ఏపీ సమాచార-రవాణా శాఖల మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ”మంత్రి పదవి మీద ప్రేమ ఎందుకుంటుంది..? నేనెప్పుడు ఊడిపోతానో నాకే తెలియదు’ అని అన్నారు. బుధవారం మచిలీపట్నంలో సినీ నిర్మాతలతో సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
దీనిపై వైసీపీ నాయకుల్లోనే గాక.. సర్వతా జరుగుతోంది. సీఎం జగన్ తన మంత్రివర్గం మొత్తాన్ని మార్చేస్తారని, కొత్తవారికి అవకాశం ఇస్తారని జరుగుతున్న ప్రచారానికి పేర్ని మాటలు బలం చేకూర్చుతున్నాయి. సీఎంగా జగన్ బాధ్యతలను స్వీకరించి కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత.. మంత్రుల పనితీరు ఆధారంగా రెండున్నరేళ్ల తర్వాత సగం మందిని మార్చేస్తామని ప్రకటించారు.
అయితే మొత్తం మంత్రివర్గాన్నే మార్చేయాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు కొద్ది రోజుల క్రితం ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ కథనం మంత్రుల్లో తీవ్ర కలకలం రేపింది. దీనిని ధ్రువీకరించేలా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా మంత్రులందరినీ మార్చేస్తారని ఇటీవల ప్రకటించారు. తాజాగా పేర్ని వ్యాఖ్యలు సైతం అదే ధోరణిలో ఉండడం గమనార్హం.