ఇండియాలో కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చేసింది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న కొవిషీల్డ్తోపాటు హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. అత్యవసర సమయంలో పరిమిత వినియోగానికి అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. ఆదివారం మీడియాతో మాట్లాడిన డీసీజీఐ అధికారులు.. ఈ మేరకు రెండు టీకాల వినియోగానికి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. …
Read More »తెలంగాణలో తొలిదశలో 40,095 మందికి కరోనా వ్యాక్సిన్
తెలంగాణ రాష్ట్రంలోకరోనా వ్యాక్సిన్ పంపిణీకి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలి విడతలో ప్రభుత్వ ప్రైవేటు రంగంలోని వైద్య సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బందికి ఇస్తారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఇప్పటికే 40,095 మంది ఉన్నట్లు గుర్తించారు. PHC స్థాయిలో వ్యాక్సిన్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మేడ్చల్ జిల్లాలో 146, రంగారెడ్డి జిల్లాలో 60 కేంద్రాలు గుర్తించి నిల్వకు ఏర్పాట్లు చేస్తున్నారు
Read More »అమెరికా ఉపాధ్యాక్షుడికి కరోనా టీకా
అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ దంపతులు శుక్రవారం బహిరంగంగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటారని వైట్హౌస్ ప్రకటించింది. కొవిడ్ టీకాపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేందుకు టీకా తీసుకుంటున్నారని పేర్కొంది. ‘అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఆయన భార్య కరెన్ పెన్స్ టీకా భద్రత, సామర్ధ్యాన్ని ప్రోత్సహించడానికి, అమెరికన్ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి కొవిడ్-19 వ్యాక్సిన్ ను బహిరంగంగా తీసుకుంటారు’ అని వైట్హౌస్ తెలిపింది. కరోనా మహమ్మారితో విలవిలలాడుతున్న అమెరికాలో ఇటీవల కొవిడ్ …
Read More »కరోనా వ్యాక్సిన్స్ పై తాజా సమాచారం
కోవిడ్-19ను ఎదుర్కొనే దిశగా భారత్లో ప్రస్తుతం ఆరు వ్యాక్సిన్స్ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నట్లు నీతి ఆయోగ్(హెల్త్) సభ్యులు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. మంగళవారం ప్రెస్కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ వారంలో మరో వ్యాక్సిన్కు క్లినికల్ ట్రయల్స్కు క్లియరెన్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. జెనోవా కంపెనీ, భారత ప్రభుత్వం సంయుక్తంగా వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్నట్లు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. …
Read More »హైదరాబాద్ చేరుకున్న 64 దేశాల రాయబారులు
మరికాసేపట్లో శామీర్పేటలోని జీనోమ్ వ్యాలీకి 64 దేశాల రాయబారులు, హైకమిషనర్ల బృందం చేరుకోనుంది. వీరు రెండు గ్రూపులుగా విడిపోయి.. భారత్ బయోటెక్, బయోలాజికల్-ఈ సంస్థలను సందర్శించి కోవిడ్ టీకాలపై చర్చించనున్నారు. టీకాల తయారీపై ఫోటో ఎగ్జిబిషన్ను ఈ బృందాలు తిలకించనున్నాయి. టీకాల పురోగతిని తెలుసుకున్న అనంతరం శాస్ర్తవేత్తలతో రాయబారులు, హైకమిషనర్లు భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు రాయబారులు, హైకమిషనర్లు ఢిల్లీ బయల్దేరనున్నారు. విదేశీ ప్రతినిధుల రాక నేపథ్యంలో రాష్ట్ర …
Read More »కరోనా వ్యాక్సిన్ విడుదల చేసిన తొలిదేశం ఇదే…?
ప్రపంచమంతా ఎదురుచూస్తోన్న కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. ఈ మేరకు తొలి కరోనా వ్యాక్సిన్ను విడుదల చేసినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. టీకాను పరీక్షించిన వారిలో ఆయన కూమార్తె కూడా ఉన్నట్లు పుతిన్ వెల్లడించారు. ఈ టీకా ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి కరోనా అదుపులోకి వస్తుందని పుతిన్ తెలిపారు. దీంతో కరోనా వ్యాక్సిన్ రిజిస్టర్ చేసుకున్న తొలి దేశంగా రష్యా నిలిచింది. Source : EENADU
Read More »హైదరాబాద్ నుంచే కరోనాకు టీకా-మంత్రి కేటీఆర్
తెలంగాణ నుంచే కరోనా వైరస్కు తొలి టీకా వస్తుందని మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఉన్న భారత్బయోటెక్ సంస్థ నుంచే ఆ టీకా వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్ను రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇవాళ సందర్శించారు. మంత్రి కేటీఆర్తో పాటు డాక్టర్ ఎల్లా, శ్రీమతి సుచిత్రా ఎల్లా కూడా పాల్గొన్నారు. భారత్ బయోటెక్ …
Read More »