ప్రముఖ నటుడు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటి వద్దకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో అక్కడ టపాసులు కాలుస్తూ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్, ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు. ప్రముఖులు ఉండే ప్రాంతం కావడంతో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు ఆ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు …
Read More »TimeLine Layout
May, 2022
-
21 May
బన్నీకి ఎంత కట్నం ఇచ్చారు?: అల్లు అర్జున్ మామ ఏం చెప్పారో తెలుసా!
అల్లుడిగా అల్లు అర్జున్( బన్నీ)కి వందకు వంద మార్కుల ఇస్తానని అతడి మామ (బన్నీ సతీమణి స్నేహరెడ్డి తండ్రి) చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ బన్నీకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారని.. బన్నీ పాన్ ఇండియా స్టార్గా ఎదగడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. స్నేహరెడ్డితో 2011లో బన్నీకి వివాహం జరిగింది. …
Read More » -
21 May
నన్ను ఓడించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు.. కానీ..: వల్లభనేని వంశీ
తనతో ఎవరు కలిసొచ్చినా రాకపోయినా తన పని తాను చేసుకుంటూ వెళ్తానని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ చెప్పారు. వైసీపీలో తనకెలాంటి సమ్యలూ లేవని.. ఎవరికైనా ఇష్యూ ఉంటే వారే చూసుకోవాలని హితవు పలికారు. వైసీపీ నేత దుట్టా రామచంద్రరావుతో విభేదాల నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపుకోసం ప్రజల ఆశీర్వాదం ఉంటే చాలని చెప్పారు. ఎవరి మనోభావాల ప్రకారం వారు నడుచుకుంటారని.. గత రెండు ఎన్నికల్లో …
Read More » -
20 May
తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ: పవన్
రానున్న ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్కల్యాణ్చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మృతిచెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించి ఆర్థికసాయం అందించారు. వలిగొండ మండలం గోకారం, కోదాడలో కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా కోదాడలో మీడియాతో పవన్ మాట్లాడారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో జనసేనకు 5వేలకు పైగా ఓట్లు ఉన్నాయన్నారు. ఆ ఓట్లతో గెలవలేనప్పటికీ రాజకీయాలపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని …
Read More » -
20 May
బీబీ నగర్ ఎయిమ్స్పై కిషన్రెడ్డి దృష్టిపెట్టాలి: హరీశ్రావు
బీబీ నగర్ ఎయిమ్స్ను కేంద్రమంత్రి కిషన్రెడ్డి పలుమార్లు సందర్శించినా ఇక్కడి సదుపాయాలపై కేంద్రాన్ని ఏనాడూ అడగలేదని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి ఎయిమ్స్ నిర్మాణానికి భూములు, భవనాలు ఇచ్చి అన్నిరకాలుగా సహకారం అందించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రజలకు ఉపయోగం కలగడం లేదన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్కు హరీశ్రావు పరిశీలించి అందుతున్న వైద్యసేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం …
Read More » -
20 May
రూ.40 కోట్లతో బంగ్లా కొన్న గంగూలీ
బీసీసీఐ అధ్యక్షుడు,టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు సౌరవ్ గంగూలీ కోల్ కత్తాలో భారీ బంగ్లాను కొనుగోలు చేశాడు. దీని విలువ దాదాపు రూ.40 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. 10,280 చదరపు అడుగులు కలిగిన ఈ బంగ్లాను భార్య డోనా, కూతురు సనా, తల్లి నిరూపమ్ పేరిట సమానంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. 48 ఏళ్ల తర్వాత పూర్వీకుల ఇంటి నుంచి గంగూలీ త్వరలోనే కొత్తగా కొన్న భవనంలోకి మారనున్నాడు.
Read More » -
20 May
సీఎం జగన్ కు మాజీ సీఎం చంద్రబాబు వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంస పాలన జరుగుతోందని మాజీ సీఎం,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. తాము కన్నెర్రజేస్తే సీఎం వైఎస్ జగన్ తట్టుకోలేరని హెచ్చరించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ.. ‘ఆత్మ గౌరవం కోసం టీడీపీ పుట్టింది. తెలుగు జాతి ఉన్నంతవరకు పార్టీ ఉంటుంది. నేను ఏ తప్పూ చేయను. నిప్పులాంటి మనిషిని. ఎవరెన్ని కుట్రలు …
Read More » -
20 May
మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో TRSలో చేరిన గిరిజనులు
మారుమూల తాండలలో గులాబి జెండా రెప రెప లాడుతోంది.ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు గూడెం గుడిసెలలో ఉండే వారిని టి ఆర్ యస్ అక్కున చేర్చేలా చేస్తున్నాయి.దేశానికే తలమానికంగా నిలిచేలా ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన అభివృద్ధి నమూనా పై జరుగుతున్న చర్చ ఇప్పుడు తాండాలలకి పాకింది. ఈ క్రమంలోనే అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలా నిమిత్తం తాండాలలకి చేరుతున్న నాయకుల సమక్షంలో టి ఆర్ యస్ లో చేరేందుకు …
Read More » -
20 May
ఖాళీ కడుపుతో యోగా చేయడం మంచిదేనా..?
ఖాళీ కడుపుతో యోగా చేయడం మంచిదేనా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే యోగా చేసే ముందు మితంగా ఆహారం తీసుకోవడం మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు. కానీ ఖాళీ కడుపుతో యోగా చేస్తే శ్వాస సంబంధ సమస్యలు పరిష్కారం అవుతాయని అంటున్నారు యోగా నిపుణులు. ఈ రెండు పరస్పర విరుద్ధమైన సలహాలలో మన శరీరతత్వాన్ని బట్టి ఆహారం తీసుకోవాలా? వద్దా? అనేది నిర్ణయించుకోవాలి.
Read More » -
20 May
యూజర్లకు ఎయిర్టెల్ షాక్
తమ యూజర్లకు ఎయిర్టెల్ షాక్ ఇవ్వనుంది. ఇప్పటికే గతేడాది టారిఫ్ రేట్లను పెంచిన సంస్థ.. మరోసారి పెంచేందుకు సిద్ధమవుతోంది. దీంతో సగటు యూజర్ పై వచ్చే ఆదాయం రూ.200 మార్కును దాటాలని ఎయిర్టెల్ భావిస్తోంది. గతేడాది మార్చిలో రూ. 145తో పోలిస్తే ఈసారి మార్చి నాటికి రూ. 178కి పెంచుకుంది. దీన్ని ఇప్పుడు రూ.200కు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఫలితంగా టారిఫ్ పెంచనున్నట్లు ప్రకటించింది.
Read More »