అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వం విప్ చింతమనేని ప్రభాకర్ నిత్యం వివాదాలతోనే సావాసం చేస్తుంటారు. అయితే వచ్చే ఎన్నికల్లో చింతమనేనిని ఓడించేందుకు విపక్ష వైసీపీ సిద్ధమవుతోంది. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలిచిన చింతమనేని ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులపై చేయి చేసుకోవడం, రౌడీయిజం ఇతరత్రా వివాదాలతో చింతమనేని అంటే అందరికీ విసుగొచ్చేసింది. గతంలో అసెంబ్లీలో సైతం విపక్ష నేత వైఎస్ జగన్ను …
Read More »Blog Layout
ప్రధాని మోడీని సీఎం కేసీఆర్ ఎందుకు కలిశారంటే..?
బిసి, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ శాసనసభ చేసిన రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్రపతి నుంచి ఆమోదం పొందేలా చొరవ చూపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రధాన మంత్రి నరేంద్రమోడిని కోరారు. తెలంగాణ స్థానిక యువకులకు ఉద్యోగవకాశాల్లో ప్రాధాన్యం లభించేందుకు ఏర్పాటు చేసుకున్న జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలపాలని, హైకోర్టును తక్షణం విభజించాలని కోరారు. ఈ రెండు జరగనిదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పరిపూర్ణం కానట్లేనని …
Read More »టీడీపీ నేత శ్రీనివాస చౌదరీపై నాన్ బెయిలబుల్ కేసు..!
హత్తిబెళగల్ క్వారీ యజమాని, టీడీపీ నేత శ్రీనివాస చౌదరీపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సెక్షన్ 304/11 ప్రకారం యజమానిపై కేసు నమోదు చేసినట్లు కర్నూల్ పోలీసులు శనివారం తెలిపారు. కర్నూలులోని ఆలూరు మండలం హత్తిబెళగల్ క్వారీలో శుక్రవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించడంతో పదిమంది మృతి విషయం తెలిసిందే. దీనిపై ఎట్టకేలకు ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ స్పందించారు. మైనింగ్ బ్లాస్టింగ్ వలన …
Read More »వైఎస్ జగన్ వేట మొదలైయ్యింది… అక్కడి నుండి దమ్మున్న నేతను రంగంలోకి..!
ఏపీలో ఎన్నికల 6 నెలలు ముందే రాజకీయం వేడెక్కుతుంది. ప్రతి పక్షం ప్లాన్ లకు ,అధికారంలో ఉన్న పార్టీ తలపట్టుకుంటుంది. వ్చే ఎన్నికల్లో గెలవాలని ప్రతి పక్షం…ఎలాగైన మళ్లీ అధికారంలోకి రావలని అధికార పార్టీలు అంత రెడి చేసుకుంటున్నారు. ఇందులో బాగంగానే ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చాల జాగ్రత్తగా మాస్టర్ ప్లాన్ల్ వేస్తున్నాడు. అయితే గత ఎన్నికల్లో విశాఖ జిల్లాలోని పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో …
Read More »కరుణానిధిని పరామర్శించిన సీఎం చంద్రబాబు..!
కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. శనివారం ఉదయం చెన్నై చేరుకున్న సీఎం చంద్రబాబు నేరుగా కావేరీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని పరామర్శించి ఆయన ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన స్టాలిన్ ఆయనకు దగ్గరుండి మరీ కరుణానిధి ఆరోగ్య పరిస్థితి వివరించారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి సోమిరెడ్డి …
Read More »కర్నూలు జిల్లాలో ఘోర దుర్ఘటన 12 మంది మృతి ..10 మంది గల్లంతు..5 మంది పరిస్థితి విషమం
కర్నూలు జిల్లాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఆలూరు మండలం హత్తిబెళగల్ వద్ద కొండపైనున్న కంకర క్వారీలో శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది కూలీలు దుర్మరణం చెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడగా.. 10 మంది గల్లంతయ్యారని సమాచారం. గాయపడిన వారు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బాధితులంతా ఒడిశా, చత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన …
Read More »కర్నూల్ జిల్లాలో దారుణ హత్య..!
కర్నూల్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. జిల్లాలోని కోసిగి మండలంలోని అగసనూరు సమీపంలోని పొలాల్లో ఓ వ్యక్తిని హత్య చేసి బావిలో పడేసిన సంఘటన శుక్రవారం వెలుగుచూసింది. పోలీసుల సమాచారం మేరకు.. ఉదయం అగసనూరు గ్రామానికి చెందిన వడ్డే చిన్నకర్రెప్ప పొలానికి నీరు పెట్టేందుకు బావి వద్దకు వెళ్లాడు. ఈక్రమంలో బావిలో వ్యక్తి మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించింది. దీంతో చుట్టుపక్కల వారికి తెలపడంతో అందరూ కలిసి పోలీసులకు సమాచారం …
Read More »ఎమ్మెల్యే భారతి కొడుకు దారుణ హత్య..!
రైలు పట్టాలపై ఎమ్మెల్యే కుమారుడి మృతదేహం పట్నాలో కలకలం రేపింది. బిహార్ రాష్ట్రం పట్నా రైల్వేస్టేషన్ లో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని మృతదేహాన్ని రైల్వే అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టగా..అది జేడీయూ ఎమ్మెల్యే బీమా భారతి కుమారుడు దీపక్గా గుర్తించారు.ఘటనా స్థలానికి చేరుకున్నా ఎమ్మెల్యే భారతి, ఆమె కుటుంబ సభ్యులు భోరున విలపించారు. తమ కుమారుడిని ఎవరో హత్య చేశారని ఆరోపించారు. ముసల్లాపూర్లో ఫ్రెండ్స్ ఇంట్లో పార్టీ …
Read More »వైఎస్ జగన్ 228వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతిపక్ష, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 228వ రోజు శనివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చెందుర్తి క్రాస్ రోడ్ నుంచి ప్రారంభమైంది. ఆయన వెంట నడిచేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జగన్ తో పాటు వేలాది మంది ప్రజలు అడుగులో అడుగులు వేస్తున్నారు. చేబ్రోలు మీదుగా దుర్గాడ క్రాస్ వరకు ఈ రోజు పాదయాత్ర కొనసాగుతుంది. వైఎస్ …
Read More »నేడు ప్రధాని మోడీ తో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శనివారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడితో సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు చర్చించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలపాల్సిందిగా కోరనున్నారు. కొత్త జోనల్ వ్యవస్థ అవసరాన్ని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి వివరించనున్నారు. హైకోర్టు విభజన అంశంపై కూడా ప్రధానమంత్రితో చర్చిస్తారు. హైకోర్టును సత్వరం విభజించాల్సిందిగా ప్రధానిని కోరనున్నారు. వీటితో పాటు …
Read More »