Home / Tag Archives: carona possitive (page 65)

Tag Archives: carona possitive

ఢిల్లీ సర్కారు మరో సంచలన నిర్ణయం

లాక్డౌన్ విధింపుతో ఉపాధికి దూరమైన నిర్మాణ రంగ కూలీలను ఆదుకునేందుకు ఢిల్లీ సర్కారు ముందుకొచ్చింది. రిజిస్టర్ అయిన కూలీలకు రూ. 5,000 చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో ఇప్పటివరకు 1,71,861 మంది నిర్మాణ కూలీలు రిజిస్టర్ అయ్యారు. వీరికి రూ. 5,000 సాయం అందనుంది. ఇక రాష్ట్రంలోని వలస కూలీలకు వసతి, వైద్యం, భోజనం లాంటి సౌకర్యాలను పర్యవేక్షించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేసింది.

Read More »

కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర సంచలన నిర్ణయం

కరోనా కట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి విదితమే..అయిన కానీ కేసులు మాత్రం భారీగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.. రాష్ట్ర వ్యాప్తంగా కఠిన లాక్డ్ డౌన్ విధించాలని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. దీనిపై ఉన్నతాధికారులతో చర్చ అనంతరం సీఎం ఉద్ధవ్ ఠాక్రే లాక్డౌన్పై రేపు ప్రకటన చేయనున్నారు

Read More »

దేశ ప్రజలకు కోహ్లీ పిలుపు

దేశ ప్రజలకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పిలుపునిచ్చాడు. ఇందులో భాగంగా ప్రజలు కరోనా నిబంధనలు తప్పక పాటించాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కోరాడు. ఇంకా.. ‘ మిత్రులారా.. దేశంలో కరోనా పెరుగుతోందని మీ అందరికీ తెలుసు. అత్యవసర పనిమీద బయటికెళ్లినపుడు మాస్క్ ధరించండి. సామాజిక దూరం పాటించండి. శానిటైజ్ చేసుకోండి. పోలీసులకు సహకరించండి. ఇవన్నీ ప్రతి ఒక్కరూ తప్పక పాటించవలసిన జాగ్రత్తలు. ఇంతకు ముందూ చెప్పాను. మీరు …

Read More »

రాహుల్ గాంధీకి కరోనా

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్  వచ్చింది. కోవిడ్ లక్షణాలు స్పల్పంగా కనిపించినట్టు రాహుల్ స్వయంగా ఓ ట్వీట్‌లో తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారు సేఫ్టీ ప్రోటోకాల్‌ను పాటించాలని, సురక్షితంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ ఇటీవల రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు.

Read More »

దేశంలో కరోనా విలయతాండవం

దేశాన్ని కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. భారీ సంఖ్యలో నమోదవుతున్న కేసులు తీవ్ర ఆందోళనకరంగా మారాయి. దేశంలో ఒక్కరోజే కొత్తగా.. 2,59,170 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి కొత్తగా 1,761 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం మృతుల సంఖ్య 1.80లక్షలకు చేరింది. ప్రస్తుతం దేశంలో 20,31,977 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారత్లో అత్యధిక కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో భారీగా నమోదవుతున్నాయి.

Read More »

రవితేజ మూవీకి కరోనా బ్రేక్

టాలీవుడ్ ఇండస్ట్రీని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది.తాజాగా రవితేజతో ‘ఖిలాడి’ మూవీ తెరకెక్కిస్తున్న దర్శకుడు రమేష్ వర్మకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఖిలాడి చిత్రాన్ని మే 28న విడుదల చేయాలని మేకర్స్ భావించగా, ఇప్పుడు ఆయనకు కరోనా సోకడం ఇబ్బందిగా మారింది. ఖిలాడి చిత్ర షూటింగ్ కొంత బ్యాలెన్స్ ఉంది.

Read More »

గ్రేటర్ పరిధిలో భారీగా కరోనా కేసులు

గ్రేటర్ పరిధిలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.GHMCలో గడచిన 24 గంటల్లో మరో 793 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 91,563 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read More »

దేశంలో ఐదుగురు సీఎంలకు కరోనా

కరోనావైరస్ దెబ్బకు సామాన్యుల నుంచి ప్రభుత్వాధినేతల వరకు ఎవ్వరూ తప్పించుకోవట్లేదు. ఇప్పటివరకు దేశంలో ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారిన పడ్డారు. తమిళనాడు సీఎం పళనిస్వామి, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం యడియూరప్ప, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఐసోలేషన్లో చికిత్స తీసుకుంటున్నారు. మాజీ ప్రధానులు దేవెగౌడ, మన్మోహన్ సింగ్ కూడా కరోనా బారిన పడ్డారు.

Read More »

పిల్లలు కూడా కరోనా బారిన పడకుండా ఏమి చేయాలంటే..?

సెకండ్ వేవ్ పిల్లలు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఐదేళ్ల లోపు పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంచేందుకు నిమ్మజాతి పండ్లు, క్యారెట్లు, స్ట్రాబెర్రీ, ఆకుకూరలు, పెరుగును రోజువారీ ఆహారంలో చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్లు పట్టుకుని, నిద్ర పోకుండా ఉంటే ఇమ్యూనిటీ దెబ్బతింటుందని అందుకే కనీసం 10 గంటల పాటు నిద్రపోయేలా చూడాలంటున్నారు. విటమిన్ డి తగిలేందుకు రోజూ అరగంట సేపు లేలేత ఎండలో ఉంచాలంటున్నారు.

Read More »

టీకా వేశాక పాజిటివ్‌ రాదు!

వ్యాక్సిన్‌ వేయించుకున్నాక జ్వరం, ఒళ్లు నొప్పులు, కొద్దిగా దగ్గు వస్తాయి. జలుబు చేసినట్లు కూడా ఉంటుంది. ఇవన్నీ అందరికీ కచ్చితంగా వస్తాయి. వారు ఆస్పత్రులకు వెళ్లి కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. వ్యాక్సిన్‌ వేయించుకున్నాక 15 రోజుల వరకు ఎప్పుడు టెస్టు చేయించుకున్నా పాజిటివ్‌ అనే వస్తుంది. అలాంటి వారిని భయపడొద్దని చెప్పండి. టెస్టులు చేయించుకోవద్దని చెప్పండి. అనవసరంగా పాజిటివ్‌ అని భయపడొద్దు..’అంటూ వైద్య సిబ్బంది చెప్తున్నట్టుగా ఓ ఆడియో క్లిప్పింగ్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat