ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సేవలకు జాతీయ స్థాయి గుర్తింపు రావడం పట్ల రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆస్పత్రి వైద్యులను, సిబ్బందిని మంత్రి పువ్వాడ అభినందించారు.దేశంలోని జిల్లా ఆస్పత్రుల పురోగతిపై కేంద్ర ఆరోగ్య శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ భాగస్వామ్యంతో నీతి ఆయోగ్ రూపొందించిన నివేదికను నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ విడుదల చేశారు. …
Read More »Huzurabad By Poll-నేటి నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
హుజూరాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని, ఈనెల 8న నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగుస్తుందని సీఈవో శశాంక్ గోయల్ చెప్పారు. ప్రతి ఈవీఎంలో 16 మంది అభ్యర్థులు, నోటా ఆప్షన్కు అవకాశం ఉంటుందని, నామినేషన్ల సంఖ్య పెరిగితే అదనంగా ఈవీఎంలను సిద్ధం చేస్తామని చెప్పారు. ఉప ఎన్నిక పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొనడంతో ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలను …
Read More »మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
ఏపీ సమాచార-రవాణా శాఖల మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ”మంత్రి పదవి మీద ప్రేమ ఎందుకుంటుంది..? నేనెప్పుడు ఊడిపోతానో నాకే తెలియదు’ అని అన్నారు. బుధవారం మచిలీపట్నంలో సినీ నిర్మాతలతో సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై వైసీపీ నాయకుల్లోనే గాక.. సర్వతా జరుగుతోంది. సీఎం జగన్ తన మంత్రివర్గం మొత్తాన్ని మార్చేస్తారని, కొత్తవారికి అవకాశం ఇస్తారని జరుగుతున్న …
Read More »ఈటల ఇంకా ఇంటికెళ్లుడేనా..?
నిన్నటికి నిన్న రాజకీయ కురువృద్ధుడైన ఒక నేత.. అప్పుడే రాజకీయాల్లో ప్రవేశించిన ఓ కుర్రాడి చేతిలో పరాజయాన్ని మూటకట్టుకోవాల్సి వచ్చింది!అప్పుడే రాజకీయాల్లో ప్రవేశించిన ఓ కుర్రాడి చేతిలో పరాజయాన్ని మూటకట్టుకోవాల్సి వచ్చింది! వారసత్వ రాజకీయాన్ని ఘనంగా చాటుకునే మరో నాయకుడు.. ఓ విద్యార్థి నేతకు లభించిన ప్రజామద్దతు ముందు తలొంచాల్సి వచ్చింది! రాజకీయాల్లో ఢక్కాముక్కీలు తిన్న అనేకమంది.. ఉద్యమ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినవారి ముందు డీలాపడిన సందర్భాలెన్నో! ఒకప్పుడు పెద్దపల్లిలో, …
Read More »‘తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం’ అంటే ఎలా ఉంటుందో రుజువు చేసిన ఈటల రాజేందర్
‘తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం’ అంటే ఎలా ఉంటుందో ఈటల రాజేందర్ రుజువు చేశాడు. అక్కున చేర్చుకొని అందలమెక్కించిన పార్టీకి వెన్నుపొడిచిన రాజేందర్ తనకు అన్యాయం జరిగిందని నమ్మబలుకుతున్నాడు. నిజానికి ఈటలకు పార్టీలో, ప్రభుత్వంలో మరెవ్వరికీ దక్కని ప్రాధాన్యం లభించింది. ప్రజలను ఆదరించి అభివృద్ధి చేయమని పదవులిస్తే.. పార్టీకి, ప్రజలకు ద్రోహం చేశాడు. తన ఆస్తులపెంపుకోసం ఆరాటపడి భూ ఆక్రమణలకు పాల్పడ్డాడు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంశంపై …
Read More »ఆటో డ్రైవర్ కుటుంబానికి అండగా ఎమ్మెల్యే నన్నపునేని..
పెరుకవాడకు చెందిన ఆటో డ్రైవర్ వల్లెపు మదుసూదన్ ఇటివల రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.. మదుసూదన్ బార్య లతకు,పిల్లలకు 25 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శివనగర్ లోని క్యాంపు కార్యాలయంలో వారికి అందజేసారు.. వారి కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు..ఈ కార్యక్రమంలో ఐక్యత ఆటోయూనియన్ బొల్లం సంజీవ్,నాగరాజు,మహేష్,రాజేందర్,కుమార్,నరేష్,రాకేశ్,శివ,కిషోర్,దేవరాజ్,నబి తదితరులు పాల్గొన్నారు..
Read More »డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడిన నటుడు
తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన ‘సింగం’ సినిమాలో విలన్గా నటించిన నైజీరియన్ దేశస్థుడు, నటుడు చాక్విమ్మాల్విన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో భాగంగా బెంగుళూరు పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.8 లక్షల విలువ చేసే హ్యాష్ ఆయిల్సహా ఎండీఎంఓ వంటి మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాక్డౌన్ సమయంలో సినిమా అవకాశాలు రాకపోవడంతో అతడు డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. …
Read More »నక్క తోక తొక్కిన కియారా అద్వానీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి – కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కాంబినేషన్లో ఓ సినిమా మొదలవబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్గా కియారా అద్వానీ దాదాపుగా ఫైనల్ అయినట్టు సమాచారం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ‘మహర్షి’ చిత్రం తరువాత మహేశ్ బాబుతో మరో సినిమా చేయాలని వంశీ పైడిపల్లి ప్లాన్ చేసుకున్నాడు. ఇద్దరు ఈ విషయాన్ని …
Read More »తైవాన్ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రాధాన్యత
తైవాన్ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇన్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తైవాన్ – కనెక్ట్ తెలంగాణ స్టేట్ సమావేశంలో మంత్రి కేటీఆర్ వర్చువల్గా పాల్గొన్నారు. తైవాన్ – తెలంగాణ మధ్య వ్యాపార వాణిజ్యాన్ని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో పెట్టుబడి అవకాశాలను కంపెనీలకు అవగాహన కల్పించే నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. …
Read More »తన ఇంటిపై దాడి గురించి పోసాని సంచలన వ్యాఖ్యలు
నిన్న బుధవారం అర్ధరాత్రి పోసాని కృష్ణమురళి ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ దాడి ఘటనపై పోసాని స్పందించారు.పవన్ కల్యాణ్ లాంటి ఆవేశపరులు రాజకీయాలకు పనికిరారని అన్నాడు.ఆర్టిస్ట్గా ఉన్నప్పటి నుండి అలానే ఉన్నాడు. సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్ర షూటింగ్లో కో డైరెక్టర్ ఏదో తప్పు చేశాడని కొట్టాడు. అతని తప్పు లేదని తెలిసిన కూడా సారీ చెప్పలేదు. ఆయన ఎప్పటి నుండో అలా …
Read More »