పోలవరం నిధుల విడుదల కోసం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు పంపిస్తూనే ఉన్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం కేంద్రంతో కుస్తీ పడుతున్నామని చెప్పారు. సెప్టెంబర్లోపు నిర్వాసితులకు పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు.
వరద ప్రభావిత ప్రాంతాల టూర్లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో ఆయన పర్యటించారు. అక్కడ బాధితులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే పోలవరం ప్రాజెక్టులో నీళ్లు నింపుతామని.. ఏ ఒక్కరికీ అన్యాయం చేయబోమని సీఎం చెప్పారు. పోలవరం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం కేంద్రంతో యుద్ధాలు, పోరాటాలు చేస్తున్నామన్నారు.