Home / HYDERBAAD / హైదరాబాద్‌ జంట జలాశయాలకు వరద ఉధృతి

హైదరాబాద్‌ జంట జలాశయాలకు వరద ఉధృతి

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం  హైదరాబాద్‌ జంట జలాశయాలకు వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో ఉస్మాన్‌సాగర్‌ (Osman Sagar) జలాశయంలోకి 8 వేల క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతున్నది. దీంతో అధికారులు 13 గేట్లు 6 అడుగుల మేర ఎత్తి 8,281 క్యూసెక్కులు మూసీలోకి విడుదల చేశారు. ఉస్మాన్‌సాగర్‌లో ప్రస్తుతం 1,789.10 అడుగుల నీటిమట్టం ఉన్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు.ఇక హిమాయత్‌సాగర్‌కు 10 వేల క్యూసెక్కులు వస్తుండగా, 8 గేట్లు ఎత్తి 10,700 క్యూసెక్కుల నీటిని మూసీకి విడుదల చేస్తున్నారు. హిమాయత్‌సాగర్‌ ప్రస్తుత నీటిమట్టం 1762.70 అడుగులు. గరిష్ఠనీటిమట్టం 1763.50 అడుగులు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat