Home / Tag Archives: happy independence day

Tag Archives: happy independence day

స్వాతంత్ర దినోత్సవం నాడు సెలబ్రిటీలు ఏమన్నారంటే..!

దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ల కావడంతో దేశవ్యాప్తంగా జాతీయ పండుగ వేడుకలు అంబరాన్నంటాయి. నేడు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ ఎవరు ఏమని చెప్పారంటే.. దేశ ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా ఇంటి ముందు గర్వంగా రెపరెపలాడుతున్న మన త్రివర్ణ జాతీయ పతాకం. – చిరంజీవి   ప్రతి ఒక్కరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. …

Read More »

రేపు ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ లో ట్రాఫిక్ బంద్.. ఎందుకంటే..?

స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా  సామూహిక జాతీయ గీతాలాపనతో సమైక్యతా స్ఫూర్తిని చాటాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆకాంక్షించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపనను విజయవంతం చేయడానికి పోలీసుశాఖ ప్రత్యేకంగా కృషి చేయాలని సూచించారు. ఇందుకు జిల్లా కలెక్టర్లు, ఇతర పాలనాశాఖల అధికారులతో ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు …

Read More »

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జాతీయ‌ జెండా ఆవిష్క‌రించిన సీఎం కేసీఆర్

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవాన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్, ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నాచారితో పాటు ప‌లువురు నాయ‌కులు ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

తెలంగాణ అసెంబ్లీలో జాతీయ జెండా ఎగురవేసిన మండలి చైర్మన్‌, స్పీకర్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అసెంబ్లీలో స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. శాసనసభ ఆవరణలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనతంరం అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, అంబేద్కర్‌కు నివాళాలర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ సిబ్బంది పాల్గొన్నారు.వజ్రోత్సవాల్లో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తమ నివాసం …

Read More »

త్రివర్ణ పతాకం ఎలా తయారైంది అంటే..?

త్రివర్ణ పతాకం భారతదేశానికే గర్వకారణం. మనమందరం గర్వపడేలా ఈ జెండాను తయారుచేసింది తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య. 1906లో కలకత్తాలో నిర్వహించిన కాంగ్రెస్‌ సమావేశాల ప్రారంభ సమయంలో బ్రిటిష్‌ వారి జాతీయ జెండాను కాంగ్రెస్‌ నాయకులు ఆవిష్కరించడం చూసి పింగళి వెంకయ్య కలత చెందారు. మహాత్మాగాంధీ వెన్నుతట్టగా త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. పింగళి వెంకయ్య 1876 ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టంలోని కృష్ణా జిల్లాలోగల మచిలీపట్నం వద్ద భట్లపెనుమర్రులో తెలుగు …

Read More »

రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం

రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఇది భారత స్వాతంత్ర్య అమృత ఉత్సవాలు జరుగుతున్న సందర్భమని.. జాతి చరిత్రలో ఒక విశిష్ట ఘట్టమన్నారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య సాధన కోసం జరిగిన పోరాటంలోని ఉజ్వల ఘట్టాలను, …

Read More »

తెలంగాణలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

  పంద్రాగస్టు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీశ్‌ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో మంత్రి మహమూద్‌ …

Read More »

ఎర్రకోట నుండి ప్రధాని మోదీ పలు కీలక ప్రకటనలు

ఈరోజు దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై నుంచి ప్రసంగించిన ప్రధాని మోదీ పలు కీలక ప్రకటనలు చేశారు. దేశవ్యాప్తంగా గల అన్ని సైనిక పాఠశాలల్లో ఇకపై బాలికలకు కూడా ప్రవేశం కల్పించనున్నట్లు మోదీ ప్రకటించారు. ఇంతవరకూ బాలురకు మాత్రమే సైనిక స్కూళ్లలో ప్రవేశం కల్పించేవారు.  భారత రక్షణ రంగంలో యువతులకూ ప్రాధాన్యత కల్పిస్తున్న నేపధ్యంలో సైనిక స్కూళ్లలో బాలికలకు ప్రవేశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జమ్ముకశ్మీర్ …

Read More »

ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేసిన ప్రధాని మోదీ

75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేశారు. అంతకు ముందు ఆయన రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అజయ్‌భట్‌ స్వాగతం పలికారు. ఆ తర్వాత త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించి.. ఎర్రకోటపై జాతీయ జెండా ఎగుర వేసి, గౌరవ వందనం సమర్పించారు. …

Read More »

సైనిక వీరులకు సీఎం కేసీఆర్‌ నివాళులు

సైనిక వీరులకు సీఎం కేసీఆర్‌ నివాళులర్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని సైనిక వీరుల స్మారకం వద్ద పుష్పగుచ్చం సమర్పించి అమరులకు నివాళి అర్పించారు. అటునుంచి స్వాతంత్య్ర దినోత్సవ వేదికైన గోల్కొండ కోటకు చేరుకుంటారు. కోటలోని రాణిమహల్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. కాగా, పంద్రాగస్టు వేడుకల కోసం గోల్కొండ కోట సర్వాంగ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat