దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియన్ ఐడల్ సీజన్-12లో మన తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరో స్థానంలో నిలిచింది. మొత్తం ఆరుగురు ఫైనల్కు చేరగా.. ఉత్తరాఖండ్కు చెందిన పవన్దీ్ప రాజన్ విజేతగా నిలిచారు. రెండోస్థానంలో అరుణిత కాంజీలాల్, మూడోస్థానంలో సయాలీ కాంబ్లే, నాలుగోస్థానంలో మహ్మద్ దానిష్, ఐదో స్థానంలో నిహాల్ తౌరో నిలిచారు. విజేతగా నిలిచిన పవన్దీ్ప రూ.25 లక్షల నగదు, మారుతి సుజుకీ స్విఫ్ట్ కారు గెలుచుకున్నాడు. దాదాపు 12 …
Read More »‘మాస్ట్రో’ లో మిల్క్ బ్యూటీ
బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్గా నితిన్ 30వ చిత్రం ‘మాస్ట్రో’ రూపుదిద్దుకొంది. ఇందులో నభా నటేశ్ హీరోయిన్గా, తమన్నా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకుడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఓ సరికొత్త పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘మాస్ట్రో’ టీమ్ నుంచి విడుదలైన తమన్నా తొలి లుక్ ఇదే! నల్ల కళ్లద్దాలతో భయపడుతూ నిల్చున్న నితిన్, అతని పక్కనే గన్ పట్టుకుని తమన్నా.. …
Read More »కాంగ్రెస్ పార్టీకి షాక్
కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎంపీ, మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితా దేవ్ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖను పంపారు. ఆమె రాజీనామాతో పార్టీకి ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సుస్మితా దేవ్ 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్పై అసోంలోని సిల్చార్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. తర్వాత ఆమెకు పార్టీ అధిష్ఠానం ఆల్ ఇండియా మహిళా …
Read More »చలో హుజురాబాద్ బస్సు యాత్రను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ హుజూరాబాద్లో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో దారులన్నీ హుజూరాబాద్ వైపు వెళ్తున్నాయి. నిర్మల్ నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, దళిత సోదరులు ప్రత్యేక బస్సులో తరలి వస్తున్నారు. ఈ బస్సు యాత్రను నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో దళిత సోదరులు హుజూరాబాద్కు బయలుదేరారు. మంత్రి మల్లా రెడ్డి …
Read More »దేశంలో కొత్తగా 32,937 కరోనా కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 32,937 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. తాజాగా 35,909 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అవగా.. మరో 417 మంది మహమ్మారి బారినపడి మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,22,25,513కు చేరింది. ఇందులో 3,14,924 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి మొత్తం 4,31,342 మంది ప్రాణాలను …
Read More »హుజూరాబాద్ లో దళిత బంధు సంబురం
హుజూరాబాద్ నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దళిత వాడలు మెరిసిపోతున్నాయి. ఆడపడుచులు మురిసిపోతున్నారు. దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో హుజూరాబాద్లోని దళిత కుటుంబాలు ముఖ్యమంత్రి కేసీఆర్కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటిని సుందరంగా అలంకరించుకున్నారు. తమ నివాసాల ముందు రంగవల్లులు వేసి.. దళిత బంధు అని చక్కగా రంగులు వేశారు. జై కేసీఆర్.. జై తెలంగాణ.. అనే పదాలు రాసి.. గులాబీ పార్టీపై తమకున్న అభిమానాన్ని …
Read More »నేటి నుంచే రాష్ట్రంలో రైతన్నకు రుణమాఫీ
స్వాతంత్య్ర దినోత్సవం మరుసటి రోజు నుంచే రాష్ట్రంలో రైతన్న రుణ విముక్తుడవనున్నాడు. రెండో విడుత పంటరుణాల మాఫీ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ దఫాలో బ్యాంకుల్లో రూ.50 వేలలోపు ఉన్న పంట రుణాలన్నింటినీ ప్రభుత్వం మాఫీ చేస్తున్నది. మొత్తం 6,06,811 మంది రైతులకు ప్రయోజనం కలుగనున్నది. ఇందుకోసం ప్రభుత్వం రూ.2,006 కోట్లు కేటాయించింది. ఈ మొత్తం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే వేయనున్నారు. ఈ నెలాఖరులోపు ప్రక్రియ …
Read More »నవశకానికి నాంది.. దళిత జనోద్ధరణలో తెలంగాణ సర్కారు మరో ముందడుగు..
‘ప్రజాస్వామ్యమంటే సమానత్వమే. వీలైనంత తొందరగా దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలను రూపుమాపాలి. దళితుల అభివృద్ధి అందుకు సోపానం కావాలి’ అన్న అంబేద్కర్ ఆశయాన్ని తెలంగాణ ప్రభుత్వం అక్షరాలా నెరవేరుస్తున్నది. స్వరాష్ట్రంలో దళిత జనోద్ధరణే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలు, ప్రత్యేక కార్యక్రమాలను అమలుచేస్తున్నది. తూతూ మంత్రంగా సాయంచేసి.. ఆర్భాటపు ప్రచారాలు చేసుకొని.. చేతులు దులుపుకోకుండా దళితుల సమస్యను మూలాల నుంచి పెకలించి వేసేందుకు కృషిచేస్తున్నది. ఎస్సీల్లో అన్ని వయసులు, అన్ని …
Read More »ఈటల రాజేందర్ నన్ను చంపాలనుకున్నాడు
బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ తనపై చేసిన అరాచకాలను గుర్తుచేసుకొని మాజీ మావోయిస్టు, తెలంగాణ ఉద్యమకారుడు పులవేణి పోచమల్లుయాదవ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. 2018లో ఈటల తనను చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. కెప్టెన్ లక్ష్మీకాంతారావు దయతో బతికి బట్టకట్టానని చెప్పారు. తనకు జన్మనిచ్చింది తన తండ్రి అయితే పునర్జన్మ ఇచ్చింది కెప్టెన్ లక్షీకాంతారావు అని తెలిపారు. ఆదివారం హుజూరాబాద్లో మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, ఎంపీ లక్ష్మీకాంతారావు సమక్షంలో ఆయన టీఆర్ఎస్లో …
Read More »దళిత బంధుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేడే శ్రీకారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 20వ శతాబ్దంలో సామాజిక న్యాయం ద్వారా దళితులకు విముక్తి కలిగిస్తే.. 21వ శతాబ్దంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల ఆర్థిక సాధికారతతో వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు. దళితుల ఆర్థిక …
Read More »