నాగార్జునసాగర్ నియోజకవర్గ కేంద్రం హాలియాకు సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కేసీఆర్ సాగర్ పర్యటనకు బయల్దేరారు. హాలియాకు చేరుకున్న సీఎం కేసీఆర్కు ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. హాలియా మార్కెట్యార్డులో ప్రజాప్రతినిధులు, అధికారులతో లిఫ్ట్ పథకాల పనుల పురోగతిపై కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యంగా నెల్లికల్, ఇతర …
Read More »రెండేళ్ల తర్వాత సాయి పల్లవి
దక్షిణాదిలో హీరోలతో సమానంగా పాపులారిటీ సంపాదించుకుంది అగ్ర నాయిక సాయిపల్లవి. ఎలాంటి పాత్రకైనా న్యాయం చేసే ప్రతిభ కలిగిన నటిగా పేరు తెచ్చుకుంది. తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ సొగసరి గత రెండేళ్లుగా తమిళ వెండితెరకు దూరంగా ఉంటోంది. సూర్య సరసన ‘ఎన్జీకే’ తర్వాత ఆమె బిగ్స్క్రీన్పై కనిపించలేదు. తాజా సమాచారం ప్రకారం సాయిపల్లవి తమిళంలో భారీ సినిమాను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. మహిళా ప్రధాన ఇతివృత్తంతో …
Read More »మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అల్లుడు బి.శ్రీనివాస్రెడ్డి(55) గుండెపోటుతో మృతి
మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అల్లుడు బి.శ్రీనివాస్రెడ్డి(55) గుండెపోటుతో మృతి చెందాడు. కోకాపేటలో ఉంటున్న ఆయనకు శనివారం సాయంత్రం గుండెపోటు రావడంతో వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందారు. మంత్రి సబితారెడ్డి ఆదివారం శ్రీనివాస్రెడ్డి మృతదేహానికి నివాళులర్పించి తీగల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అమెరికాలో ఉన్న శ్రీనివా్సరెడ్డి కుమార్తె వచ్చిన తర్వాత సాయంత్రం ఆరు గంటలకు జూబ్లీహిల్స్లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు.
Read More »తెలుగు సీతగా మృణాల్ ఠాకూర్
దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వినీదత్, ప్రియాంకా దత్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. ఇందులో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ కనిపించనున్నారు. ఆ రాముడికి జోడీగా, సీత పాత్రలో హిందీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. ఆదివారం సినిమాలో ఆమె ఫస్ట్లుక్తో పాటు వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. ‘బాట్లా హౌస్’, ‘సూపర్ 30’, ‘తూఫాన్’ తదితర హిందీ చిత్రాల్లో …
Read More »తెలంగాణ రైతాంగానికి శుభవార్త
బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రూ.50 వేల లోపు రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశమై రైతుల రుణమాఫీపై చర్చించింది. ఈ నెల 15వ తేదీ నుంచే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించి, నెలాఖరు కల్లా పూర్తిచేయాలని వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తాజా నిర్ణయంతో దాదాపు ఆరు లక్షల మంది రైతులు రుణ విముక్తులవుతారు. …
Read More »ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి
హుజూరాబాద్కు చెందిన టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కనున్నది. గవర్నర్కోటాలో ఇటీవల ఖాళీఅయిన ఎమ్మెల్సీ స్థానానికి ఆయన పేరును ఖరారుచేస్తూ ఆదివారం జరిగిన సమావేశంలో రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించింది. ఈ మేరకు గవర్నర్కు సిఫారసు చేసింది. ఆమోదం కోసం సంబంధిత ఫైల్ను రాజ్భవన్కు పంపింది. గవర్నర్ ఆమోదం తెలిపాక కౌశిక్రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్నారు. కౌశిక్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామాచేసి గతనెల 21న సీఎం కేసీఆర్ సమక్షంలో …
Read More »అందాలతో మత్తెక్కిస్తున్న ప్రగ్యా జైస్వాల్
మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. తొలి చిత్రం ప్రగ్యాకి పెద్దగా పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టలేదు. వరుణ్ తేజ్ కంచె సినిమాతో అందరి దృష్టి ఆకర్షించింది. ఈ సినిమా తర్వాత ప్రగ్యాకి ఆఫర్స్ వెల్లువలా వచ్చాయి. కాని ఏ సినిమా విజయం సాధించకపోవడంతో సైలైంట్ అయింది. బోయపాటి శ్రీను తెరకెక్కించిన జయాజానకి నాయక సినిమాలో సెకండ్ హీరోయిన్ గా …
Read More »ఈ నెల 16 నుంచి దళితబంధు అమలు
దళితబంధు పథకాన్ని ఈ నెల 16 నుంచి అమలుచేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేసింది. దళితులను పెట్టుబడిదారులుగా అభివృద్ధిచేయడం కోసం ప్రతి జిల్లాలో ‘సెంటర్ ఫర్ దళిత్ ఎంటర్ప్రైజ్’ ఏర్పాటుచేయాలని తీర్మానించింది. ఆదివారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన ఆరు గంటలకు పైగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రజాసంక్షేమానికి సంబంధించిన అనేక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. దళిత బంధు …
Read More »అందాలను ఆరబోస్తూ హీటెక్కిస్తున్న ‘హిట్’ బ్యూటీ
సోషల్ మీడియా ఆదరణ పెరిగాక నెటిజన్స్ కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఫ్రీగా దొరుకుతుంది. యాంకర్స్, నటీమణులు రెచ్చిపోయి ఫొటో షూట్స్ చేస్తూ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా రుహాని శర్మ సెక్సీ లుక్లో కనిపించి నెటిజన్స్ మతులు పోగొడుతుంది. తమిళంలో నాలుగేళ్ల క్రితం హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ టాలీవుడ్కి చిలసౌ తో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ …
Read More »దేశంలో కొత్తగా 41వేలకుపైగా కరోనా కేసులు
దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. మరోసారి 41వేలకుపైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 41,831 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. తాజాగా మరో 39,258 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు 3,08,20,521 మంది డిశ్చార్జి అయ్యారు. కొత్తగా 541 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 4,24,351కి చేరింది.ప్రస్తుతం దేశంలో 4,01,952 యాక్టివ్ కేసులున్నాయని …
Read More »