Home / Tag Archives: slider (page 552)

Tag Archives: slider

Gas Cylinder వినియోగదారులకు షాక్‌

దేశీయ చమురు కంపెనీలు వినియోగదారులకు షాక్‌ ఇచ్చాయి. వాణిజ్య సిలిండర్‌ ధరను రూ.266కు పెంచగా.. ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. పెరిగిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. తాజాగా పెంచిన ధరలతో కమర్షియల్‌ సిలిండర్‌ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.2000 మార్క్‌ను దాటింది. ఇంతకు ముందు ధర రూ.1735గా ఉండేది. ప్రస్తుతం రూ.2,175కు పెరిగింది. ముంబైల్‌లో 19 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1950, …

Read More »

దేశంలో కొత్తగా 12,514 కరోనా కేసులు

 దేశంలో గడిచిన 24 గంటల్లో 12,514 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. తాజాగా మహమ్మారి నుంచి 12,718 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ బారినపడి 24 గంటల్లో 251 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,42,85,814కు పెరిగాయి. ప్రస్తుతం 1,58,817 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 3,36,68,560 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ …

Read More »

ప్రత్యేక ఆకర్షణగా టెంపుల్‌ సిటీ

యాదాద్రి పుణ్యక్షేత్రం ఆధ్యాత్మికతతోపాటు పచ్చదనానికి నిలయంగా మారుతున్నది. ఆలయ పరిసరాల్లో 98 రకాలకు చెందిన 4.21 లక్షల మొక్కలు పెంచుతున్నారు. వివిధ జిల్లాల నుంచి ఆలయానికి సులభంగా చేరుకునేలా రహదారి విస్తరణ పనులతోపాటు ఆలయం చుట్టూ రింగ్‌ రోడ్డు పనులు చేపట్టారు. రోడ్లకు ఇరువైపులా పచ్చదనం పెంపుపై వైటీడీఏ దృష్టిసారించింది. వాహనాల రద్దీ కారణంగా కాలుష్య సమస్యలు తలెత్తకుండా రకరకాల మొక్కలు నాటారు. తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ నుంచే …

Read More »

‘దేశాన్ని సాకుతున్న నాలుగైదు అతిపెద్ద రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి’

‘దేశాన్ని సాకుతున్న నాలుగైదు అతిపెద్ద రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి’ అని సీఎం కేసీఆర్‌ పదేపదే చెప్తుంటారు.కేంద్ర ప్రభుత్వ నివేదికలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా ఓ జాతీయ పత్రిక చేసిన విశ్లేషణలో సైతం ఆర్థిక శక్తులుగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణను ఒకటిగా తేల్చింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ర్టాలతో పోల్చితే దక్షిణాది రాష్ర్టాలు బలంగా ఉన్నాయని వెల్లడించింది. ఈ విశ్లేషణలో దేశాన్ని తూర్పు, పశ్చిమ, మధ్య (సెంట్రల్‌), దక్షిణ, …

Read More »

కేసీఆర్‌ వల్లే తెలంగాణ వచ్చింది

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ అనుకూల స్టాండ్‌ తీసుకొన్న కాంగ్రెస్‌ పార్టీ కూడా కేసీఆర్‌ అడుగుజాడల వెంటే నడిచిందని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి ఇంకా చాలాకాలం పడుతుందని కుండబద్దలు కొట్టా రు.  సీఎల్పీ కార్యాలయంలో మీడియా తో చిట్‌చాట్‌ చేసిన జగ్గారెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడు …

Read More »

ఆసుపత్రిలో కైకాల సత్యనారాయణ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు,విలన్ గా వికట్టాహాసం చేసినా, కేరెక్టర్ యాక్టర్ గా కన్నీరు పెట్టించినా, కమెడియన్ గా కడుపుబ్బ నవ్వించినా ఆ ఘ‌న‌త కైకాల స‌త్య‌నారాయ‌ణ‌కే ద‌క్కుతుంది. ఆరు ద‌శాబ్ధాలుగా తెలుగు వారిని త‌న న‌ట‌న‌తో అల‌రించిన కైకాల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఆయన జారిపడ్డారు. కింద ప‌డ‌డం వ‌ల‌న నొప్పులు కాస్త ఎక్కువ‌గా ఉండ‌డంతో సికింద్రాబాద్‌లోని ప్రముఖ ప్రైవేటు …

Read More »

రెండో డోస్‌ తప్పకుండా తీసుకోవాలి

కరోనా నియంత్రణకు మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారు రెండో డోస్‌ తప్పకుండా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ సూచించారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ రైజ్‌హోమ్‌ కాలనీలో శనివారం ఏర్పాటు చేసిన మొబైల్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని సీఎస్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 3 కోట్లకు పైగా కొవిడ్‌ టీకాలు ఇచ్చామని, నగరంలో దాదాపు 90 శాతం పౌరులకు వ్యాక్సిన్‌ పూర్తయ్యిందని చెప్పారు. శనివారం నుంచి …

Read More »

హైదరాబాద్‌లో ‘ప్లగ్‌ అండ్‌ ప్లే’ టెక్‌ సెంటర్‌!

టెక్నాలజీ రంగంలో వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌లో కార్యాలయం ఏర్పాటుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ‘ప్లగ్‌ అండ్‌ ప్లే’ టెక్‌ సెంటర్‌ సుముఖత వ్యక్తం చేసింది. ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ శనివారం పారి్‌సలోని ప్లగ్‌ అండ్‌ ప్లే కార్యాలయాన్ని సందర్శించి సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. దేశంలోనే ప్రముఖ స్టార్టప్‌ నగరంగా హైదరాబాద్‌ కొనసాగుతోందని, టి-హబ్‌, వి-హబ్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న …

Read More »

బెంగళూరుకు చంద్రబాబు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు,మాజీ సీఎం నారా చంద్రబాబు కుప్పంలో రెండు రోజుల పర్యటన ముగించుకొని  రోడ్డు మార్గం మీదుగా బెంగళూరుకు బయలుదేరారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకొనున్నారు. కుప్పం ఆర్ అండ్ బీ అతిథి గృహం ఆవరణంలో బస్సులోనే  రెండు రోజులుగా ఆయన బస చేశారు. రాత్రి 3 గంటల వరకు కుప్పం  పరిధిలో ఉన్న మున్సిపాలిటీ అభ్యర్థులు, వార్డు ఇన్చార్జ్‌లతో …

Read More »

దేశంలో చమురు మంటలు

దేశంలో చమురు మంటలు కొనసాగుతున్నాయి. వరుసగా ఐదో రోజూ పెట్రోల్‌ డీజిల్‌ ధరలు పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచాయి. దీంతో న్యూఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.109.34, డీజిల్‌ రూ.98.07కు చేరాయి. అదేవిధంగా ముంబైలో పెట్రోల్‌ రూ.115.15, డీజిల్‌ రూ.106.23, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.109.79, డీజిల్‌ రూ.101.19, చెన్నైలో పెట్రోల్‌ రూ.106.04, డీజిల్‌ రూ.102.25కు పెరిగాయి.ఇక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat