Home / SLIDER / కృష్ణా జలాల్లో అన్యాయం జరిగితే సహించేదిలేదు -మంత్రి హరీశ్‌రావు

కృష్ణా జలాల్లో అన్యాయం జరిగితే సహించేదిలేదు -మంత్రి హరీశ్‌రావు

కృష్ణా జలాల పంపిణీలో అన్యాయం జరిగితే ఎట్టిపరిస్థితిలోనూ ఊరుకోబోమని, న్యాయమైన వాటా దక్కేవరకు పోరాడుతామని ఆర్థికమంత్రి హరీశ్‌రావు తెలిపారు. అంతర్‌రాష్ట్ర జలవివాదాల చట్టంలోని సెక్షన్‌ 3 ప్రకారం ఒకఏడాదిలో ఈ సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రం ఏడేండ్లుగా నాన్చుతు న్నదని మండిపడ్డారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ‘వర్తమాన రాజకీయ పరిస్థితులు- కర్తవ్యాలు’ అనే అంశంపై దేశపతి శ్రీనివాస్‌ అధ్యక్షతన హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో సోమవారం నిర్వహించిన సదస్సుకు మంత్రి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత నెలరోజుల్లోనే కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణ వాటా కోసం కేంద్రానికి విన్నవించామని గుర్తుచేశారు.


కేంద్రం పట్టించుకోకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించామని వివరించారు. కృష్ణా జలాల పంపిణీని పూర్తిచేస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతోపాటు, షరతులు విధించటంవల్లనే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నా సమస్యకు కేంద్రం పరిష్కారం చూపడంలేదని విమర్శించారు.

సంవత్సర కాలానికి మాత్రమే చేసుకున్న నీటి ఒప్పందాన్ని ఏపీ సీఎం జగన్‌ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తెలంగాణకు న్యాయం చేయాలని డిమాండ్‌చేశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను మేధావులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు. రాబోయే ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని తెలంగాణ వికాస సమితి ప్రతినిధులను మంత్రి హరీశ్‌ కోరారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat