పరిపాలన సౌలభ్యం కొరకు వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల స్థానంలో హన్మకొండ, వరంగల్ జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో నగర మేయర్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, కార్పొరేటర్లు ముఖ్యమంత్రి నిలువెత్తు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి సి.ఎం.కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాల ఏర్పాటుకు సహకరించిన రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు కె టి ఆర్, రాష్ట్ర పంచాయతీ రాజ్, …
Read More »తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో రాష్ట్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను అందుబాటులోకి తేవాలని సంకల్పించింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంగళవారం మంత్రివర్గం సమావేశమైంది. ఇకపై ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను అందుబాటులోకి తేవాలని సంకల్పించింది. ఈ మేరకు అన్ని రకాల పోస్టులలో ఖాళీలను గుర్తించిన తర్వాత ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ కోసం ‘వార్షిక క్యాలెండర్’ను …
Read More »మంత్రి కేటీఆర్ తో సింగపూర్ హైకమిషనర్ సమావేశం..
తెలంగాణ రాష్ట్రంలో నూతన రంగాల్లో అనేక పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, ఈ అవకాశాలను సింగపూర్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు పరిచయం చేయడంలో సహకారం అందిస్తామని భారతదేశంలో సింగపూర్ హై కమిషనర్ సిమోన్ వాంగ్ అన్నారు.ఈరోజు ప్రగతి భవన్ లో పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావుతో సింగపూర్ హైకమిషనర్ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా హైదరాబాద్ మరియు తెలంగాణ గురించి మంత్రి కే తారకరామారావు పలు వివరాలు అందించారు. హైదరాబాద్ నగరం కొన్ని …
Read More »లండన్ లో నిరాడంబరంగా “టాక్ లండన్ బోనాల జాతర”
తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ ( టాక్) ఆధ్వర్యం లో ప్రతీ సంవత్సరం ఘనంగా బోనాల జాతరను, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపుతో మన సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటిచెప్పేలా వైభవంగా నిర్వహించుకుంటామని, కానీ గత సంవత్సర కాలంగా కరోనా – కోవిడ్ పరిస్థితుల్లో అందరూ సంబరాలకు దూరంగా ఉంటూ సంస్థగా సమాజానికి వీలైనంత సేవ చేస్తూన్నామని అధ్యక్షులు రత్నాకర్ కడుదుల తెలిపారు.బోనాల సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించి …
Read More »వర్గల్ సిద్ధాంతి ని పరామర్శించిన మంత్రి హరీష్ రావు ..
సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సిద్ధిపేట జిల్లా వర్గల్ శ్రీ విద్యాసరస్వతీ శనైశ్వరాలయం వ్యవస్తాపక అధ్యక్షుడు , ప్రముఖ పంచాంగ సిద్ధాంతి శ్రీ యాయవరం చంద్ర శేఖర శర్మ గారిని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన మంత్రి హరీష్ రావు… వారి ఆరోగ్య పరిస్థితి ని వైద్యులను అడిగి తెల్సుకొని మెరుగైన చికిత్స అందించాలని కోరారు , త్వరగా కొలుకొని అమ్మవారి సేవలో పాత్రులు కావాలని , …
Read More »6 నెలల్లో కాంగ్రెస్ మొత్తం ఖాళీ-కౌశిక్ రెడ్డి
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై..ఆ పార్టీ బహిష్కృత నేత కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్కు రూ. 50కోట్లు ఇచ్చి.. రేవంత్ పదవి పొందారని ఆరోపించారు. మాణిక్కం ఠాగూర్ ఓ యూజ్ లెస్ ఫెలో అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సినిమా యాక్టర్ రేవంత్ ఫీల్ అవుతున్నారని..తెలంగాణ పీసీసీ పదవి వస్తే సీఎం అయినట్లు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. 6 నెలల్లో కాంగ్రెస్ మొత్తం …
Read More »తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 696 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక కరోనాబారిన పడి మరో ఆరుగురు మృతి చెందారు. ఇక రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు.. 97.08శాతంగా ఉంది. కొత్తగా 858మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. మరోవైపు గడిచిన 24గంటల్లో 1,05,797 కరోనా పరీక్షలు చేశారు.
Read More »సీఎం కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు
వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల స్థానంలో హన్మకొండ, వరంగల్ జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినందుకు సీఎం కేసీఆర్కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. గత నెల 21న వరంగల్ నగర పర్యటన సందర్భంగా ప్రజాప్రతినిధులు, ప్రజల వినతి మేరకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రజలకు సౌకర్యార్ధం సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీని ద్వారా …
Read More »కృష్ణా జలాల్లో అన్యాయం జరిగితే సహించేదిలేదు -మంత్రి హరీశ్రావు
కృష్ణా జలాల పంపిణీలో అన్యాయం జరిగితే ఎట్టిపరిస్థితిలోనూ ఊరుకోబోమని, న్యాయమైన వాటా దక్కేవరకు పోరాడుతామని ఆర్థికమంత్రి హరీశ్రావు తెలిపారు. అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం ఒకఏడాదిలో ఈ సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రం ఏడేండ్లుగా నాన్చుతు న్నదని మండిపడ్డారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ‘వర్తమాన రాజకీయ పరిస్థితులు- కర్తవ్యాలు’ అనే అంశంపై దేశపతి శ్రీనివాస్ అధ్యక్షతన హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో సోమవారం నిర్వహించిన సదస్సుకు మంత్రి హరీశ్రావు …
Read More »సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడు రాష్ట్ర క్యాబినేట్ సమావేశం
ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఉద్యోగ నియామకాలు, కృష్ణ జలాల వివాదం, తదితర అంశాలు ప్రధాన ఎజెండాగా చర్చకు రానున్నాయి. త్వరలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్.. అందుకు సంబంధించిన ఖాళీలను పరిశీలించనున్నారు. ఈ మేరకు అధికారులు సమగ్రమైన నోట్ రూపొందించి నేడు ముఖ్యమంత్రికి అందజేయనున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో …
Read More »