Classic Layout

దేశంలో తగ్గిన కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా గడిచిన గత 24 గంటల్లో   కొత్తగా 14,830 కరోనా పాజిటీవ్ కేసులు వెలుగుచూశాయి. మరో 36 మంది కరోనా భారీన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 18,159 మంది కరోనా పాజిటీవ్  వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,47,512 కరోనా పాజిటీవ్  యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 202.50 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.

Read More »

ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్‌కు క‌రోనా

బీహార్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్‌కు క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. ఆయ‌న గ‌త నాలుగు రోజుల నుంచి జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నారు. గ‌త కొన్ని రోజుల నుంచి ఆయ‌న అధికార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంలేదు. మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవిండ్ వీడ్కోలు, రాష్ట్ర‌ప‌తిగా ముర్ము ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మాల‌కు కూడా ముఖ్యమంత్రి నితీశ్ హాజ‌రుకాలేక‌పోయారు.

Read More »

ప్రభాస్ పై దిశా పటానీ సంచలన వ్యాఖ్యలు

సినిమా ఇండస్ట్రీలో  తాను ఇప్పటివరకు పనిచేసిన మంచినటుల్లో ప్రభాస్ ఒకరని బాలీవుడ్ హీరోయిన్ దిశాపటానీ చెప్పింది.ఇటీవల ప్రాజెక్ట్ చిత్రం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. ‘ప్రభాస్ గ్రేట్ పర్సన్. నిరాడంబరంగా ఉంటారు. ఆయనతో నా మొదటి రోజు షూటింగ్ ఇంకా గుర్తుంది. తన ఇంట్లో తయారుచేసిన ఫుడ్ను టీమ్ మొత్తానికి అందించారు’ అని తెలిపింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో భారీ బడ్జెట్తో ఈ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.

Read More »

మహేష్ అభిమానులకు శుభవార్త

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మాటల మాంత్రికుడు.. విజయాలకు కేరాఫ్ అడ్రస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ..సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో సరికొత్త చిత్రం రానున్న సంగతి విధితమే. ఇందులో భాగంగా త్రివిక్రమ్ దర్శకత్వం  చేయనున్న ఈ మూవీలో ప్రిన్స్ మహేశ్ బాబు రెండు పాత్రల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది. తన సినిమా కెరీర్ లోనే సూపర్ స్టార్ మహేష్ కు ఇదే తొలి డ్యుయల్ రోల్ మూవీ కానుంది. …

Read More »

గూగుల్ కో-ఫౌండర్ భార్యతో ఎఫైర్? -మస్క్ సంచలన వ్యాఖ్యలు

గూగుల్ కో-ఫౌండర్ సర్జే బ్రిన్ భార్య నికోల్ షనహాన్ తో ఎఫైర్ పై ప్రముఖ వరల్డ్ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. తాను, బ్రిన్ మంచి స్నేహితులమని, అతడి భార్యను గత మూడేళ్లలో రెండుసార్లే చూశానని చెప్పారు. అప్పుడు కూడా తాము జనాల మధ్యలోనే ఉన్నామని, అలాంటప్పుడు రొమాన్స్ ఎలా చేయగలమంటూ సెటైర్ వేశారు. కాగా నికోల్, మస్క్ ఎఫైర్ కారణంగా బ్రిన్ తన భార్యకు విడాకులు …

Read More »

టీమిండియా ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు

టీమిండియా అరుదైన ప్రపంచ రికార్డు వెస్టిండీస్ తో నిన్న ఆదివారం  జరిగిన రెండో వన్డేలో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన టీమిండియా ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు చేరింది. ఒకే జట్టుపై వరుసగా అత్యధిక ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఇప్పటి వరకు విండీస్పై వరుసగా 12 వన్డే సిరీస్లో భారత్ గెలిచింది. జింబాబ్వేపై వరుసగా 11 సిరీస్లో గెలిచిన పాక్ రెండో స్థానంలో ఉంది.

Read More »

విండీస్ ఓపెనర్ షై హోప్ ఘనత

ప్రపంచ క్రికెట్ లో వందో వన్డేలో వంద బాదిన క్రికెటర్లు కెరీర్లో 100వ వన్డేలో సెంచరీ సాధించిన పదో క్రికెటర్ విండీస్ ఓపెనర్ షై హోప్ ఘనత సాధించాడు. గతంలో గార్డన్ గ్రీనిడ్జ్(విండీస్), క్రిస్ కెయిన్స్ (కివీస్), మొహమ్మద్ యూసఫ్(పాక్), సంగక్కర (శ్రీలంక), క్రిస్ గేల్ (విండీస్), ట్రెస్కోథిక్(ఇంగ్లాండ్), రాంనరేశ్ శర్వాణ్(విండీస్), డేవిడ్ వార్నర్(ఆసీస్), ధావన్ (ఇండియా) ఈ ఘనత సాధించారు.

Read More »

రాష్ట్రపతుల ప్రమాణం జులై 25నే ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?.

మన దేశంలో రాష్ట్రపతుల ప్రమాణం జులై 25నే ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?. తెల్వదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్ట మొదటి సారిగా మన దేశపు తొలి రాష్ట్రపతి డా.రాజేంద్రప్రసాద్ 1950 జనవరి 26న ప్రమాణం చేశారు. తర్వాత వచ్చిన ఆరుగురు రాష్ట్రపతులు పూర్తికాలం పదవిలో కొనసాగలేదు. 1977 జులై25న నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. అప్పటి నుంచి అందరూ(జ్ఞాని జైల్సింగ్ మినహా) …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat