తెలంగాణ కాంగ్రెస్ శాసన సభాపక్షం నేడు భేటీ కానుంది. ఈ నెల 27 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. జానారెడ్డి, షబ్బీర్ అలీ అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ సమావేశం జరగనుంది. తొలుత ఈ నెల 26న సీఎల్పీ సమావేశం పెట్టాలనుకుంటున్నారు. అదే రోజు బీఎస్సీ ఉండటంతో ప్రీ పోన్ చేశారు. రుణమాఫీ, భారీ వర్షాలకు పంట నష్టం, గ్రేటర్ హైదరాబాద్లో …
Read More »Blog Layout
ప్లాస్టిక్ బాటిళ్లలోని నీళ్లను తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
ప్లాస్టిక్ బాటిళ్లలోని నీళ్లను తాగుతున్నారా? అయితే జాగ్రత్త..! ఈ బాటిల్డ్ నీళ్ల వాడకం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. రుచిగా ఉన్నాయని, మినరల్స్ ఎక్కువగా ఉన్నాయని.. అన్నింటినీ మించి సురక్షితమైన నీరని బాటిళ్లను కొంటున్నాం. కానీ ఆ బాటిల్ నీరు.. అతి ప్రమాదకరం. రుచిగా ఉండేందుకు వాటర్ కంపెనీలు.. పలు రకాల రసాయనాలు, చక్కెరలను కలుపుతున్నాయి. అంతేకాదు ప్లాస్టిక్ బాటిళ్ల నుంచి హానికారకమైన విష రసాయనాలు విడుదలవుతుంటాయి. అవి మనం …
Read More »ఇకపై ఉర్దూలోనూ పోటీ, ప్రవేశ పరీక్షలు..!
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉద్యోగాల ఖాళీల భర్తీ కోసం నిర్వహించే పోటీ పరీక్షలు, వివిధ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షలను ఉర్దూ భాషలోనూ నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఇప్పటికే విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన కసరత్తును తెలంగాణ విద్యాశాఖ ఇప్పటికే మొదలు పెట్టింది. కాగా.. దేశ వ్యాప్తంగా నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను ఉర్దూలోనూ …
Read More »టీడీపీలో గుబులు రేపుతున్న సుబ్బు- ఎవరీ సుబ్బు…!
ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కాళిదాసు సుబ్రహ్మణ్యం అలియాస్ వేమూరి సుబ్బు ఓ రౌడీ షీటర్. అతడిని విజయవాడ టీడీపీ పెద్దలు మరింతగా పెంచిపోషించారు. తమ రాజకీయ అవసరాల కోసం అతడికి అండదండలు అందించారు. సుబ్బు విజయవాడకు చేరిన కొత్తలో కొన్నాళ్లు కాట్రగడ్డ శ్రీనుకు అనుచరుడిగా ఉన్నాడు. ఆ సమయంలోనే వంగవీటి శంతన్కుమార్పై జరి గిన కాల్పుల కేసులో అతడిని పోలీసులు నిందితుడిగా గుర్తించారు. అనంతరం సుబ్బు ఎమ్మెల్యే …
Read More »ఒంగోలులో అర్ధరాత్రి దారుణం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలులో నిన్నఅర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. మంగమూరు రోడ్డులోని రామచంద్ర మిషన్ సమీపంలో రాత్రి 10:45 గంటల సమయంలో భార్యని భర్త చంపి పరారైన సంఘటన ఒక్కసారిగా కలకలం సృష్టించింది. మంగమూరు రోడ్డులో అపార్ట్మెంట్ కూడలికి చివర ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్న కొర్రపాటి అంజలి (33)ని భర్త ఏడుకొండలు అత్యంత కిరాతకంగా హతమార్చాడు. వారి వివరాలు.. తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలెం గ్రామానికి చెందిన ఏడుకొండలు తన కుటుంబంతో …
Read More »మైనార్టీలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు
మైనార్టీలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు వరాల జల్లు కురిపించారు. కాగా, నిన్న మైనార్టీ సంక్షేమ పథకాల అమలుపై రివ్యూ నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కచ్చితంగా మైనార్టీలు లబ్ధిపొందే విధంగా కార్యాచరణ ఉండాలన్నారు. పేద మైనార్టీ యువకులు స్వయం ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా వందశాతం సబ్సిడీపై ఆర్థిక సహాయం అందించాలన్నారు. లక్షా, రెండు లక్షలు, రెండున్నర లక్షల విలువైన యూనిట్ల కోసం …
Read More »మరోసారి వార్తల్లోకి రేవంత్ -తారా చౌదరి ..
తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేతలు ,మంత్రులపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే .రేవంత్ రెడ్డి సొంత పార్టీకి చెందిన నేతలపై మీడియా సాక్షిగా ఆరోపణలు విమర్శలు చేసిన కానీ ఆ పార్టీకి చెందిన నేతలు నోరు మెదపలేదు . రేవంత్ రెడ్డి …
Read More »భర్త మర్మాంగాన్ని కోసిన భార్య..!
భార్యాభర్తల మధ్య జరిగిన గొడువ కారణంగా భార్య తన భర్త మర్మాంగాన్ని కోసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. సిరిసేడుకు చెందిన రౌతు రవీందర్, స్వరూపకు 25 ఏండ్ల కిందట వివాహం జరిగింది. ఇద్దరూ కలిసి పని చేసిన కూలీ డబ్బులను యజమాని నుంచి తీసుకున్న రవీందర్ ఆ మొత్తంతో సోమవారం పీకలదాకా మద్యం తాగాడు. ఇంటికి వచ్చిన …
Read More »రాజుకుంటున్న కుంపటి!
మూడో ప్రపంచ యుద్దం ముంచుకొస్తుందనే అనుమానాలు రోజు.. రోజుకు పెరుగుతున్నాయి. ఇందుకు నిదర్శనం.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎవరు తగ్గకపోవడమే. ఒకర్ని మరొకరు కవ్విస్తూ చేపడుతున్న చర్యలు ప్రపంచానికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పుడు అమెరికా యుద్ధ సన్నాహాల్లో తలమునకలైంది. ఇప్పటికే దక్షిణ కొరియా తీరాలకు అమెరికా అణ్వాయుధాలు చేరుకున్నాయి. దీంతో భాగంగా అమెరికాకు చెందిన అణుజలాంతర్గామి యూఎస్ఎస్ మిర్చిగన్ వారం కిందటే దక్షిణ కొరియాలోని …
Read More »విప్లవాత్మకంగా నూతన పంచాయతీరాజ్ చట్టం..!
పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో గ్రామస్వరాజ్యాన్ని సాకారం చేసే దిశగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని తండాలు, గూడేలు, చెంచు పల్లెలను పంచాయతీలుగా మార్చాలని నిర్ణయించింది. కొత్తగా మరిన్ని పంచాయతీలను ఏర్పాటు చేయాలని తీర్మానించింది. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటుచేసే క్రమంలో ప్రధాన గ్రామానికున్న దూరాన్ని, శివారు పల్లెల జనాభాను, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోనున్నారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటుచేసినప్పుడు వ్యవహరించినట్లుగానే …
Read More »