తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరగడానికి డబుల్ మ్యుటెంట్ వైరసే కారణమని CCMB సైంటిస్టులు చెబుతున్నారు. మార్చి మధ్యలో సెకండ్ వేవ్ మొదలు కాగా.. క్రమంగా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. కొత్తగా వస్తున్న కేసుల్లో సగానికి పైగా బి. 1.617 వైరస్ (డబుల్ మ్యుటెంట్) రకమే ఉందన్నారు. ఇప్పటివరకు వ్యాప్తిలో ఉన్న ఎన్440కే రకం వైరస్ క్రమంగా తగ్గుతుందన్నారు.
Read More »సరికొత్త సంప్రదాయానికి తెర తీసిన సీఎం జగన్
ప్రస్తుతం రాజకీయ రంగంలో ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తిరుపతి ఉప ఎన్నికల్లోనూ కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తరహాలో ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని జగన్ ముందు నుంచే నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఎన్నికల్లో నగదు, మద్యం పంపిణీ వంటి విధానానికి పూర్తిగా స్వస్తి పలకాలని గతంలోనే మంత్రి వర్గంలో …
Read More »తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల ఆప్డేట్ – వైసీపీకి తిరుగులేదు
ఏపీలో ఇటీవల జరిగిన తిరుపతి ఉపఎన్నికలో అధికార పార్టీ అయిన వైసీపీ తిరుగులేని ఆధిక్యత కొనసాగిస్తున్నది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముందంజలోనే కొనసాగుతున్నది. ప్రతి రౌండ్లో మెజారిటీ సాధిస్తూ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నది. ఇప్పటివరకు వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 1,24,119 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీకి 2,50,424 ఓట్లు పోలవగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 1,33,613 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 23,223 ఓట్లు పోలయ్యాయి.వైసీపీ అభ్యర్థి గురుమూర్తి …
Read More »ఇందండీ చంద్రబాబు తీరు.. వాళ్లు చేయరు.. జగన్ ను చేయనీయరు..!
ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ‘పోలవరం’ ప్రాజెక్టు పనులను జెట్ స్పీడుతో ముందుకెళుతున్నాయి. లాక్డౌన్.. కరోనా టైంలోనూ పోలవరం పనులకు బ్రేక్ పడకుండా ముందుకు సాగుతున్నాయి. దీనిని చూసి జీర్ణించుకోలేని చంద్రబాబు అండ్ కో(పచ్చమీడియా) పోలవరానికి అవినీతి మరలు అంటించేందుకు కంకణం కట్టుకున్నారు. దీనిలో భాగంగా పోలవరం నిర్మాణంపై పదేపదే తప్పుడు కథనాలను ప్రసారం చేస్తూ ఒక అబద్దాన్ని నిజం చేసే పనిలో పడ్డారు. పోలవరం జలాశయంలో ప్రస్తుతం …
Read More »వైసీపీ మాజీ మంత్రి మహమ్మద్ జానీ మృతి
ఏపీ అధికార వైసీపీకి చెందిన మాజీ మంత్రి మహమ్మద్ జానీ ఇవాళ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. స్వగృహంలోనే చనిపోయారు. ఆయన స్వస్థలం గుంటూరు. ఇక్కడి నుంచే పలుమార్లు పోటీచేసి నెగ్గిన ఆయన.. ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ ఛైర్మన్ గా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి, జనార్థన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రి వర్గాల్లో.. వాణిజ్య, చక్కెర శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు.
Read More »తెలంగాణ ఏర్పాటుపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ఏర్పాటు గురించి ఏపీ మంత్రి,ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి అప్పట్లో టీడీపీ అధినేత,నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవీ ఇచ్చి ఉంటే తెలంగాణ ఏర్పడదు.. రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ చంద్రబాబు తన మంత్రివర్గంలోకి …
Read More »వైసీపీ ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
ఏపీలోని కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి పట్ల సీఎం జగన్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు ఆయన మృతి తీరనిలోటని అభిప్రాయపడ్డారు . ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యే మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు ఉపముఖ్య మంత్రి అంజాద్ బాషా ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. వారి …
Read More »వైసీపీ ఎమ్మెల్యే కన్నుమూత
ఏపీ అధికార పార్టీ వైసీపీలో విషాదం నెలకొన్నది. ఆ పార్టీకి చెందిన కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ గున్ తోటి వెంకటసుబ్బయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటసుబ్బయ్య కొద్దిరోజులపాటు హైదరాబాద్లో చికిత్స పొంది మునిసిపల్ ఎన్నికల ముందు డిశ్చార్జ్ అయ్యి స్వగ్రామానికి చేరుకున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన చురుగ్గా పాల్లొన్నారు. అయితే మళ్లీ అనారోగ్యానికి …
Read More »ఏపీలోని విద్యార్థులకు సీఎం జగన్ శుభవార్త
ఏపీలోని విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ సర్కారు శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన పథకాలకు కొత్తగా దరఖాస్తు చేసుకునే రిజిస్ట్రేషన్ల గడువును ఈ నెల 28వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ 2 పథకాలకు ముందుగా నిర్ణయించిన గడువు ఈ నెల 25తో ముగియగా.. పలువురు విద్యార్థులు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోనందున గడువును పెంచింది. వసతి దీవెన …
Read More »పురపాలక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం
ఏపీలో ఈ రోజు వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని అధికార పార్టీ అయిన వైసీపీ అదరగొడుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 15 మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. మాచర్ల, పిడుగురాళ్ల, పులివెందుల, పుంగనూరు గిద్దలూరు, డోన్, ఆత్మకూరు, పలమనేరు, మదనపల్లి రాయచోటి, ఎర్రగుంట్ల, నాయుడుపేట, సూళ్లూరుపేట కనిగిరి, కొవ్వూరు మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని 20 వార్డుల్లో …
Read More »