తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ప్రయివేట్ ఆసుపత్రులల్లోనూ వైద్యానికి అనుమతులు ఇస్తూ ఆదేశాలను జారీచేసింది. అయితే చాలా మంది జలుబు,దగ్గు,జ్వరం సోకిన బాధితులు వైరస్ ఉందేమో అనే భయంతో ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. బుధవారం ఒక్కరోజే ముప్పై ఆరు మందికి అనుమానంతో పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. ఇటు కరోనాపై భయాలు సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామని …
Read More »మాస్కులు ధరిస్తున్నారా.. అయితే మీకోసమే..?
కరోనా వైరస్ ప్రభావంతో ఎప్పుడు మాస్కులు ధరించని వారు కూడా రోజు ధరిస్తున్నారు. అయితే మాస్కులు ధరించేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటున్నారు నిపుణులు. ముక్కు ,నోటి గుండా వైరస్ శరీరంలోకి వెళ్లకుండా మాస్కులు పెట్టుకోవడం మంచిది.ఇక మాస్కులు సరిచేసుకోవడానికి పదే పదే ముఖాన్ని తాకకపోవడం మంచిది. ఎందుకంటే తాకడం వలన వైరస్ ముప్పు పెరుగుతుంది. అలాగే మాస్కులు పెట్టుకునే ముందు తర్వాత చేతులను సబ్బుతో వాష్ చేసుకోవడం …
Read More »తనపై దాడి గురించి రాహుల్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లోని గచ్చిబౌళిలో ఒక ప్రముఖ పబ్ లో బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ పై కొంతమంది బీరు సీసాలతో దాడికి దిగిన సంగతి విదితమే. ఈ దాడిలో రాహుల్ తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. దీనిపై రాహుల్ స్పందిస్తూ” తన తలకు చిన్న గాయం మాత్రమే అయిందని అన్నారు. మరోవైపు రాహుల్ తనపై దాడి జరిగితే పోలీసులకు పిర్యాదు చేయకుండానే ఆసుపత్రి …
Read More »పొత్తూరి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వరరావు మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పత్రికా, సామాజికరంగాల్లో చేసిన కృషిని, అందించిన సేవలను సీఎం కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పొత్తూరి అందించిన నైతిక మద్దతును కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. పొత్తూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Read More »పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత
ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు(86) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఈ ఉదయం ఆయన తన నివాసంలో కన్నుమూశారు. తెలుగు జర్నలిజంలో తనదైన ముద్ర వేసిన పొత్తూరి వెంకటేశ్వరరావు ఈనాడు, ఆంధ్రభూమి, వార్తా పత్రికల్లో పనిచేశారు. పత్రికారంగంలో ఐదు దశాబ్దాలకు పైగా సేవలు అందించారు. పొత్తూరి 1934 ఫిబ్రవరి 8వ తేదీన ఏపీలోని గుంటూరు జిల్లా పొత్తూరులో జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ అకాడమీ చైర్మన్గా పనిచేశారు.
Read More »గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ భేటీ
రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. గవర్నర్ను సీఎం కేసీఆర్ కలిసి బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించారు. ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. కరోనా నియంత్రణ చర్యలను గవర్నర్ దృష్టికి సీఎం కేసీఆర్ తీసుకెళ్లారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు మొదలవుతాయి. ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్ …
Read More »సాగర్ ఎడమకాల్వకు పునర్జీవం
తెలంగాణలో నాగార్జునసాగర్ ఎడమకాల్వ పునర్జీవానికి తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం (ట్రీ) రూ.1700 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. దాదాపు 6.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు శాశ్వత నీటి భరోసా కల్పించేలా రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి ట్రీ సమర్పించింది. సీతారామ ఎత్తిపోతల పథకంలోని ప్రధానకాల్వను ఆధారం చేసుకొని ఈ పునర్జీవ పథకానికి రూపకల్పనచేసిన దరిమిలా తక్కువ ఖర్చుతోనే బహుళ ప్రయోజనాలు పొందవచ్చని నివేదికలో ట్రీ పేర్కొన్నది. ఈ పథకంతో మున్నేరు జలాల్ని …
Read More »కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రూ.100 కోట్లు
కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. కొవిడ్-19 వైరస్ను గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వయంత్రాంగం అప్రమత్తమయిందని.. వైరస్ వ్యాప్తిచెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నారని.. కరోనాను ఎదుర్కొనేందుకు రూ.100 కోట్ల నిధులు మంజూరుచేశారని వివరించారు. కరోనావైరస్పై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. దీనిని ఎదుర్కొనేందుకు …
Read More »రేవంత్ జైలుకెళ్ళడం ఖాయం
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూము లు కబ్జాచేసిన కాం గ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఇంచార్జి మేడి పాపయ్య మాది గ ధ్వజమెత్తారు. కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించిన రేవంత్రెడ్డిని వెంటనే అరెస్టుచేసి, భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. మంగళవారం విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోడ్లను ఆక్రమించి గేట్లు పెట్టుకోవడమే …
Read More »లక్ష్మి పంప్హౌజ్లో ఎత్తిపోతలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రా జెక్టులో భాగంగా దిశను మార్చుకొని ఎదురెక్కుతూ వందల కిలోమీటర్లమేర పాలకడలిలా గోదావరి నది విస్తరిస్తున్నది. ఇక్కడి లింక్ -1,2లో మోటర్లు దిగ్విజయంగా నడుస్తుండగా, గోదావరి అజేయంగా రైతన్న బీళ్లకు పరుగులు తీస్తున్నది. దిగువన భూపాలపల్లి జిల్లాలో లక్ష్మి పంప్హౌజ్లో ఎత్తిపోతలు కొనసాగుతుంది. ఇక్కడ పెద్దపల్లి జిల్లాలోనూ పంపులు నిర్విరామంగా నడుస్తున్నాయి. మంథని మండలం కాసిపేటలోని సరస్వతి పంప్హౌజ్లో మంగళవారం …
Read More »