నిన్నశనివారం రాత్రి జరిగిన రెండో పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 16.1 ఓవర్లలో 68 పరుగులకు ఆలౌటైంది.సుయాశ్ ప్రభుదేశాయ్ (15), మ్యాక్స్వెల్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు నమోదు చేయగా.. డుప్లెసిస్ (5), విరాట్ కోహ్లీ (0), అనూజ్ రావత్ (0), షాబాజ్ అహ్మద్ (7), దినేశ్ కార్తీక్ (0) ఘోరంగా విఫలమయ్యారు. ఇన్నింగ్స్ …
Read More »బండి సంజయ్ కు మంత్రి హరీష్ రావు సవాల్
తెలంగాణకు రావాల్సిన రూ.7,183 కోట్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయని, దమ్ముంటే ఆ నిధులను తీసుకురావాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్లకు మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. ఒక అబద్ధాన్ని మళ్లీ మళ్లీ చెప్పి నిజమని చిత్రీకరించేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. శనివారం టీఆర్ఎ్సఎల్పీలో మీడియా సమావేశంలో పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, చంటి క్రాంతికిరణ్లతో కలిసి ఆయన …
Read More »దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలవరం
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1,094 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం ఢిల్లీలో యాక్టివ్ కేసులు 3,705కు చేరుకున్నాయి. పాజిటివిటీ రేటు 4.82 శాతానికి చేరింది. ఈనెల 11న 601గా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 3,705కి చేరింది. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశించింది.
Read More »పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ సంచలన నిర్ణయం
పంజాబ్ రాష్ట్ర సీఎం భగవంత్ సింగ్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రంలోని 184 మంది ప్రముఖుల భద్రతను వెనక్కి తీసుకుంటూ ఆదేశాలు జారీ చేయగా.. ఇందులో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కొందరు ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉన్నారు. మాజీ సీఎం చన్నీ కుటుంబ సభ్యులకు సైతం భద్రతను ఉపసంహరించగా.. సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులున్న వారికి మాత్రమే భద్రతను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.
Read More »అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ కి అరుదైన గౌరవం….
ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందిస్తూ… ఎంతో మంది నిరుపేదలకు అండగా నిలుస్తూ… ఎల్లప్పుడూ కష్టాలలో ఉన్నవారికి సహాయ సహకారాలు అందిస్తున్న అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ కి అరుదైన గుర్తింపు లభించింది. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ పేద ప్రజలకు అందిస్తున్న సేవలకు గాను జాతీయ సేవా పురస్కారం వరించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు, క్రీడాకారులకు, ఎంతో మంది నిరుపేద ప్రజలకు వారి అవసరాలకు అనుగుణంగా అనేక …
Read More »మలేరియా కేసుల నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వ కృషికి జాతీయ గుర్తింపు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మలేరియా కేసుల నియంత్రణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ కృషికి జాతీయ గుర్తింపు దక్కింది. గత ఆరేళ్లలో (2015-2021) రాష్ట్రంలో మలేరియా కేసులు గణనీయంగా తగ్గాయని కేంద్రప్రభుత్వం ప్రశంసించింది. ఈ మేరకు కేంద్రం రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు లేఖ పంపింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె, …
Read More »KGF2 చిత్రం యూనిట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కంగ్రాట్స్
రాక్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా..ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చి ఘన విజయం సాధించిన KGF2 చిత్రం యూనిట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కంగ్రాట్స్ చెప్పాడు. ‘యశ్ నటన అద్భుతం. సంజయత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి బాగా నటించారు. రవి బస్రూర్ బీజీఎం మరో లెవల్లో ఉంది. ప్రశాంత్ నీల్ అద్భుతమైన సినిమా అందించారు. భారతీయ సినిమా ఖ్యాతిని పెంపొందించినందుకు కృతజ్ఞతలు’ …
Read More »ఎంపీ నవనీత్ కౌర్ ,ఆమె భర్త రవి రాణాకు పోలీసులు నోటీసులు
మహారాష్ట్ర ఎంపీ,ప్రముఖ నటి నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త రవి రాణా(ఎమ్మెల్యే)కు పోలీసులు నోటీసులు పంపించారు. వారిద్దరూ కలిసి మహరాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం ఎదుట హనుమాన్ చాలీసా పారాయణం చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. దీంతో అలర్టైన ముంబై పోలీసులు వారికి నోటీసు పంపారు. హనుమాన్ జయంతి రోజున హనుమాన్ చాలీసా చదివేందుకు శివసేన అధిష్ఠానం అనుమతించనందునే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని నవనీత్ దంపతులు చెప్పారు.
Read More »రూ.1100కోట్ల కలెక్షన్లు రాబట్టిన RRR
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాతగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్..యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా.. ఆలియా భట్టు,శ్రియా,సముద్రఖని,రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించగా ఇటీవల విడుదలైన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా ఈ మూవీ నాలుగు వారాల కలెక్షన్లను వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ.1100కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు తెలిపింది. ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో రూ.350కోట్లు వసూలు …
Read More »దుమ్ము లేపుతున్న బుల్లెట్ సాంగ్
సరైన కథలను ఎంపిక చేసుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన శైలీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న యువహీరో.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. గతంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో రామ్ తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్ను ఏర్పరచుకున్న రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’తో పూర్తి మాస్ హీరోగా మేకోవర్ అయ్యాడు. అంతేకాకుండా ఈ చిత్రం తర్వాత రామ్ …
Read More »