పసిపిల్లల బోసి నవ్వులు చూస్తే ఆ ఆనందమే మాటల్లో చెప్పలేం. అదే ఏడిస్తే ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు ఏడుస్తున్నారో తెలీదు. అదే ప్రయాణంలో వారు గుక్కపట్టి ఏడిస్తే.. ఏమైందా అని ఓ టెన్షన్ అయితే.. చుట్టు పక్కల వారు ఏమనుకుంటారా అని మరో టెన్షన్. తాజాగా ఇలాంటి ఓ సంఘటన విమానంలో చోటు చేసుకుంది. ఓ పసిబిడ్డ గుక్క పట్టి ఏడ్వడంతో ఆ సిబ్బంది చేసిన పనికి …
Read More »ఎక్కువ మార్కులు వచ్చాయని చంపేశారు..!
పుదుచ్చేరిలోని కరైకల్ నగర్లో దారుణం చోటుచేసుకుంది. పరీక్షల్లో తన కూతురు కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడని ఓ స్టూడెంట్ని కడతేర్చింది ఓ తల్లి. కరైకల్ నగర్ ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ మాలతిల రెండో కొడుకు మణికంఠన్ నెహ్రూనగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. మణికంఠన్ ఎప్పుడూ మంచి మార్కులతో టాపర్గా నిలిచేవాడు. ఈసారి పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. దీంతో విక్టోరియా అనే మహిళ మణికంఠన్కు తన …
Read More »ఛార్మి షాకింగ్ డెసిషన్.. ట్వీట్ వైరల్..!
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాకు ఛార్మి నిర్మాత అని తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా కోసం చాలా ఇన్వెస్ట్ చేసిన ఛార్మి ఇప్పుడు తెగ బాధ పడుతోందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో ఛార్మి తీసుకున్న ఓ షాకింగ్ నిర్ణయం వెనుక లైగర్ ఎఫెక్ట్ ఉందని ఊహాగానాలు …
Read More »మాదాపూర్ ఎస్ఐ రాజేంద్రకు జైలు శిక్ష
ప్రస్తుతం మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న రాజేంద్రకు ఏసీబీ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. గతంలో రాయదుర్గంలో ఎస్ఐగా పనిచేసిన రాజేంద్ర లంచం తీసుకుంటూ దొరికిపోయారు. 2013లో ఇర్షాద్ ఖురేషీ బైక్ను తిరిగి ఇచ్చేందుకు రాజేంద్ర రూ.10 వేలు డిమాండ్ చేశారు. దీనిపై అనీశాకు ఫిర్యాదు అందగా రాజేంద్ర లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. దీనికి సంబంధించిన తీర్పును తాజాగా ఏసీబీ కోర్టు వెలువరించింది.
Read More »ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి నాగార్జున డ్రీమ్ లాండ్ లో స్థానికంగా నెలకొన్న పలు సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొంపల్లి నుండి దూలపల్లి వెళ్లే రోడ్డు అభివృద్ధి, నాలా నిర్మాణం, ప్రధానంగా మంచినీటి కనెక్షన్లు, పారిశుధ్య నిర్వహణ, వీధి ద్వీపాల వంటి సమస్యలను కాలనీ వాసులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. …
Read More »మునుగోడులో టీఆర్ఎస్దే విజయం – టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో సీఎం కేసీఆర్
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్దే గెలుపని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో శనివారం సాయంత్రం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ శాసనసభా పక్షం సమావేశం జరిగింది. సమావేశానికి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన వారినుద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈడీ, సీబీఐని చూసి భయపడొద్దన్నారు. కేంద్ర …
Read More »సీఎం కేసీఆర్ గారితో సీపీఎం నేతలు భేటీ..?
తెలంగాణలో మత విద్వేషాలకు తావులేదని, అందుకు ప్రయత్నించే దుష్టశక్తులను ఐక్యంగా తిప్పికొడదామని ప్రజాస్వామిక లౌకికవాద శక్తులకు ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. మతం పేరుతో ప్రజల నడుమ విభజన తేవాలని చూసే స్వార్థ రాజకీయాలను తిప్పికొట్టేందుకు తమతో కలిసిరావాలని బుద్ది జీవులను మేధావులను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. ఈమేరకు శనివారం నాడు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్రీ తమ్మినేని వీరభధ్రం, ఆపార్టీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే …
Read More »దేశంలో కొత్తగా 6809 కరోనా పాజిటీవ్ కేసులు
దేశంలో కొత్తగా 6809 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,44,56,535కు చేరాయి. ఇందులో 4,38,73,430 మంది కోలుకున్నారు… 5,27,991 మంది బాధితులు కరోనా మహమ్మారి భారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మరో 55,114 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో మంది మరణించగా, 8414 మంది వైరస్ నుంచి బయటపడ్డారు.రోజువారీ పాజిటివిటీ రేటు 2.12 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. …
Read More »జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పర్యటన
జగిత్యాల రూరల్ మండల చల్ గల్ గ్రామంలో సిడిపి,DMFT నిదులు 6.30లక్షల తో నిర్మించిన మున్నూరు కాపు వెల్ఫేర్ సొసైటీ నలువాల వాడ మున్నూరు కాపు సంఘ కమ్యూనిటీ హాల్ ను ప్రారంబించిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు, జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ గారు. అనంతరం.మున్నూరు కాపు సంఘం అధ్వర్యంలో వినాయకుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి,అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే,జెడ్పీ చైర్ …
Read More »రేపే జార్ఖండ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష
జార్ఖండ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, నిబంధనలకు విరుద్ధంగా తనకు తానే బొగ్గుగనులను కేటాయించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధారించి ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ పై అనర్హత వేటు వేయాలని, ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని ఆ రాష్ట్ర గవర్నర్కు సూచించిన సంగతి విదితమే. అయితే ఈ నేపథ్యంలో సీఎం హేమంత్ సోరెన్ సస్పెన్షన్పై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ.. విశ్వాస పరీక్ష సిద్ధమయ్యారు. రేపు …
Read More »