పశ్చిమ బెంగాల్లో పలువురు కాషాయ పార్టీ నేతలు రాజీనామా చేసి పాలక టీఎంసీ గూటికి చేరుతున్న క్రమంలో తాజాగా బెంగాలీ నటి, పార్టీ నేత స్రవంతి ఛటర్జీ బీజేపీని వీడారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చి 2న ఆమె బీజేపీలో చేరారు. బెంగాల్ అభివృద్ధిపై కాషాయ పార్టీకి ఎలాంటి చిత్తశుద్ధి, ప్రణాళికలు లేవని అందుకే తాను కాషాయ పార్టీని వీడుతున్నానని స్రవంతి ఛటర్జీ స్పష్టం చేశారు.మరోవైపు …
Read More »దేశంలో కొత్తగా 13,091 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 13,091 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 340 మంది కరోనాతో మరణించారు. గడిచిన 24 గంటల్లో 13,878 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,38,00,925కి చేరింది. కాగా ప్రస్తుతం దేశంలో 1,38,556 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు 110.23 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.
Read More »ఆరెంజ్ జ్యూస్ ఇలా తాగుతున్నారా..?
నారింజ రసంలో విటమిన్-సితోపాటు హెస్పెరిడిన్ అనే పదార్థం ఉంటుంది. దీనికి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనే రసాయన ప్రక్రియను అడ్డుకునే శక్తి ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఆరెంజ్ జ్యూస్లో చాలామంది చక్కెర లేదా ఉప్పు కలుపుకొని తాగుతారు. అలా చేయడం వల్ల జ్యూస్ తన సహజ స్వభావం కోల్పోయి శరీరానికి పోషకాలు అందించడంపై ప్రభావం పడుతుందని ఫ్లోరిడా యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు.
Read More »తెలంగాణ BJP నేతలకు మంత్రి గంగుల వార్నింగ్
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ధాన్యం కొంటుంటే.. బీజేపీ నేతలు ధర్నాల పేరుతో డ్రామాలాడుతున్నారని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ధర్నాలు ఇక్కడ కాదు ఢిల్లీలో చేయాలని సూచించారు. తాము వడ్లు కొంటున్నామని, బియ్యం కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 6,663 కేంద్రాలను ఏర్పాటు చేసి వానాకాలం పంట ప్రతి గింజను కొంటామని చెప్పారు. యాసంగి పంట మొత్తం కేంద్రమే కొనాలని డిమాండ్ చేశారు.
Read More »డిసెంబర్ 28 నుంచి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు
డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు (ఓల్డ్ బ్యాచ్) మొదటి సంవత్సరం పరీక్షలు డిసెంబర్ 28 నుంచి 31 వరకు, రెండో సంవత్సరం పరీక్షలు జనవరి 3 నుంచి 8, 2022 వరకు, మూడో సంవత్సరం పరీక్షలు జనవరి 17 నుంచి 22, 2022 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష సమయం మధ్యాహ్నం 2.00 నుంచి 5.00 గం.ల వరకు …
Read More »దేశంలో విద్యాభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ బాటలు
దేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన దేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని జెడ్పీ చైర్ పర్సన్ సరిత అన్నారు. ఆయన జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని రాజీవ్ మార్గ్లో ఉన్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ..విద్య అనేది రహస్యంగా దాచి పెట్టబడిన ధనం వంటిదన్నారు. విద్యయే సకల భోగాలను, కీర్తిని, …
Read More »రవితేజ అభిమానులకు Good News
మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న 154వ సినిమాలో మాస్ మహారాజ రవితేజ నటించబోతున్నాడనే లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రాన్ని పూర్తి చేసిన చిరు, ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’, బాబీ దర్శకత్వంలో మెగా ‘154’వ చిత్రాన్ని కూడా సెట్స్పైకి తీసుకు రాబోతున్నారు. ఇటీవలే ఈ …
Read More »తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో కనీస చార్జీలు పెంపు
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో కనీస చార్జీలు రూ.15 నుంచి రూ.25 వరకు పెరగనున్నాయి. పల్లెవెలుగు బస్సులతో పాటు సిటీ ఆర్డినరీ బస్సుల్లో కనీస చార్జీలు రూ.10 నుంచి రూ.15 వరకు పెంచాలని ఆర్టీసీ యా జమాన్యం నిర్ణయించింది. సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులో ప్రస్తుతం ఉన్న రూ.10 చార్జీని రూ.20లకు పెంచాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. మెట్రో డీలక్స్లో రూ.15 ఉన్న కనీస చార్జీని రూ.25కు పెంచే అవకాశం ఉంది. జిల్లాల్లోని …
Read More »రేపటి ధర్నాలకు సిద్ధం కావాలని TRSWP కేటీఆర్ పిలుపు
తెలంగాణ సర్కార్ చాల రోజుల తర్వాత పోరుకు సిద్ధమైంది. ప్రత్యేక రాష్ట్రం కోసం ధర్నాలు, నిరాహార దీక్షలు, ఉద్యమాలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్న తెరాస పార్టీ.. ఇప్పుడు కేంద్రం ఫై పోరుకు సిద్ధమైంది. తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తుండడంతో తెరాస సర్కార్ ఉద్యమం చేపట్టబోతుంది. ఒక్క ధాన్యం కూడా మిగలకుండా కేంద్రం కొనుగోలు చేయాలనీ..ఆలా చేసే వరకు ఉద్యమం చేపట్టాలని డిసైడ్ …
Read More »విజయ గర్జన సభ స్థలాన్ని పరిశీలించిన ఓరుగల్లు జిల్లా ప్రజా ప్రతినిధులు….
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ రెండు దశబ్దాలు పూర్తి చేసుకున్న సందర్బంగా నవంబర్ 29న వరంగల్ వేదికగా నిర్వహించనున్న విజయగర్జన సభా స్థలాన్ని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు అరూరి రమేష్ , చల్లా ధర్మారెడ్డి …
Read More »