ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంశంపై పలు విషయాలను సీఎం ప్రస్తావించారు. తెలంగాణలో యాసంగి సీజన్లో పండిన మొత్తం ధాన్యాన్ని సేకరించాలని.. అలా చేయకపోతే కనీస మద్దతు ధరకు అర్థం ఉండదని సీఎం పేర్కొన్నారు. దీంతో జాతీయ ఆహార భద్రత లక్ష్యానికి విఘాతం కలుగుతుందని చెప్పారు. ధాన్యం పూర్తిగా సేకరించకపోతే రాష్ట్ర రైతులు, వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం ఉంటుందని …
Read More »ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మేం పాలిటిక్స్ నుంచి తప్పుకుంటాం: కేజ్రీవాల్
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు (ఎంసీడీ)ను వాయిదా వేస్తున్న నేపథ్యంలో బీజేపీపై ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటీష్ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించి ప్రజాస్వామ్యం కోసం ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని.. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయడమంటే వారిని అవమానించినట్టేనని చెప్పారు. దిల్లీ అసెంబ్లీ వద్ద కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ఎంసీడీ ఎన్నికలను సరైన సమయంలో నిర్వహించి …
Read More »అసలు వాళ్లు తెలంగాణ బిడ్డలేనా?: కవిత
హైదరాబాద్: యాసంగి ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర బీజేపీ నేతలు వితండ వైఖరి అవలంబిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అసలు వీళ్ల వైఖరి చూస్తుంటే తెలంగాణ బిడ్డలేనా అనిపిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు కవిత ట్వీట్ చేశారు. ధాన్యం సేకరణకు దేశమంతా ఒకే విధానం ఉండాలంటూ రైతుల పక్షాన సీఎం కేసీఆర్ స్పష్టంగా డిమాండ్ చేశారని చెప్పారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర …
Read More »Mp పదవికి అఖిలేష్ యాదవ్ రాజీనామా
ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఓం బిర్లాకు అందించారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కర్హల్ నియోజకవర్గం నుంచి ఆయన విక్టరీ కొట్టన విషయం తెలిసిందే. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆజామ్ఘర్ ఎంపీగా అఖిలేశ్ ఎన్నికయ్యారు. ఎంపీగా రాజీనామా చేసిన అఖిలేశ్ ఇక నుంచి యూపీ సీఎం ఆదిత్యనాథ్ను అసెంబ్లీలో ఢీకొట్టనున్నారు. …
Read More »ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ ఫుల్ క్లారిటీ!
హైదరాబాద్: ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల్లో సీట్లు తగ్గడం దేనికి సంకేతమో బీజేపీ నేతలు ఆలోచించుకోవాలని టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ అన్నారు. యూపీలో బీజేపీ బలం తగ్గుతుందని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోతోందన్నారు. టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. దేశం బాగుపడాలంటే బీజేపీని గద్దె దించాలని ఆయన పునరుద్ఘాటించాఉ. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలన బాగాలేదనే …
Read More »ధాన్యం సేకరించే వరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధం సీఎం కేసీఆర్
ధాన్యం సేకరించే వరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రకటించారు. సోమవారం టీఆర్ఎల్పీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ధాన్యం సేకరణ విషయంపై కేంద్రంతో చర్చించేందుకు రేపు మంత్రుల బృందం, ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆహారశాఖ మంత్రిని కలిసి, మెమోరాండం అందజేస్తారన్నారు. వాళ్లు సమ్మతిస్తే సంతోషం.. సమ్మతించని పక్షంలో ఎంతని పోరాటానికైనా సిద్ధం కావాలని సమావేశం నిర్ణయించిందని పేర్కొన్నారు. ‘ఈ పోరాటం ఆషామాషీగా …
Read More »ఉక్రెయిన్లపై రష్యా యుద్ధాన్ని ఆపేందుకు రంగంలోకి ప్రధాని మోడీ
ఉక్రెయిన్లపై రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. యుద్ధంపై భారత వైఖరిని క్వాడ్ సభ్యదేశాలు ( JAPAN, USA, AUS, IND) అంగీకరించినట్టు ఆస్ట్రేలియా వెల్లడించింది. తన కాంటాక్టుల ద్వారా. మోడీ యుద్ధాన్ని ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. యుద్ధంపై భారత్ తటస్థ వైఖరిని అనుసరిస్తోంది. నేటి మోడీ.. AUS ప్రధాని స్కాట్ మారిసన్ భేటీలో యుద్ధం అంశం ప్రస్తావనకు రానుంది.
Read More »పవన్.. ఇంకెన్నాళ్లు ఈ డిపెండింగ్ పాలిటిక్స్?
‘దరువు.కామ్’ ప్రత్యేక కథనం అది మార్చి 14, 2014.. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా, ప్రముఖ సినీనటుడిగా ఉన్న పవన్కల్యాణ్ జనసేన పార్టీని ప్రకటించిన రోజు. తనకు అధికారం ముఖ్యం కాదని.. ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన చెప్పారు. దీంతో అటు ప్రజలు,ఇటు అభిమానులు అప్పట్లో పవన్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాలకి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఎంతో ఉద్ధరిస్తారని జనం భావించారు. సీన్ కట్ చేస్తే ఈ ఎనిమిదేళ్ల జనసేన …
Read More »BJP MLA రాజాసింగ్ అరెస్ట్
తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిన్న శుక్రవారం బీజేపీ, అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన కార్యకర్తలకు గొడవ జరిగింది. ఈ గొడవలో కొంతమంది బీజేపీ నాయకులకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని పరామర్శించేందుకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎల్లారెడ్డి పేటకు వెళ్తుండగా మార్గమధ్యలో అడ్డుకున్న అల్వాల్ …
Read More »రాజ్యసభకు భజ్జీ..?
ఇటీవల విడుదలైన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎవరూ ఊహించని విధంగా అనూహ్య విజయంతో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన టీమిండియా సీనియర్ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ను రాజ్యసభకు పంపాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అలాగే జలంధర్ ఏర్పాటు చేసే స్పోర్ట్స్ యూనివర్సిటీ బాధ్యతలను కూడా భజ్జీకి అప్పగించే అవకాశం కనిపిస్తున్నాయి.. అయితే ఈ అంశంపై త్వరలోనే …
Read More »