కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఆ పార్టీ పార్లమెంటరీ చైర్ పర్శన్ శ్రీమతి సోనియా గాంధీ దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని గంగారం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆమెకు స్వల్ప జ్వరం లక్షణాలుండటంతో ముందు జాగ్రత్తలో భాగంగా గంగారం ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎలాంటి సమస్యల్లేవని తెలుస్తుంది. చత్తీస్ గడ్ ప్రభుత్వ సమావేశంలో పాల్గోనేందుకు రాయ్ …
Read More »సోనియాగాంధీని బలిదేవత అన్న వ్యక్తికే పీసీసీ చీఫ్ పదవి
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఎంప్లాయిమెంట్ పాలసీని ప్రకటించి, దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య పైన అధికారంలో ఉన్నప్పుడు స్పందిస్తే దేశంలో ఇవాళ నిరుద్యోగ సమస్య ఉండేదే కాదన్నారు బీఆర్ఎస్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కే.తారక రామారావు. తాము అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగ సమస్య పట్టించుకోకుండా యువతను కేవలం రాజకీయాలకు మాత్రమే వాడుకోవడం కాంగ్రెస్ పార్టీ కి అలవాటైందన్నారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో 2.2 లక్షల …
Read More »డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్ కు అసలు కారణం ఇదే- సీబీఐ
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను నిన్న ఆదివారం అరెస్ట్ చేయడంపై సీబీఐ స్పందించింది. ఉప ముఖ్యమంత్రి అయిన మనీష్ సిసోడియా విచారణకు సహకరించలేదు.. తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేశారని తెలిపింది. తాము సేకరించిన ఆధారాలపై ప్రశ్నించాము.. అయితే వాటికి సరైన సమాధానం చెప్పని నేపథ్యంలో సిసోడియాను అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. కాగా, నేడు ప్రత్యేక కోర్టులో …
Read More »ఇందిరా గాంధీకి పట్టిన గతే అమిత్ షా కు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఖలిస్తాన్ వేర్పాటు వాది అమృత్పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిక్కుల ఊచకోత తర్వాత జరిగిన పరిణామాల్లో స్వర్గీయ ప్రధాని ఇందిరా గాంధీకి పట్టిన గతే అమిత్ షాకు కూడా పడుతుందని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ‘ఖలిస్తాన్ జిందాబాద్ అంటే తప్పు అయినప్పుడు హిందూస్థాన్ జిందాబాద్ అంటే ఎందుకు తప్పుకాదు. హిందూస్థాన్ అంటే ఏంటి.. అది ఎక్కడ ఉంది’ అని ప్రశ్నించారు.
Read More »వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఔరంగబాద్ నుంచి ఎంఐఎం పోటి
దేశంలో త్వరలో జరగనున్న వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఔరంగబాద్ నుంచి తమ పార్టీ పోటీ చేయనున్నట్లు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఔరంగాబాద్తో పాటు ఇతర స్థానాల గురించి కూడా పోటీ చేసేందుకు ఆలోచిస్తున్నాము.. ఎవరితో పొత్తు కుదుర్చుకోవాలన్న దానిపై కూడా కొన్ని పార్టీలతో సంప్రదింపుల్లో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఎవరితో పొత్తు పెట్టుకుంటామనే దానిపై ఇంత త్వరగా వెల్లడించలేమని ఎంఐఎం చీఫ్ తెలిపారు.
Read More »పశువులకు కూడా ఆధార్ నంబర్
దేశంలో త్వరలో పశువులకు కూడా ఆధార్ నంబర్ ఇవ్వనున్నట్టు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. పశువులకు వచ్చే పలు రకాల వ్యాధుల పుట్టుక గురించి వీలైనంత త్వరగా తెలుసుకోవాలని అప్పుడే దాని నివారణకు వ్యాక్సిన్ను, ఇతర మార్గాలను అన్వేషించడం సులభమవుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. బయో ఏషియా సదస్సులో భాగంగా మొదటి రోజు ప్యానల్ డిస్కషన్లో ‘వన్ హెల్త్ అప్రోచ్, స్వదేశీ పరిజ్ఞానం, విధానం’ అంశంపై …
Read More »రాహుల్ కు పెళ్ళి వద్దంటా కానీ పిల్లలు కావాలంటా..?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 52 ఏండ్లైనా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆయన పెండ్లి ఎప్పుడు చేసుకుంటారా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ విషయంలో రాహుల్ కు అనేక సార్లు ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. అయితే, తాజాగా తన వివాహంపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు వివాహం ఎందుకు చేసుకోలేదో తెలియదు కానీ, పిల్లలు కావాలని మాత్రం ఉందంటూ చెప్పుకొచ్చారు.
Read More »రాహుల్ గాంధీపై కేసు నమోదు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కాపీరైట్ యాక్ట్ కింద బెంగళూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రూపొందించిన వీడియోలో తమ సంస్థకు హక్కులున్న కేజీఎఫ్-2 హిందీ వర్షెన్ పాటను వాడుకున్నారని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన ఓ సంస్థ రాహుల్ గాంధీ సహా ఇద్దరు కాంగ్రెస్ నేతలపై కేసు పెట్టింది.యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ పాదయాత్ర దృశ్యాలకు బ్యాక్ గ్రౌండ్గా కేజీఎఫ్-2 హిందీ సినిమా పాటలు, …
Read More »కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్కు ఈడీ నోటీసులు
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్కు ఈడీ నోటీసులు జారీచేసింది. నవంబర్ 7న ఈడీ ఆఫీస్లో విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. శివకుమార్తోపాటు ఆయన సోదరుడు కనకపుర ఎంపీ డీకే సురేశ్కు కూడా తాఖీదులు ఇచ్చింది. ఇదే కేసులో సోదరులిద్దని గత నెల 7న ఈడీ విచారించింది. తాజాగా మరోసారి నోటీసులు జారీచేసింది.తనకు, తన సోదరునికి ఈడీ నోటీలు అందాయని శివకుమార్ చెప్పారు. …
Read More »బీజేపీని గద్దె దించాలి-ప్రియాంకాగాంధీ
హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్నది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా రోడ్షోలు, బహిరంగసభలతో ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇవాళ శుక్రవారం కాంగ్రాలో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రియాంకాగాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చాక మోదీ సర్కారు తెచ్చిన అగ్నిపథ్ స్కీమ్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏ హామీ …
Read More »