాంగ్రెస్ పార్టీలు కుదుర్చుకున్న పొత్తుపై ప్రధాని మోడీ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడుతున్న `మహాకూటమి`పై అది ఓ ‘అపవిత్ర కూటమి’గా అభివర్ణించారు. మదురై, తిరుచిరాపల్లి, తిరువళ్లూరు, చెన్నై తూర్పు, ఉత్తర ప్రాంతాల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో ఈరోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల …
Read More »మీరు చేస్తే కాపురం ఇంకొకరు చేస్తే వ్యభిచారం అవుతుందా బాబు?
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరుపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ఎంపీ వై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను చంద్రబాబు ఎద్దేవా చేయడం ఆయన ఘాటు స్పందించారు. ఈ మేరకు పలు ట్వీట్లలో చంద్రబాబు తీరును ఎండగట్టారు. ‘మీరు నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేయొచ్చు. మళ్లా కాంగ్రెస్తో జతకట్టొచ్చు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటే మూడో కూటమి …
Read More »టీఆర్ఎస్ గెలుపు..బాబు డబుల్ గేమ్…వైసీపీ సంచలన ప్రశ్న
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ గెలుపుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరును వైసీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా ఎండగట్టారు. తెలంగాణలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని అంటున్న చంద్రబాబు అదే సమయంలో మిగిలిన మూడు రాష్ట్రాల్లో ఈవీఎంలపై ఎందుకు మాట్లాడం లేదని ఆనం రామనారాయణ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని …
Read More »వర్మతో పెట్టుకున్న టీడీపీ…మైండ్ బ్లాంకయ్యే రిప్లై ఇచ్చిన ఆర్జీవీ
సంచలన సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి వెన్నుపోటు సాంగ్ను వర్మ రిలీజ్ చేశారు. ఈ పాట వివాదానికి దారితీసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని కించపరిచేలా వెన్నుపోటు పాట ఉందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్లలో వర్మపై ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి ప్రతిష్టను దిగజార్చేలా …
Read More »కేసీఆర్ మాటకే జై కొట్టిన లోక్ సత్తా జేపీ
కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దేశవ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ప్రత్యేక విమానంలో నేడు వివిధ రాష్ర్టాల పర్యటనకు బయల్దేరిన సంగతి తెలిసిందే. అయితే గులాబీ దళపతి మాటకు లోక్సత్తా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ జైకొట్టారు. ఫెడరల్ వ్యవస్ధతోనే దేశాభివృద్ది సాధ్యమన్నారు లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ. చాలా అధికారాలు …
Read More »ఆంధ్రాలో కేసీఆర్కు భారీ స్వాగతం..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఈరోజు మరోసారి రుజువు అయింది. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ లోని విశాఖపట్నం శారదా పీఠాన్ని సందర్శించనున్న క్రమంలో పీఠంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పీఠంలోని రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని కేసీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, తోరణాలు ఏర్పాటు చేశారు. విశాఖ విమానాశ్రం …
Read More »