తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా కేంద్రం సిద్దిపేట ఉపాధ్యాయ భవన్ లో జరుగుతున్న కానిస్టేబుల్ శిక్షణా శిబిరాన్ని మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు… ఈ సందర్భంగా వారితో కాసేపు సూచనలు…సలహాలు… ఇస్తూ… ఆత్మీయంగా ముచ్చటించారు.. శిక్షణా తరగతుల నిర్వహణ పై అడిగి తెలుసుకున్నారు… స్వయంగా విద్యార్థులని లేపి మాట్లాడించారు… కోచింగ్ బాగా ఇస్తున్నారా … ఎట్లా ఉందమ్మ… ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా… భోజనం ఎలా ఉంది… అని …
Read More »నేను అమెరికాలో పని చేస్తూ చదువుకున్నా..ఎంపీ కవిత
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ డేలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇంజినీరింగ్ ప్రతి బ్రాంచ్లో టాపర్స్కు సర్టిఫికెట్స్ అందజేశారు. కళాశాలలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆడిటోరియం బ్లాక్తో పాటు ప్లేస్మెంట్, రిక్రూట్మెంట్ సెల్ను ప్రారంభించారు. అనంతరం హరితహారంలో భాగంగా కాలేజీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..”బాగా కష్టపడి ప్రతిఒక్కరు చదవాలి. నా …
Read More »మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తంరెడ్డికి మంత్రి జగదీష్ రెడ్డి గట్టి కౌంటర్
నాటా2018 మెగా కన్వెన్షన్ లో భాగంగా అమెరికాలో తెలంగాణ అభివృద్ధిపై జరుగుతున్న చర్చా కార్యక్రమంలో మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రసంగానికి అడ్డు తగిలిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తం రెడ్డి కి మంత్రి జగదీష్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సూర్యాపేట పట్టణాన్ని గత ప్రభుత్వాలే సిండికేట్లతో నాశనం చేశారన్నారు. భూ …
Read More »కడియంకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ..!!
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి జన్మదిన సందర్భంగా గవర్నర్ నరసింహ్మన్, ముఖ్యమంత్రి కేసిఆర్ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కడియం శ్రీహరిగారు పూర్తి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని పుట్టిన రోజు శుభాకాంక్షల్లో పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నివాసానికి ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ, ఎంపీ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎమ్మెల్యే అరూరి రమేష్, టిఆర్ఎస్ …
Read More »మరో 20 సంవత్సరాలు కేసీఆరే సీఎం..!!
రానున్న మరో ఇరవై సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ అన్నారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీలో ఒక్క బీసీ ఎమ్మెల్యే లేరని అన్నారు.తెలంగాణ రాష్ట్రప్రభుత్వం బీసీలకు మేలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతోందన్నారు. కాంగ్రెస్ నేతలు నేల విడిచి సాము చేస్తున్నారని, కాంగ్రెస్ నేతల బతుకంతా రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవడమేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే కళ్ళుమండి కేసులేస్తున్నారని, ఇక …
Read More »శరత్ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం..కేటీఆర్
అమెరికాలోని కన్సాస్ రెస్టారెంట్లో ఓ దుండగుడి కాల్పుల్లో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ విద్యార్థి కొప్పు శరత్ శనివారం సాయంత్రం మృతిచెందిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా అమీర్పేటలో శరత్ కుటుంబసభ్యులను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా వారి కుటుంబసభ్యులకు మంత్రులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు.అమెరికాలో జరిగిన …
Read More »హైదరాబాద్ అభివృద్ధికి ..సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సంచలన, కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగరాన్ని నిజమైన గ్లోబల్ సిటిగా మార్చడానికి ప్రభుత్వం తరఫున కీలక ప్రకటన చేశారు. రాబోయే మూడేళ్లలో రూ.55 వేల కోట్లతో హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఒక్క హైదరాబాద్ నగరానికే ఏడాదికి రూ.15వేల చొప్పున రూ.45 వేలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. మిగతా నగరాల్లో చేపట్టే పనుల …
Read More »ఖాజీపేటకు తీపికబురు..!!
ఖాజీపేట వ్యాగన్ పీరియాడికల్ ఓవరాలింగ్ వర్క్ షాప్ ఏర్పాటులో భాగంగా భూమి కొనుగోలు, ఇతర పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 40 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాగన్ పీరియాడికల్ ఓవరాలింగ్ వర్క్ షాప్ ఏర్పాటును వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చేస్తున్న కృషి ఫలించింది. ఖాజీపేటలో వ్యాగన్ పీరియాడికల్ ఓవరాలింగ్ వర్క్ షాప్ ఏర్పాటు చేస్తే స్థానికంగా ఉన్న …
Read More »తెలంగాణకు హరితహారం..సీఎం కేసీఆర్ కీలక ఆదేశం
వచ్చే ఏడాది నుంచి ఏడాదికి వంద కోట్ల మొక్కలు నాటి, వాటిని పరిరక్షించే విధంగా తెలంగాణకు హరితహారం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఇంత పెద్ద మొత్తంలో మొక్కలు సిద్ధం చేయడానికి వీలుగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీల సంఖ్య పెంచాలని చెప్పారు. అడవుల పునరుద్ధరణ, సామాజిక అడవుల పెంపకంతో పాటు పండ్ల చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై ముఖ్యమంత్రి …
Read More »కుల వృత్తుల వారికి ఆర్థిక సాయం అందిస్తాం..సీఎం కేసీఆర్
బిసి వర్గాలు ఆర్థికంగా బలోపేతం కావడానికి వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఆర్థిక సహాయం అవసరమైన వారి జాబితాలు రూపొందించాలని కోరారు. చిన్న వ్యాపారాలు చేసే వారికి, కుల వృత్తులు నిర్వహించుకునే వారికి బ్యాంకులతో సంబంధం లేకుండానే వందశాతం సబ్సిడీతో ఆర్థిక సహాయం నేరుగా అందించాలని చెప్పారు. బిసి వర్గాల సంక్షేమం …
Read More »