TimeLine Layout
July, 2022
-
27 July
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం క్లారిటీ!
ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. నియోజకవర్గాల పెంపుకు రాజ్యాంగ సవరణ అవసరమని పేర్కొంది. ఈ మేరకు కేంద్రమంత్రి నిత్యానందరాయ్ లోక్సభలో లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. రాజ్యాంగ సవరణ ద్వారా చేయాల్సి ఉన్నందున సీట్ల సంఖ్య పెంచాలంటే 2026 వరకు ఆగాల్సిందేనని.. అప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో సీట్ల పెంపు సాధ్యం కాదని తెలిపింది. ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగి ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ …
Read More » -
27 July
38 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారు!
పశ్చిమ్ బెంగాల్కు చెందిన బీజేపీ సీనియర్ నేత మిథున్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఉపాధ్యాయ నియాకాల్లో జరిగిన అవకతకల వ్యవహారంలో టీఎంసీ మంత్రి పార్థ చటర్జీ అరెస్టైన తర్వాత ఆ పార్టీ తుఫాన్ చెలరేగిందన్నారు. టీఎంసీకి చెందిన 38 మంది ఎమ్మెల్యేల్లో 21 మంది డైరెక్ట్గా తనతోనే టచ్లో ఉన్నారని చెప్పారు. …
Read More » -
27 July
మూసీ వరద.. మంత్రి కేటీఆర్ సమీక్ష
హైదరాబాద్ సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాలికి గాయమైన కారణంగా ప్రగతి భవన్ నుంచే ఆయన సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ, జలమండలి, పురపాలక శాఖ అధికారులతో ఆయన రివ్యూ చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. మూసీ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాలని.. …
Read More » -
27 July
పరిహారం ఇచ్చాకే పోలవరంలో నీళ్లు నింపుతాం: సీఎం జగన్ హామీ
పోలవరం నిధుల విడుదల కోసం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు పంపిస్తూనే ఉన్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం కేంద్రంతో కుస్తీ పడుతున్నామని చెప్పారు. సెప్టెంబర్లోపు నిర్వాసితులకు పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల టూర్లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో ఆయన పర్యటించారు. అక్కడ బాధితులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే పోలవరం ప్రాజెక్టులో …
Read More » -
27 July
పెళ్లి రోజే భర్తను వదిలేసి ప్రియుడితో జంప్!
విశాఖపట్నంలో అదృశ్యమైందని భావించిన వివాహిత సాయి ప్రియ మిస్సింగ్ కేసులో సూపర్ ట్విస్ట్. రెండో పెళ్లిరోజు సందర్భంగా భర్త శ్రీనివాసరావుతో ఆర్కే బీచ్కు వెళ్లిన సాయి ప్రియ.. తన భర్త ఫోన్లో బిజీగా ఉండగా ప్రియుడితో చెక్కేసింది. నెల్లూరుకు చెందిన రవి అనే యువకుడితో అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. రెండు రోజుల క్రితం సాయి ప్రియ ఆచూకీ తెలియకపోవడంతో భర్త వైజాగ్ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి …
Read More » -
27 July
హైదరాబాద్ జంట జలాశయాలకు వరద ఉధృతి
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ జంట జలాశయాలకు వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో ఉస్మాన్సాగర్ (Osman Sagar) జలాశయంలోకి 8 వేల క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతున్నది. దీంతో అధికారులు 13 గేట్లు 6 అడుగుల మేర ఎత్తి 8,281 క్యూసెక్కులు మూసీలోకి విడుదల చేశారు. ఉస్మాన్సాగర్లో ప్రస్తుతం 1,789.10 అడుగుల నీటిమట్టం ఉన్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు.ఇక హిమాయత్సాగర్కు 10 వేల …
Read More » -
27 July
రైతులతో పాటు విద్యార్థులకు ‘సహకారం’ – మంత్రి నిరంజన్ రెడ్డి
దేశ, విదేశీ ఉన్నత చదువుల కోసం రైతులతో పాటు డీసీసీబీ విద్యార్థులకు కూడా రుణాలు అందజేస్తుందని వ్యవసాయ,సహకార శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్లోని తన నివాసంలో డీసీసీబీ ద్వారా విదేశీ విద్య కోసం రుణం అందుకున్న తొలి విద్యార్థి కరకాల హేమంత్ రెడ్డిని సన్మానించి రూ.23 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉన్నత విద్య పేదలకు అందని ద్రాక్ష కాకూడన్నదే సీఎం కేసీఆర్ …
Read More » -
27 July
TRS ఎంపీలపై సస్సెన్షన్ వేటు సిగ్గుచేటు-మంత్రి కేటీఆర్
పార్లమెంట్ సమావేశాల్లో జీఎస్టీ,ధరల పెరుగుదలపై నిరసనలు వ్యక్తం చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీల పై రాజ్యసభ నుంచి సస్సెన్షన్ వేటు సిగ్గుచేటని మంత్రి కేటీఆర్ అన్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుపై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.‘ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిత్యావసరాల మీద జీఎస్టీ పెంపుపై చర్చకు అంగీకరించకుండా కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు …
Read More »