తెలంగాణ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర శాఖ బస్సు యాత్రకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు.. మాజీ సీనియర్ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇరవై నాలుగు అసెంబ్లీ.. నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ యాత్ర ఈ నెల ఇరవై మూడో తారీఖున మొదలు కానున్నది. …
Read More »Blog Layout
సంతోష్ శోభన్, రాశి సింగ్ “ప్రేమ్ కుమార్”.. మూవీ ఎలా ఉందంటే ?
సంతోష్ శోభన్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా గోల్కొండ హైస్కూల్ చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చి తను నేను చిత్రంతో హీరోగా మారాడు. ఆ తర్వాత వినూత్న కథలతో ప్రేక్షకులలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి సినిమాలతో కమర్షియల్ హిట్స్ అందుకున్నారు. ఇక ఇప్పుడు తాజాగా సంతోష్ శోభన్.. డెబ్యూ డైరెక్టర్ అభిషేక్ మహర్షి దర్శకత్వంలో నటిస్తున్న …
Read More »కొత్తగా నిర్మిస్తున్న పోర్టులు, హార్బర్ల నిర్మాణ పనులపై సీఎం సమీక్ష..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న పోర్టులు, హార్బర్ల నిర్మాణ పనులపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్ జవహర్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎంఎస్ఎంఈలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఇతర దేశాల్లో ఎంఎస్ఎంఈల నిర్వహణ, నాణ్యమైన ఉత్పాదనల విధానాలను ఇక్కడ కూడా అమల్లోకి తీసుకురావాలన్నారు. …
Read More »తెలంగాణలో కోటి ఎకరాలు దాటిన సాగు
తెలంగాణ రాష్ట్రంలో వానకాలం సాగు సునాయాసంగా కోటి ఎకరాలు దాటింది. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 1.02 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గతంతో పోల్చితే ఈ సారి సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతున్నది. గత వానకాలంలో ఇదే సమయానికి 95 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, ఈసారి 7 లక్షల ఎకరాలు అధికంగా సాగయ్యాయి. అత్యధికంగా పత్తి 44.57 లక్షల ఎకరాల్లో వేయగా, ఆ …
Read More »సిహెచ్ ఎంవీ కృష్ణారావు మృతికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం
ప్రముఖ పాత్రికేయుడు, సంపాదకులు సిహెచ్ ఎంవీ కృష్ణారావు మరణం పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనను కలిచి వేసిందని పేర్కొన్నారు. సుధీర్ఘ కాలంగా కృష్ణారావుతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. జర్నలిజంలో కృష్ణారావు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన …
Read More »సీనియర్ జర్నలిస్ట్ ఎంవీ కృష్ణారావు మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సిహెచ్ ఎం వీ కృష్ణారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను సిఎం స్మరించుకున్నారు. పలు రంగాల్లో లోతైన అవగాహనతో ప్రజా ప్రయోజనాల కోణంలో వారు చేసిన రచనలు, విశ్లేషణలు, కొనసాగించిన టీవీ చర్చలు ఆలోచన రేకెత్తించేవిగా వుండేవని సిఎం తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైబడి జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన …
Read More »మొబైల్ ప్లాష్ లైట్ ను సైతం వదలని చంద్రబాబు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు. ఈ మధ్య ఎక్కడకెళ్లిన ఏ సభకు వెళ్లిన అన్ని తానే కనిపెట్టినట్లు.. అన్నింటికి తానే కారణం అన్నట్లు మాట్లాడుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. నిన్న కాక మొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంజనీరింగ్ చదవాలంటే ఇంటర్ లో బైపీసీ తీసుకోవాలని చెబుతూ తన మేధావితనాన్ని బయట పెట్టుకున్నాడు …
Read More »రాహుల్ గాంధీకి కీలక పదవి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో చోటుదక్కింది. ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ఇంటిపేరు వ్యవహారంలో రాహుల్ గాంధీ అనర్హతకు గురైన సంగతి తెల్సిందే. దీంతో ఆయన దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు తీర్పుతో మళ్లీ లోక్సభలోకి ప్రవేశించారు. సభ్యత్వం పునరుద్ధరించిన వారం వ్యవధిలోనే రాహుల్ గాంధీ డిఫెన్స్పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నామినేట్ కావడం విశేషం. ఈ మేరకు …
Read More »