తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ గులాబీ గూటికి చేరారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఎల్ రమణ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రమణకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. కేటీఆర్ చేతుల మీదుగా ఎల్ రమణ.. టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా రమణకు కేటీఆర్తో పాటు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
Read More »తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగించి కొట్లాడుతాం : మంత్రి కేటీఆర్
కృష్ణా జలాల విషయంలో కానీ, ఇంకో విషయంలో కానీ రాజీ లేకుండా పోరాటం చేసేది ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. కానీ ఈ వివాదంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం ఎంతకైనా తెగించి కొట్లాడేది టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని కేటీఆర్ స్పష్టం చేశారు.మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో జవహర్ నగర్ …
Read More »మొక్కలు నాటిన హిమాన్షు
తెలంగాణ రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి తనయుడు హిమాన్షు.. తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన బాబాయి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్తో కలిసి హిమాన్షు.. ప్రగతి భవన్లో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా హిమాన్షు మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్, హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు అందరు పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. …
Read More »దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్
దేశ రాజకీయాల్లో దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ గారిని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు అన్నారు, PMGSY, జీవవైవిధ్య కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు చిట్యాల మండలంలోని నేరడ-ఎలికట్టె గ్రామ సరిహద్దుల్లో రోడ్డుకు ఇరువైపులా ఆయన మొక్కలు నాటారు, ఈ సందర్భంగా ఆయన ఇరు గ్రామాల ప్రజలతో కలిసి మొక్కలు నాటారు. తొలుత నేరడ గ్రామంలోని ఎస్సి కాలనీ …
Read More »రేపే తెలంగాణ మంత్రి మండలి సమావేశం
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ వేగవంతం అయింది.ఉద్యోగ నియామకాల ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రణాళికలు చేస్తున్నారు. ఉద్యోగ ఖాళీలపై ఆర్థికశాఖ ప్రత్యేకంగా అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్వోడీలతో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు శని, ఆదివారాల్లో సమావేశమయ్యారు. ఆదివారం ఎంసీహెచ్ఆర్డీలో నిర్వహించిన సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్రావు కూడా అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 32 …
Read More »నేడు టీఆర్ఎస్ లోకి ఎల్ రమణ
టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ నేడు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటారు. కేటీఆర్ చేతుల మీదుగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటారు. కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొంటారు. ఈ నెల 16న ఎల్ రమణ తన అనుచరులు, టీడీపీ నేతలు, పెద్ద …
Read More »బీజేపీ నేతలపై తిరగబడిన రైతులు
పంజాబ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకుడు భూపేశ్ అగర్వాల్, ఆ పార్టీకి చెందిన స్థానిక నేతలపై రైతులు దాడి చేశారు. పాటియాలా జిల్లాలోని రాజ్పురాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. అయితే పోలీసులే దగ్గరుండి ఈ దాడి చేయించారని బీజేపీ నేత భూపేశ్ అగర్వాల్ ఆరోపించారు. డీఎస్పీ తివానా మద్దతుతో సుమారు 500 మంది రైతులు తనను కొట్టారని ఆయన అన్నారు. డీఎస్పీ ఉద్దేశపూర్వకంగానే తనను తప్పుడు వైపునకు పంపారని …
Read More »మంత్రి గంగుల కమలాకర్ గొప్ప మనసు
ఆపన్నులకు అందుబాటులో ఉంటూ ఆదుకునే కేటీఆర్ గారి చొరవతో మరో కుటుంబానికి అండ దొరికింది, కరీంనగర్కు చెందిన కదాసి అనూష కుమారుడు 17 నెలల విశ్వకు రెండు నెలల క్రితం గుండె ఆపరేషన్ జరిగింది. చాలా క్లిష్టమైన ఈ ఆపరేషన్కు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు అయింది. బాధిత కుటుంబం సహాయం కోసం మంత్రి కేటీఆర్ను ట్విట్టర్ ద్వారా అర్థించింది. వెంటనే స్పందించిన కేటీఆర్ స్థానిక మంత్రి అయిన గంగుల …
Read More »మొక్కలు నాటిన మంత్రులు పువ్వాడ,ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం కార్పొరేషన్ వెలుగుమట్ల అర్బన్ ఫారెస్ట్ నందు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2వేల పండ్లు, పూలు, వివిధ రకాల మొక్కలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు గారు మొక్కలు నాటి ప్రారంభించారు. ఎంపీ నామా నాగేశ్వరరావు గారు, మేయర్ పునుకొల్లు నీరజ గారు, …
Read More »మణిశర్మ బర్త్ డే స్పెషల్ -నారప్ప పాట విడుదల
స్వర బ్రహ్మ మణిశర్మ ఒకప్పుడు అద్బుతమైన బాణీలతో శ్రోతలను ఎంతగా అలరించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చిన ఆయన ఇప్పుడు వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు. చిరంజీవి ఆచార్య, వెంకటేష్ నారప్ప, గోపిచంద్ సీటీమారం, రామ్ 19వ చిత్రాలతో బిజీగా ఉన్నారు.అయితే మణిశర్మ బర్త్ డే సందర్భంగా నారప్ప చిత్రం నుండి చలాకీ చిన్మమ్మి అనే సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ శ్రోతలని ఎంతగానో అలరిస్తుంది.నారప్ప చిత్రం …
Read More »