Home / SLIDER (page 449)

SLIDER

గజ్వేల్‌కు నేటి నుంచి గూడ్స్‌ రైలు రాకపోకలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్‌కు నేటి నుంచి గూడ్స్‌ రైలు రాకపోకలు ప్రారంభం కానున్నాయి. గజ్వేల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎరువుల రేక్‌ పాయింట్‌కు అనుసంధానంగా ఈ రైలు సరకు రవాణా చేస్తుంది. ఈ సేవలను రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి 12 బోగీలతో వచ్చే ఈ తొలి గూడ్స్‌ రైలులో 11 మెట్రిక్‌ టన్నుల ఎరువులు రానున్నాయని …

Read More »

కొల్లాపూర్‌లో సై అంటే సై.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అరెస్ట్‌

కొల్లపూర్‌కి చెందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చకు వెళ్తుండగా పోలీసులు హర్షవర్ధన్‌రెడ్డిని అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. దీంతో కొల్లాపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొల్లపూర్‌నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌పార్టీలో రెండు వర్గాలున్నాయి. ఒకటి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుది కాగా.. మరొకటి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిది. గత కొంతకాలంగా ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. కొల్లాపూర్‌ అభివృద్ధిపై …

Read More »

ఆత్మకూరు బైపోల్‌.. వైసీపీకి తిరుగులేని విజయం

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతితో ఆత్మకూరులో జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది. గౌతమ్‌రెడ్డి సోదరుడు, వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి జయకేతనం ఎగురవేశారు. సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌ యాదవ్‌పై 82,742 ఓట్ల మెజారిటీతో విక్రమ్‌రెడ్డి గెలుపొందారు. మొత్తం 20 రౌండ్లలో లెక్కింపు చేపట్టగా ప్రతి రౌండ్‌లోనూ విక్రమే ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చి చివరకు ఘన విజయం సాధించారు. ఈనెల 24న జరిగిన …

Read More »

ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితాలు- ఆధిక్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

ఏపీలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మంత్రి గౌతం రెడ్డి మృతితో ఇక్కడ రీ పోలింగ్ నిర్వహించారు. గౌతం రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డిని వైసీపీ బరిలో దింపింది. బీజేపీ తరుపున భరత్ కుమార్, బీఎస్పీ తరుపున  ఓబులేసు పోటీలో ఉన్నారు. మొదటి రౌండ్ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  10వ రౌండ్ ఫలితాలు : వైసీపీ అభ్యర్థి  …

Read More »

ఒక్కసారి చార్జింగ్‌ పెడితే ఏకంగా వెయ్యి కిలోమీటర్ల వరకు దూసుకెళ్లోచ్చు..?

ఒక్కసారి చార్జింగ్‌ పెడితే ఏకంగా వెయ్యి కిలోమీటర్ల వరకు దూసుకెళ్లేందుకు వీలుగా చైనాకు చెందిన ఓ సంస్థ కొత్త బ్యాటరీని అభివృద్ధిపరిచింది. కాంటెంపరరీ అంపెరెక్స్‌ టెక్నాలజీ అనే సంస్థ సెల్‌ టు ప్యాక్‌ (సీటీపీ) థర్డ్‌ జెనరేషన్‌ సాంకేతికతతో ‘క్విలిన్‌’ పేరిట ఈ బ్యాటరీని రూపొందించింది. 2023 నాటికి ఈ బ్యాటరీలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక దూరం నడిచే బ్యాటరీ ఇదేనని చెబుతున్నారు. …

Read More »

వర్షంలో ఆ పని చేయాలన్పిస్తుందంటున్న అనసూయ

ప్రస్తుతం  వర్షాకాలం వచ్చేసింది. దీంతో చల్లగాలులు వీస్తున్నాయి. ప్రతిరోజు సాయంత్రం  చిరుజల్లులు పడుతుంటే వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. వేడివేడి బజ్జీలు, పకోడీ, సమోసాలు తింటూ వర్షాన్ని ఆస్వాదించేందుకు ఇష్టపడతారు చాలామంది. ఆ జాబితాలో తానూ ఉన్నానంటున్నది హాట్‌ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌.యాంకర్‌గా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి, సినిమా ఆర్టిస్ట్‌గా మారి మంచిమంచి పాత్రలతో ఆకట్టుకుంటున్నది అనసూయ. వర్షాకాలంలో వేడివేడి మిర్చీబజ్జీ, పునుగులు తినేందుకే తను ఇష్టపడుతుందట. ‘.. అదో అదిరిపోయే …

Read More »

కియారా అడ్వానీకి ఆ రోజే చావు ఖాయమనుకుందంట … ఎందుకంటే..?

ఒక పక్క అందం, మరోవైపు చక్కని  అభినయం కలబోసినట్టు ఉంటుంది హట్ బ్యూటీ కియారా అడ్వానీ. ఈ బాలీవుడ్‌ భామ ‘ధోని-ది అన్‌టోల్డ్‌ స్టోరీ’, ‘భరత్‌ అను నేను’, ‘వినయ విధేయ రామ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ‘దయ్యాల సినిమాలంటే భయం’.. అంటూనే హారర్‌ థ్రిల్లర్‌ ‘భూల్‌భులైయా-2’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కియారా తన గురించి పంచుకున్న ముచ్చట్లు..కాలేజీ రోజుల్లో విహారయాత్రకు ధర్మశాలకు వెళ్లాం. విపరీతమైన మంచు. …

Read More »

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడతాయా..?

దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసులు తక్కువయ్యాయి. శుక్రవారం సుమారు 18 వేల కేసులు నమోదవగా, శనివారం 15,940కి తగ్గాయి. కొత్తగా 11,739 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,33,89,973కు చేరాయి. ఇందులో 4,27,72,398 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మరో 92,576 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,24,999 మంది కరోనాతో మరణించారు. కాగా, గత 24 గంటల్లో 25 …

Read More »

ఇంగ్లండ్‌తో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ

 ఇంగ్లండ్‌తో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు రెగ్యులర్‌ కెప్టెన్‌ హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మకు (Rohit Sharma) కరోనా పాజిటివ్‌గా తేలింది. శనివారం (జూన్‌ 25న) నిర్వహించిన రాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు బీసీసీఐ ప్రకటించింది. రోహిత్‌ ప్రస్తుతం బీసీసీఐ మెడికల్‌ టీం పర్యవేక్షణలో ఐసోలేషన్‌లో ఉన్నాడని తెలిపింది.గతేడాది నిలిచిపోయిన ఐదో టెస్టు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో వచ్చే నెల 1 నుంచి ప్రారంభమవుతుంది. అయితే …

Read More »

టీచర్లంతా ఆస్తులు వెల్లడించాల్సిందే: తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు

ఉపాధ్యాయుల విషయంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం టీచర్లు తమ ఆస్తుల వివరాలను ప్రకటించాలని ఆదేశించింది. నల్గొండ జిల్లా గుంటిపల్లి పాఠశాల హెడ్‌మాస్టర్‌ మహమ్మద్‌ జావేద్‌ అలీ విధులకు హాజరుకాకుండా రాజకీయ కార్యకలాపాలు, స్థిరాస్తి వ్యాపారాలు, సెటిల్‌మెంట్లలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారంటూ 2021లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అతడిపై వచ్చిన ఆరోపణల్లో చాలా వరకు నిజమేనని తేల్చింది. విద్యాశాఖ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat