తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న సోమవారం జన్మదిన వేడుకలు నిర్వహించుకున్న సంగతి తెల్సిందే. అయితే ఎమ్మెల్సీ కవిత జన్మదినం సందర్భంగా ఆమెను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల రవి ఆధ్వర్యంలో ప్రతినిధులు రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని సైబర్ క్రైమ్ …
Read More »70 లక్షల మందికి కంటి పరీక్షలు
తెలంగాణ రాష్ట్రంలో 100 రోజుల్లో కంటి సమస్యలు ఉన్నవారందరికీ పరీక్షలు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 70 లక్షల మందికి కంటి పరీక్షలు పూర్తయినట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. రాష్ట్రంలో 4,565 గ్రామాల్లో, 1616 మున్సిపల్ వార్డుల్లో క్యాంపులు నిర్వహించామని మంత్రి హారీష్ ఈ సందర్భంగా వివరించారు. క్యాంపులలో …
Read More »జగద్గిరిగుట్టలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర’లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా సంజయ్ పురి కాలనీ, జగద్గిరినగర్ లలో పాదయాత్ర చేస్తూ.. పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించారు. అనంతరం మిగిలి ఉన్న పనులు తెలుసుకున్నారు. ఆయా పనులన్నీ త్వరలోనే పూర్తి చేయిస్తానని ప్రజలకు ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన …
Read More »వినూత్నంగా ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) పుట్టినరోజును (Birthday) పురస్కరించుకుని అభిమానులు, బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్కు (Nizamabad) చెందిన బీఆర్ఎస్ నాయకుడు చిన్ను గౌడ్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపి తన అభిమానాన్ని చాటుకున్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో (Andaman Nicobar islands) బంగళాఖాతం (Bay of Bengal) సముద్రపు అంచుల్లోకి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు.నీటి అడుగున …
Read More »బెస్ట్ యాక్షన్ షార్ట్ ఫిలిం విభాగంలో ‘యాన్ ఐరిష్ గుడ్బై’ కు ఆస్కార్
95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో ఆ ఘనంగా జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ తారలు ఈ వేడుకకు హాజరయ్యారు. విభాగాల వారిగా అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది. ఉత్తమ సహాయ నటుడు కేటగిరితో ఈ అవార్డులు ప్రారంభమయ్యాయి. బెస్ట్ యాక్షన్ షార్ట్ ఫిలిం విభాగంలో ‘యాన్ ఐరిష్ గుడ్బై’ను ఆస్కార్ వరించింది.ఈ విభాగంలో ‘యాన్ ఐరిష్ గుడ్బై’, ‘ఇవలు’, ‘లే పూపిల్లే’, ‘నైడ్ రైడ్’, …
Read More »ఇన్నోవేటివ్ హై స్కూల్ 8వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే Kp…
తెలంగాణ రాష్ట్రంలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం మహారాజ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఇన్నోవేటివ్ హై స్కూల్ 8వ వార్షికోత్సవంలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యంకు ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ సారిక పోల, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, మహ్మద్ మక్సూద్ అలీ, పాక్స్ డైరెక్టర్ …
Read More »ఆర్ఆర్ఆర్ కు అస్కార్ పై సీఎం కేసీఆర్ స్పందన
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ .. రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాట కు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.విశ్వ సినీ యవనిక మీద ఒక తెలుగు సినిమా సత్తా చాటుతూ, ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత …
Read More »దాదాపు 14 నెలల తర్వాత విరాట్ కోహ్లీ
టీమ్ ఇండియా బ్యాట్స్ మెన్.. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి కొంతకాలంగా టెస్ట్ ఫార్మాట్ లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఆసీస్ తో జరిగిన మూడు టెస్టుల్లోనూ భారీ స్కోర్లు చేయలేకపోయాడు. నాలుగో టెస్టులో కోహ్లి గాడిన పడినట్లు కనిపిస్తున్నాడు. మొదటి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని 59 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. కోహ్లికి ఇది 29వ అర్ధ శతకం. దాదాపు 14 నెలల …
Read More »ఏప్రిల్ 14నుండి ఏపీ బడ్జెట్ సమావేశాలు
ఏపీ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగిస్తారు. ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రూ.2.60 లక్షల కోట్లతో 2023-24 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లోనే మూడు రాజధానులు బిల్లుపై వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. కోర్టు కేసుల నేపథ్యంలో విశాఖ రాజధాని అంశంపై తీర్మానం …
Read More »అజ్ఞాత వ్యక్తులు, సంస్థల నుంచి బీజేపీకి రూ.1,161 కోట్లు విరాళం
దేశంలోని ఏడు ప్రధాన జాతీయ పార్టీలకు 2021-2022లో అజ్ఞాత వ్యక్తులు, సంస్థల నుంచి రూ.2,172 కోట్ల ఆదాయం వచ్చిందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పేర్కొంది. అయితే పార్టీలకు వచ్చిన మొత్తం ఆదాయంలో 66 శాతం వారినుంచే అందినట్లు తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, నేషనల్ పీపుల్స్ పార్టీలకు ఈ ఆదాయం లభించింది. వీటిలో బీజేపీకే రూ.1,161 కోట్లు వచ్చాయని ADR సంస్థ తెలిపింది.
Read More »