ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. నియోజకవర్గాల పెంపుకు రాజ్యాంగ సవరణ అవసరమని పేర్కొంది. ఈ మేరకు కేంద్రమంత్రి నిత్యానందరాయ్ లోక్సభలో లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.
రాజ్యాంగ సవరణ ద్వారా చేయాల్సి ఉన్నందున సీట్ల సంఖ్య పెంచాలంటే 2026 వరకు ఆగాల్సిందేనని.. అప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో సీట్ల పెంపు సాధ్యం కాదని తెలిపింది. ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగి ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు.