జింబాబ్వే మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ బ్రెండన్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2004లో అరంగేట్రం చేసిన బ్రెండన్ టేలర్.. ఆ తర్వాత జింబాబ్వే స్టార్ బ్యాట్స్మన్గా ఎదిగాడు. తన కెరీర్లో 34 టెస్టులు, 204 వన్డేలు, 45 టీ 20లు ఆడాడు. వన్డేల్లో జింబాబ్వే తరపున 6,677 పరుగులు చేశాడు. జింబాబ్వే తరపున ఇదే రెండో అత్యధికం.
Read More »భారత్ కెప్టెన్ గా రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ అనంతరం కెప్టెన్సీ బాధ్యతలను రోహితక్కు అప్పగించనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై విరాట్ కోహ్లి త్వరలో స్వయంగా ప్రకటన చేస్తాడని చెప్పాయి. తన బ్యాటింగ్పై దృష్టి సారించేందుకే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read More »దుమ్ము లేపుతున్న ‘లవ్స్టోరీ’ Trailler
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో నాగ చైతన్య- అందాల రాక్షసి సాయి పల్లవి జంటగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘లవ్స్టోరీ’. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల నుండి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. వినాయక చవితికి విడుదల కావలసిన ఈ చిత్రం పలు కారణాల వలన వాయిదా పడింది. సెప్టెంబర్ 24న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది.ఈ చిత్రం …
Read More »డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటుడిగా ఎంత ఎదిగారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న రామ్ చరణ్ త్వరలో ఆచార్య, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రేక్షకులని పలకరించనున్నాడు. ఈ రెండు సినిమాలు థియేటర్ సమస్యలన వలన ఆగిపోయాయి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తుండగా, ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకుంది.చరణ్ నటుడిగానే కాకుండా నిర్మాతగాను సత్తా చాటుతున్నారు. అయితే ఇప్పుడు సరికొత్తగా …
Read More »ఒక మంచి నాయకుణ్ణి కోల్పోయాం -మంత్రి Harish Rao
సిద్దిపేట నియోజకవర్గం సిద్దిపేట అర్భన్ మండలం మందపల్లి గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు , ఉమ్మడి మెదక్ జిల్లా పశుగణాభివృద్ది సంస్థ చైర్మన్ దేవునూరి తిరుపతి నిన్న అనారోగ్యంతో మృతి చెందారు.. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మందపల్లి లో తిరుపతి భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులర్పించారు.. ఆయన మృతి పట్ల తన సంతాపాన్ని తెలియజేశారు.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఒక మంచి …
Read More »సీఎం KCR అధ్యక్షతన వ్యవసాయశాఖ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం
కేంద్ర ప్రభుత్వం ఒక్క కిలో బాయిల్డ్ రైస్ కూడా కొనలేమని చెప్పిన నేపథ్యంలో.. రాష్ట్రంలోని బాయిల్డ్ రైస్ మిల్లులు మూతపడే ప్రమాదం ఉందని, తెలంగాణలో రైతులు ఇకముందు వరిపంట సాగు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని ప్రగతిభవన్ లో జరిగిన వ్యవసాయశాఖ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన వ్యవసాయ పంటల సాగు, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై ఆదివారం ప్రగతిభవన్ లో …
Read More »రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ -CM KCR
కరోనా నుండి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వైద్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్నందున.. మన రాష్ట్రానికి కూడా సరిపడా వ్యాక్సిన్ సరఫరా అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కరోనా పూర్తి నియంత్రణలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్ లో ప్రజలకు కరోనా వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటానికి …
Read More »ఉత్తేజ్ ఇంట విషాదం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం నెలకొంది. ఉత్తేజ్ భార్య పద్మావతి అనారోగ్యంతో కన్నుమూశారు. బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఉత్తేజ్ కి చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణలో ఆమె కీలకంగా వ్యవహరించేవారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్, ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉత్తేజ్- పద్మావతి దంపతులకు చేతన, పాట అనే ఇద్దరు పిల్లలున్నారు.
Read More »మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో ముప్పు బిక్షపతి భేటి
తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఉత్తర్వుల జారీకి కృషి చేసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు ముప్పు భిక్షపతి మంత్రుల నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ పోరాట యోధులను గుర్తించి తగిన గౌరవం కల్పించడంలో సీఎం …
Read More »గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్
అంతా ఊహించినట్టుగానే గుజరాత్లో బీజేపీ హైకమాండ్ పటేల్ సామాజిక వర్గంవైపు మొగ్గుచూపింది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ను ( Bhupendra Patel ) ఎంపికచేసింది. ఇవాళ గాంధీనగర్లో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా భూపేంద్ర పటేల్ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. భూపేంద్ర పటేల్ పేరును మాజీ సీఎం విజయ్ రూపానీ ప్రతిపాదించగా మిగతా ఎమ్మెల్యేలంతా ఆమోదించారు. కేంద్ర పరిశీలకుడు నరేంద్రసింగ్ తోమర్ భూపేంద్ర పటేల్ను …
Read More »